నా సీన్ వస్తుంటే వాళ్లు కళ్లు మూసుకునేలా ఉండకూడదు.. హీరోయిన్ నిహారిక కామెంట్స్
తెలుగులోకి సోషల్ మీడియా ఇన్ఫ్ల్యూయెన్సర్, యూట్యూబర్ నిహారిక ఎన్ఎమ్ హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోంది. నిహారిక హీరోయిన్గా చేసిన మిత్ర మండలి మూవీలో హీరోగా ప్రియదర్శి చేశాడు. విజయేందర్ దర్శకత్వం వహించిన మిత్ర మండలి సినిమా విశేషాలను, పర్సనల్ విషయాలను హీరోయిన్ నిహారిక చెప్పుకొచ్చింది.
సోషల్ మీడియా ఇన్ఫ్ల్యూయెన్సర్గా, యూట్యూబర్గా చాలా ఫేమస్ అయింది బ్యూటిఫుల్ నిహారిక ఎన్ఎమ్. ఇన్స్టాగ్రామ్లో కడుపుబ్బా నవ్వించే కామెడీ వీడియోలు, రీల్స్ చేసి నెటిజన్స్ దృష్టిని ఆకర్షించింది నిహారిక ఎన్ఎమ్. అలాగే, టాలీవుడ్ పెద్ద హీరోలతో కొలబారేషన్ వీడియోలు సైతం చేసి అట్రాక్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

మహేశ్ బాబు-యశ్తో
మహేశ్ బాబు, అడవి శేష్తో మేజర్ సినిమా, విజయ్ దేవరకొండతో లైగర్ మూవీ ప్రమోషన్స్లో భాగంగా కంటెంట్ వీడియోలు చేసిన నిహారిక కన్నడ స్టార్ హీరో యశ్తో కూడా చేసింది. ఇలా ఎంతో క్రేజ్ తెచ్చుకున్న నిహారిక ఎన్ఎమ్ తమిళంలో పెరుసు సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు తెలుగులో హీరోయిన్గా అలరించడానికి రెడీగా ఉంది ఈ ముద్దుగుమ్మ.
తెలుగులో ఎంట్రీ మూవీ
నిహారిక ఎన్ఎమ్ హీరోయిన్గా తెలుగులో ఎంట్రీ ఇస్తున్న సినిమా మిత్ర మండలి. ఈ మూవీలో హీరోగా ప్రియదర్శి చేశాడు. విజయేందర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు బీవీ వర్క్స్ బ్యానర్ మీద బన్నీ వాస్ సమర్పణలో కళ్యాణ్ మంథిన, భాను ప్రతాప, డా. విజేందర్ రెడ్డి తీగల నిర్మించారు.
నిహారిక కామెంట్స్
అక్టోబర్ 16న మిత్ర మండలి సినిమా థియేటర్లలో గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్లో భాగంగా మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ నిహారిక ఎన్ఎమ్ ఇంట్రెస్టింగ్ విషయాలు, కామెంట్స్ చేసింది.
తెలుగు ఇండస్ట్రీలో వర్క్ చేశారు. టాలీవుడ్ గురించి మీకు ఏర్పడిన అభిప్రాయం ఏంటి? ఎలాంటి చిత్రాల్ని మున్ముందు చేయాలని అనుకుంటున్నారు?
-ఇండస్ట్రీలో ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అనుభవం ఎదురవుతుంది. బయట ప్రపంచంలో ఇండస్ట్రీ గురించి మాత్రం రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. మన హద్దుల్లో మనం ఉంటే ఏమీ కాదు. తెరపై నన్ను మా ఫ్యామిలీ హాయిగా చూసుకునేలా ఉండాలి. నా సీన్ వస్తుంటే వాళ్లు కళ్లు మూసుకునేలా ఉండకూడదు.
‘మిత్ర మండలి’ చిత్రం ఎలా ఉంటుంది? ఈ మూవీ నుంచి ఆడియెన్స్ ఏం ఆశించి థియేటర్కు రావాలి?
-‘మిత్ర మండలి’ చిత్రంలో కథ, కథనం చాలా కొత్తగా ఉంటుంది. అందరినీ నవ్వించేలా మా చిత్రం ఉంటుంది. థియేటర్కు వచ్చిన ప్రతీ ఒక్కరినీ హాయిగా నవ్వించేస్తుంది.
‘మిత్ర మండలి’ దర్శక, నిర్మాతల గురించి చెప్పండి?
-తెలుగు చిత్ర సీమ నన్ను ఎంతో సాదరంగా ఆహ్వానించింది. దర్శక, నిర్మాతలు నన్ను సొంత ఫ్యామిలీలా చూసుకున్నారు. టాలీవుడ్లో దొరికినంత ప్రేమ, కంఫర్ట్ నాకు ఇంకెక్కడా దొరకలేదు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


