ఇటీవల నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ వరుసగా విమర్శల పాలు అవుతున్నారు. తాజాగా నవంబర్ 30న జరిగిన సఃకుటుంబానాం ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో కూడా రాజేంద్ర ప్రసాద్ నోరు జారిన విషయం తెలిసిందే. బ్రహ్మానందంపై రాజేంద్ర ప్రసాద్ నోరు జారడంతో ఇంటర్నెట్లో ఆయనపై విమర్శల దాడి జరిగింది.
విమర్శలు, వివాదంలో

ఈ విమర్శలు, వివాదంలో పడిపోయి సఃకుటుంబానాం ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడిన విషయాలను పక్కకు పెట్టేశారు. ఈ క్రమంలో ఆ ఈవెంట్లో నటుడు రాజేంద్ర ప్రసాద్ కామెంట్స్, చెప్పిన ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటో ఓసారి తెలుసుకుందాం.
మరోసారి కలిసి నటించడం
నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. "సభా సరస్వతికి, నా తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. బ్రహ్మానందంతో మరొకసారి కలిసిన నటించడం, మధు పనిచేసిన వారంతా ఉన్నత స్థాయిలకు అడగడం, వారిని ఈ స్టేజిపై చూడటం నాకు ఎంతో సంతోషం ఇచ్చింది" అని అన్నారు.
వివిధ యాసలను
"ఒక నటుడు ఎంతో కాలం పాటు చిత్ర పరిశ్రమలో కనిపిస్తూ ఉండటం అనేది ఎంతో ప్రత్యేకమైన విషయం. ఒక నటుడు అలా కనిపించాలి అంటే తాము వేసే పాత్ర ప్రేక్షకులను అంతగా మెప్పించాలి. వివిధ ప్రాంతీయ భాష యాసలను సినిమాలలో మాట్లాడుతూ ప్రతి ప్రాంతం వారికి దగ్గర వాడిని అయ్యాను" అని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.
48 ఏళ్లలో వినలేదు
"ఒక కొత్త పాత్రతో మా దగ్గరకు కథ వచ్చిన ప్రతిసారి ఆశ్చర్యపోతూ ఉంటాము. సఃకుటుంబానాం వంటి కథ 48 సంవత్సరాలలో నేను ఎప్పుడూ వినలేదు, చేయలేదు. ఈ సినిమా అంత ప్రత్యేకంగా ఉండబోతుంది. నన్ను ఒక నటుడుగా తీర్చిదిద్దిన మహనీయుడు ఎన్టీ రామారావు గారు. ఆయన దగ్గర నేర్చుకున్న పని అందరికీ ఉపయోగపడటం గర్వించదగిన విషయం" అని ఎన్టీఆర్ను గుర్తు చేసుకున్నారు రాజేంద్ర ప్రసాద్.
ఎలాంటి పాత్ర అయినా
"'ఆ నలుగురు' సినిమాలో నన్ను చూసినవారు అంత రాజేంద్రప్రసాద్ ఎలాంటి పాత్రనైనా చేయగలనుకున్నారు. సఃకుటుంబానాం వంటి సినిమాలో నాకు ఇచ్చిన పాత్ర చాలా ఛాలెంజ్లు ఉన్నాయి. ఒక మనిషికి కుటుంబం ఎంత అవసరం అనేది తెలియజేస్తూ, కుటుంబ నేపథ్యంలో కుటుంబ గొప్పతనాన్ని, ప్రాముఖ్యతను తెలుపుతూ రానున్న చిత్రం సఃకుటుంబానాం. కచ్చితంగా ఈ చిత్రం ప్రేక్షకులు అందరికీ నచ్చుతుంది" అని రాజేంద్ర ప్రసాద్ జోస్యం చెప్పారు.
ఎంతో శ్రద్ధతో నేర్చుకుని
{{/usCountry}}"'ఆ నలుగురు' సినిమాలో నన్ను చూసినవారు అంత రాజేంద్రప్రసాద్ ఎలాంటి పాత్రనైనా చేయగలనుకున్నారు. సఃకుటుంబానాం వంటి సినిమాలో నాకు ఇచ్చిన పాత్ర చాలా ఛాలెంజ్లు ఉన్నాయి. ఒక మనిషికి కుటుంబం ఎంత అవసరం అనేది తెలియజేస్తూ, కుటుంబ నేపథ్యంలో కుటుంబ గొప్పతనాన్ని, ప్రాముఖ్యతను తెలుపుతూ రానున్న చిత్రం సఃకుటుంబానాం. కచ్చితంగా ఈ చిత్రం ప్రేక్షకులు అందరికీ నచ్చుతుంది" అని రాజేంద్ర ప్రసాద్ జోస్యం చెప్పారు.
ఎంతో శ్రద్ధతో నేర్చుకుని
{{/usCountry}}"ఈ చిత్రంలో హీరోగా నటించిన రామ్ కిరణ్ ఎంతో శ్రద్ధతో నేర్చుకుని నటించారు. అలాగే ఈ సినిమాలో నటీనటులు అంతా కూడా అద్భుతంగా నటించారు. నిర్మాత మహదేవ్ గౌడ్ గారు ఇటువంటి సినిమాలు మరిన్ని తీయాలని, తరువాత తరాలకు ఉపయోగపడే ఇటువంటి సినిమాలు మరిన్ని రావాల్సిందిగా కోరుకుంటున్నాను. సఃకుటుంబానాం చిత్రాన్ని థియేటర్లో చూడాల్సిందిగా అందరిని కోరుకుంటున్నాను" అని తన స్పీచ్ ముగించారు రాజేంద్ర ప్రసాద్.