Dhurandhar 2: తొలి రోజు ధురంధర్ 2 బ్రేక్ చేసిన 7 బాక్సాఫీస్ రికార్డులు ఇవే.. పవన్ కల్యాణ్ ఓజీ రికార్డు కూడా..
Dhurandhar 2: ధురంధర్ 2 మూవీ రిలీజైన తొలి రోజే ఏకంగా ఏడు బాక్సాఫీస్ రికార్డులను తిరగ రాసింది. అందులో గతేడాది పవన్ కల్యాణ్ ఓజీ మూవీ క్రియేట్ చేసిన రికార్డు కూడా ఉంది. రణ్వీర్ సింగ్ బ్రేక్ చేసిన ఆ సినిమాల రికార్డులేవో చూడండి.
డైరెక్టర్ ఆదిత్య ధర్ తీసిన 'ధురంధర్ ద రివెంజ్' గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర ఒక అద్భుతమైన ఓపెనింగ్ సాధించింది. తొలి రోజే ఈ సినిమా ఒక రోరింగ్ సక్సెస్ అని నిరూపించుకుంది. రిలీజ్ అయిన మొదటి రోజే ఇండియాలో రూ.145 కోట్ల నెట్, వరల్డ్వైడ్గా రూ. 240 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఇండియన్ సినిమా చరిత్రలోనే ఒక అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ క్రమంలో రణ్వీర్ సింగ్ నటించిన ఈ స్పై థ్రిల్లర్ అటు బాలీవుడ్, ఇటు పాన్ ఇండియా లెవల్లో ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది.

ఒక బాలీవుడ్ సినిమాకు హైయెస్ట్ వరల్డ్వైడ్ ఓపెనింగ్
ఫస్ట్ డే కలెక్షన్స్, అలాగే రికార్డ్ బ్రేకింగ్ పెయిడ్ ప్రీమియర్స్ దెబ్బకు ధురంధర్ 2 ప్రపంచవ్యాప్తంగా రూ.240 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇందులో ఓవర్సీస్ నుంచి వచ్చిన దాదాపు 9.5 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి. ఇంతకుముందు ఈ రికార్డ్ 2023లో రూ.129 కోట్లతో షారుఖ్ ఖాన్ జవాన్ పేరిట ఉండేది. అలాగే 2024లో అల్లు అర్జున్ పుష్ప 2 సాధించిన రూ.274 కోట్ల స్టార్ట్ తర్వాత, ఏ ఇండియన్ సినిమాకైనా ఇది సెకండ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ అని చెప్పొచ్చు.
ఇండియాలో బాలీవుడ్ హైయెస్ట్ ఓపెనింగ్
ఇండియాలో ధురంధర్ 2 ఏకంగా రూ.145 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. ఇందులో రూ.43 కోట్ల పెయిడ్ ప్రీమియర్స్ కూడా ఉన్నాయి. జవాన్ సాధించిన రూ.75 కోట్ల మార్క్ను బీట్ చేస్తూ ఒక హిందీ సినిమాకు ఇది రికార్డ్ ఓపెనింగ్. ఇక్కడ కూడా ఈ స్పై థ్రిల్లర్ అల్లు అర్జున్ పుష్ప 2 (రూ.164 కోట్ల నెట్) తర్వాత సెకండ్ ప్లేస్లో నిలిచింది.
ఇండియన్ సినిమాకు ప్రీమియర్స్ నుంచి హైయెస్ట్ కలెక్షన్స్
బుధవారం (మార్చి 18) వేసిన పెయిడ్ ప్రీమియర్స్ ద్వారానే ధురంధర్ 2 ఇండియాలో రూ.43 కోట్ల నెట్, వరల్డ్వైడ్గా రూ.75 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. గత ఏడాది పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాకు వచ్చిన రూ.25 కోట్ల మార్క్ను బీట్ చేస్తూ ఇది ఒక సరికొత్త ఇండియన్ రికార్డ్ క్రియేట్ చేసింది.
బాలీవుడ్లో హైయెస్ట్ సింగిల్ డే కలెక్షన్
పెయిడ్ ప్రీమియర్స్ను పక్కన పెట్టినా సరే, గురువారం (మార్చి 19) రోజు ధురంధర్ 2 ఒక సూపర్ ఫీట్ సాధించింది. ఆ ఒక్కరోజే ఈ సినిమా ఇండియాలో రూ.102 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. ఒక బాలీవుడ్ సినిమా సింగిల్ డేలో ఇంత కలెక్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్. ఇంతకుముందు ఈ రికార్డ్ జవాన్ సినిమా పేరిట ఉండేది. ఆ సినిమా తన ఫస్ట్ సండే (నాలుగో రోజు) రూ.80 కోట్లు రాబట్టింది.
హిందీలో ఫాస్టెస్ట్ రూ.100 కోట్ల క్లబ్ మూవీ
ఆమిర్ ఖాన్ గజినీ సినిమా ఇండియాలో ఫస్ట్ టైమ్ రూ.100 కోట్ల నెట్ కలెక్ట్ చేసి ఈ క్లబ్ను మొదలుపెట్టింది. ఇప్పుడు ధురంధర్ 2 తన ఓపెనింగ్ డే నాడే ఆ మైల్స్టోన్ను అందుకొని, అలా చేసిన ఫస్ట్ హిందీ సినిమాగా నిలిచింది. గతంలో పఠాన్, యానిమల్, జవాన్, స్త్రీ 2 లాంటి సినిమాలు ఈ మార్క్ చేరుకోవడానికి కనీసం రెండు రోజులు టైమ్ తీసుకున్నాయి.
రూ.200 కోట్లకు జాయింట్ ఫాస్టెస్ట్ ఇండియన్ ఫిల్మ్
వరల్డ్వైడ్గా రూ.200 కోట్ల గ్రాస్ క్రాస్ చేయడానికి ధురంధర్ 2కి కేవలం ఒక్కరోజు మాత్రమే పట్టింది. ఏ ఇండియన్ సినిమాకైనా ఇది జాయింట్ ఫాస్టెస్ట్ ఫీట్ అని చెప్పాలి. ఇంతకుముందు బాహుబలి 2, ఆర్ఆర్ఆర్, పుష్ప 2 సినిమాలు కూడా రిలీజ్ అయిన రోజే ఈ ఫీట్ సాధించాయి.
బుక్మైషోలో గంటకు అత్యధిక టికెట్లు అమ్ముడైన సినిమా
శుక్రవారం (మార్చి 20) రోజు ధురంధర్ 2 ఒక కొత్త బెంచ్మార్క్ సెట్ చేసింది. ఇండియా వ్యాప్తంగా వేరే ప్లాట్ఫామ్స్, స్పాట్ బుకింగ్స్ ద్వారా 25 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. ఇండియాలోనే అతిపెద్ద ఆన్లైన్ టికెటింగ్ ప్లాట్ఫామ్ అయిన బుక్మైషోలో రద్దీ బాగా కనిపించింది. ఒకానొక టైమ్లో కేవలం ఒక్క గంటలోనే ఈ ప్లాట్ఫామ్లో 1.47 లక్షల టికెట్లు బుక్ అయ్యాయి. ఇంతకుముందు పుష్ప 2 సెట్ చేసిన 1.45 లక్షల రికార్డును ఇది బ్రేక్ చేసింది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


