Intimate Scenes: ఆ సీన్లలో కట్ చెప్పినా హీరోలు వినరు.. హీరోయిన్లను బలవంతపెడతారు.. ప్రియాంక నాతో కిస్ సీన్ చేయలేదు: నటుడు

Intimate Scenes: బాలీవుడ్ సీనియర్ నటుడు అన్నూ కపూర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. సినిమాల్లో వచ్చే ఇంటిమేట్ సీన్స్ విషయంలో హీరోలు నియంత్రణ కోల్పోతున్నారని, డైరెక్టర్లు కట్ చెప్పినా వినకుండా దానిని తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారని వెల్లడించాడు.

Published on: Apr 29, 2026, 14:32:06 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Intimate Scenes: సినిమా ఇండస్ట్రీలో ఇంటిమేట్ సీన్స్ (శృంగార సన్నివేశాలు) చిత్రీకరణపై సీనియర్ నటుడు అన్ను కపూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొందరు హీరోలు ఉద్దేశపూర్వకంగానే హీరోయిన్ల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తారని ఆయన బాంబు పేల్చారు.

Intimate Scenes: ఆ సీన్లలో కట్ చెప్పినా హీరోలు వినరు.. హీరోయిన్లను బలవంతపెడతారు.. ప్రియాంక నాతో కిస్ సీన్ చేయలేదు: నటుడు
Intimate Scenes: ఆ సీన్లలో కట్ చెప్పినా హీరోలు వినరు.. హీరోయిన్లను బలవంతపెడతారు.. ప్రియాంక నాతో కిస్ సీన్ చేయలేదు: నటుడు

'కట్' చెప్పినా ఆపని హీరోలు..

ఇటీవల ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న అన్ను కపూర్, సెట్స్‌పై ఇంటిమేట్ సీన్స్ చిత్రీకరించేటప్పుడు జరిగే కొన్ని చేదు అనుభవాలను పంచుకున్నారు. షూటింగ్ సమయంలో కొందరు నటులు తమ నియంత్రణ కోల్పోతారని, దర్శకుడు 'కట్' చెప్పినా వినకుండా నటీమణులతో అసభ్యంగా ప్రవర్తిస్తారని ఆయన ఆరోపించారు.

"నేను కళ్లారా చూసిన ఒక సంఘటన గురించి చెబుతాను. ఒక ఇంటిమేట్ సీన్ షూట్ చేస్తుండగా హీరో అత్యుత్సాహం ప్రదర్శించాడు. డైరెక్టర్ కట్ చెప్పిన తర్వాత కూడా అతను హీరోయిన్ ను వదలకుండా అలాగే కొనసాగించాడు. ఆ హీరోయిన్ అతని నుంచి తప్పించుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆ ఘటనతో ఆమె ఎంతలా వణికిపోయిందంటే.. దాదాపు రెండు రోజుల పాటు తన గదిలో నుంచి బయటకు రాలేదు" అని అన్ను కపూర్ వెల్లడించారు. అయితే ఆ నటీనటుల పేర్లను బయటపెట్టడానికి ఆయన నిరాకరించారు.

ప్రియాంక చోప్రా వివాదంపై స్పందన

విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో వచ్చిన '7 ఖూన్ మాఫ్' సినిమాలో ప్రియాంక చోప్రాతో తనకున్న అనుభవాన్ని కూడా అన్ను కపూర్ గుర్తుచేసుకున్నారు. ఆ సినిమాలో ఒక కిస్సింగ్ సీన్ ఉందని, కానీ తనతో ఆ సీన్ చేయడానికి ప్రియాంక కంఫర్టబుల్‌గా లేదని ఆయన తెలిపారు.

"దర్శకుడు ఆ సీన్ కథలో భాగమేనని చెప్పినా, ప్రియాంక మాత్రం అందుకు అంగీకరించలేదు. నేను కూడా దానిని పెద్దగా పట్టించుకోలేదు. కానీ నేను అందంగా లేనందువల్లే ఆమె నాతో నటించడానికి నిరాకరించిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఒకవేళ నా స్థానంలో ఒక పెద్ద స్టార్ హీరో ఉంటే ఆమె కచ్చితంగా అభ్యంతరం చెప్పేది కాదు. నా లుక్స్, నా పర్సనాలిటీ చూసి ఆమె అలా చేసి ఉండవచ్చు" అని అన్ను కపూర్ గతంలో చేసిన వ్యాఖ్యలను మరోసారి గుర్తుచేశారు.

వృత్తిపరమైన బాధ్యత ముఖ్యం

ఇలాంటి సన్నివేశాల్లో తాను ఎప్పుడూ హుందాగా వ్యవహరిస్తానని అన్ను కపూర్ చెప్పుకొచ్చారు. "నాతో నటించే నటి ఒకవేళ ఇబ్బందిగా ఫీలవుతుంటే.. నేను ఆమె కంఫర్టబుల్ గా ఉందా లేదా అన్నది చూస్తాను. అంతకు మించి ఏమీ మాట్లాడను. సెట్‌లో నటీనటుల మధ్య పరస్పర గౌరవం ఉండాలి. కొందరు కావాలనే ఇలాంటి పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటారు. కానీ నేను అలాంటి పనులు ఎప్పుడూ చేయలేదు" అని ఆయన స్పష్టం చేశారు.

అన్ను కపూర్ కెరీర్ అప్‌డేట్స్

గతేడాది సెప్టెంబర్ 19న విడుదలైన 'జాలీ ఎల్ఎల్‌బి 3' (Jolly LLB 3)లో అక్షయ్ కుమార్, అర్షద్ వార్సీలతో కలిసి నటించిన అన్ను కపూర్.. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నారు.

ప్రస్తుతం ఆయన ప్రఖ్యాత దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కించబోయే ఒక కామెడీ డ్రామాలో నటించబోతున్నారు. ఇందులో పంకజ్ త్రిపాఠి, సౌరభ్ శుక్లా వంటి దిగ్గజ నటులు కూడా ఉండటం విశేషం.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. అన్ను కపూర్ ఏ హీరో గురించి ఆరోపణలు చేశారు?

అన్ను కపూర్ ఆ హీరో పేరును వెల్లడించలేదు. కానీ 'కట్' చెప్పిన తర్వాత కూడా ఒక నటితో అసభ్యంగా ప్రవర్తించాడని, ఆమె భయంతో రెండు రోజులు బయటకు రాలేదని మాత్రం చెప్పారు.

2. ప్రియాంక చోప్రాతో అన్ను కపూర్‌కు వచ్చిన వివాదం ఏమిటి?

'7 ఖూన్ మాఫ్' షూటింగ్ సమయంలో తనతో ముద్దు సీన్ చేయడానికి ప్రియాంక నిరాకరించిందని అన్ను కపూర్ పేర్కొన్నారు. తాను అందంగా లేనందువల్లే ఆమె అలా ప్రవర్తించి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More