రణ్వీర్ సింగ్ నటించిన 'ధురంధర్ 2: ది రివెంజ్' చిత్రంపై తాజాగా టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రశంసల జల్లు కురిపించారు. సోమవారం ఎక్స్ (X) వేదికగా ఈ సినిమాను అద్భుతమైన రైడ్ అని అభివర్ణించారు. "ఈ చిత్రం నా మనసును కదిలించింది, దీని గురించి ఆలోచించడం ఆపలేకపోతున్నాను" అని ఆయన పేర్కొన్నారు.
అన్నపూర్ణ స్టూడియోస్ గర్వకారణం

దర్శకుడు ఆదిత్య ధర్, టెక్నికల్ టీమ్ పనితీరును నాగార్జున ప్రత్యేకంగా అభినందించారు. ధురంధర్ 2 సినిమా సౌత్ ఇండియా లోకలైజేషన్, డాల్బీ సినిమా ప్రాసెసింగ్ తమ అన్నపూర్ణ స్టూడియోస్లో జరగడం గర్వంగా ఉందని నాగ్ చెప్పారు. సినిమా మేకింగ్ ప్రమాణాలను ఈ చిత్రం మరో స్థాయికి తీసుకెళ్లిందని కొనియాడారు.
నాగార్జున రివ్యూ
‘‘అద్భుతమైన సినిమా ధురంధర్ ది రివేంజ్ ను చూశా. వాట్ ఏ రైడ్. ఇది మైండ్ బ్లోయింగ్ మూవీ. దీని గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నా. ఫిల్మ్ మేకింగ్ ను మార్చిన సినిమాల్లో ఇది ఒకటి. ఇన్స్పైరింగ్ డైరెక్టర్ ఆదిత్య ధర్ కు కంగ్రాచ్యులేషన్స్. మొత్తం టీమ్ కు, నటులకు అభినందనలు’’ అని తన రివ్యూలో నాగార్జున రాసుకొచ్చారు.
రాజమౌళి కూడా
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కూడా ధురంధర్ 2 సినిమాను చూసి ఫిదా అయిన సంగతి తెలిసిందే. ధురంధర్ సినిమా మొదటి భాగం కంటే 'ది రివెంజ్' స్కేల్, ఆత్మ పరంగా ఒరిజినల్ను అధిగమించిందని రాజమౌళి ప్రశంసించారు. రణ్వీర్ సింగ్ పోషించిన హమ్జా, జస్కిరత్ సింగ్ రంగీ పాత్రల లోతు అద్భుతంగా ఉందని ఆయన కొనియాడారు.
రికార్డుల వేట
స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ధురంధర్ 2 బాక్సాఫీస్ మోత మోగిస్తోంది. కేవలం నాలుగు రోజుల్లోనే భారతదేశంలో రూ.450 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ.750 కోట్లు వసూలు చేసింది. వరుసగా రెండు రోజులు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి చరిత్ర సృష్టించింది.
{{/usCountry}}స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ధురంధర్ 2 బాక్సాఫీస్ మోత మోగిస్తోంది. కేవలం నాలుగు రోజుల్లోనే భారతదేశంలో రూ.450 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ.750 కోట్లు వసూలు చేసింది. వరుసగా రెండు రోజులు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి చరిత్ర సృష్టించింది.
{{/usCountry}}మొదటి భాగం ధురంధర్ మూవీ సాధించిన రూ.1300 కోట్ల కలెక్షన్ల రికార్డును ధురంధర్ 2 సునాయాసంగా బద్దలు కొడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
పాకిస్థాన్ గడ్డపై గూఢచారి యుద్ధం
ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ ధురంధర్ సీక్వెల్, పాకిస్థాన్లోని లియారీ ముఠాల్లోకి చొరబడిన భారత గూఢచారి కథాంశంతో సాగుతుంది. ముఠా లోపలి నుంచి ఉగ్రవాద నెట్వర్క్ను కూల్చివేసే సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. అర్జున్ రాంపాల్, ఆర్.మాధవన్, సంజయ్ దత్, సారా అర్జున్, రాకేష్ బేడీ తదితరులు కూడా ఈ సినిమాలో నటించారు.