Adarsha Kutumbam Glimpse: విక్టరీ వెంకటేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ 'ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47' (AK47) నుంచి మేకర్స్ అదిరిపోయే స్పెషల్ గ్లింప్స్ విడుదల చేశారు. ఈ సినిమాలో 'చిట్టిబాబు' అనే సరదా క్యారెక్టర్లో వెంకీ మామ కనిపించబోతుండగా, ఆయన వింటేజ్ కామెడీ టైమింగ్తో అభిమానులను ఖుషీ చేశారు.
వంటగదిలో వెంకీ మామ రచ్చ.. స్వర్ణగా శ్రీనిధి శెట్టి!

సోమవారం (జులై 27) ఆదర్శ కుటుంబం మూవీ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్లో హీరోయిన్ శ్రీనిధి శెట్టి (స్వర్ణ) ఒక మోడరన్ ఇంట్లో తిరుగుతూ కనిపిస్తుంది. ఇంటి పనులు చేయడం, వంట వండడంలో తన భర్త చిట్టిబాబు (వెంకటేష్) ఎంత పర్ఫెక్టో సరదాగా ఆటపట్టిస్తూ టీజ్ చేస్తుంది. ఒక ఊహించని ట్విస్ట్తో 'మ్యాన్ ఆఫ్ ది హౌస్'గా వెంకటేష్ క్యారెక్టర్ను పరిచయం చేసిన తీరు సినిమాపై అంచనాలను పెంచేసింది.
ఈ గ్లింప్స్ చివర్లో యంగ్ హీరో నారా రోహిత్ అనుకోని ఎంట్రీ ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. వెంకటేశ్, శ్రీనిధి శెట్టి జంటను చూస్తూ "ఇదిగోండి మన ఆదర్శ కుటుంబం" అని నారా రోహిత్ చెప్పే డైలాగ్ గ్లింప్స్కు మెయిన్ హైలైట్గా నిలిచింది.
మ్యాజికల్ కాంబో రిపీట్.. రెండు దశాబ్దాల కల నెరవేరింది
వెంకటేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్కు టాలీవుడ్లో ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతంలో 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి' లాంటి ఆల్-టైమ్ క్లాసిక్స్ సినిమాలకు త్రివిక్రమ్ అందించిన కథ, మాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్. వీరిద్దరి కాంబోలో పూర్తిస్థాయి సినిమా ఎప్పుడు వస్తుందా అని తెలుగు ప్రేక్షకులు గత 20 ఏళ్లుగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇటీవలే 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు సాధించి విక్టరీ వెంకటేష్ తన సత్తా చాటారు. ఇప్పుడు త్రివిక్రమ్ మార్క్ పంచు డైలాగులు, ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ ఎలిమెంట్స్ తో రాబోతున్న ఈ సినిమా మరో బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ అవ్వడం ఖాయమని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.
భారీ తారగణం.. దసరా కానుకగా అక్టోబర్ 2న రిలీజ్!
{{/usCountry}}ఇటీవలే 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు సాధించి విక్టరీ వెంకటేష్ తన సత్తా చాటారు. ఇప్పుడు త్రివిక్రమ్ మార్క్ పంచు డైలాగులు, ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ ఎలిమెంట్స్ తో రాబోతున్న ఈ సినిమా మరో బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ అవ్వడం ఖాయమని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.
భారీ తారగణం.. దసరా కానుకగా అక్టోబర్ 2న రిలీజ్!
{{/usCountry}}ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో నివేథా పేతురాజ్, యువినా, రాజ్ ప్రజ్వల్, రావు రమేష్, సత్య, బ్రహ్మాజీ, ఉదయ్బీర్ సంధు, వెన్నెల కిషోర్, రఘుబాబు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సంగీత దర్శకుడు తమన్ ఎస్ ఈ సినిమాకు డిఫరెంట్ ట్యూన్స్, అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ వినోదాత్మక చిత్రం దసరా కానుకగా 2026 అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.