Bhoot Bangla: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రియదర్శన్ కాంబినేషన్ అంటేనే ప్రేక్షకులకు వినోదాల విందు. వీరిద్దరి కలయికలో సుమారు 14 ఏళ్ల తర్వాత వచ్చిన హారర్ కామెడీ చిత్రం 'భూత్ బంగ్లా' ఏప్రిల్ 17, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ మూవీ పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది.
భూత్ బంగ్లా

భూత్ బంగ్లా సినిమాలో అక్షయ్ కుమార్ పోషించిన 'అర్జున్' అనే పాత్రకు తన పూర్వీకుల నుంచి మంగళపూర్లోని 'ఆచార్య నివాస్' అనే భారీ బంగ్లా వారసత్వంగా వస్తుంది. తన సోదరి పెళ్లి కోసం అక్కడికి వెళ్లిన అర్జున్ కుటుంబానికి ఆ ఇంట్లో ఉండే ఒక దుష్టశక్తి వల్ల ఎదురైన సంఘటనల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. స్థానికులు దీనిని 'భూత్ బంగ్లా' (దెయ్యాల కోట) అని పిలుస్తుంటారు.
నిజంగానే దెయ్యాల కోటనా?
భూత్ బంగ్లా సినిమాలో చూపిస్తున్నట్లుగా అది నిజంగానే దెయ్యాల కోట అని భయపడాల్సిన అవసరం లేదు. ఈ సినిమా షూటింగ్ మెజారిటీ భాగం రాజస్థాన్లోని జైపూర్లో ఉన్న అత్యంత ప్రసిద్ధ 'చోము ప్యాలెస్' (Chomu Palace) లో జరిగింది. ఈ సినిమాలో కనిపించే భూత్ బంగ్లా ఇదే.
ఆ సినిమాలోనూ
విశేషమేమిటంటే, గతంలో అక్షయ్, ప్రియదర్శన్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ 'భూల్ భులైయా' (2007) చిత్రాన్ని కూడా ఇక్కడే చిత్రీకరించారు. ఈ బంగ్లా సుమారు 350 ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన కట్టడం. ప్రస్తుతం ఇది ఒక వారసత్వ హోటల్గా (Heritage Hotel) కొనసాగుతోంది.
350 ఏళ్ల చరిత్ర
చోము ప్యాలెస్ కేవలం ఒక భవనం కాదు, అది ఒక చారిత్రక కళాఖండం. భారతీయ వాస్తుశాస్త్రం ప్రకారం నిర్మితమైన ఈ కోటను మొదట్లో 'చోముగఢ్ కోట' అని పిలిచేవారు. ఇది సామోద్ సంస్థానానికి చెందినది.
{{/usCountry}}చోము ప్యాలెస్ కేవలం ఒక భవనం కాదు, అది ఒక చారిత్రక కళాఖండం. భారతీయ వాస్తుశాస్త్రం ప్రకారం నిర్మితమైన ఈ కోటను మొదట్లో 'చోముగఢ్ కోట' అని పిలిచేవారు. ఇది సామోద్ సంస్థానానికి చెందినది.
{{/usCountry}}1550వ సంవత్సరంలో జైపూర్ రాజు మొదటి పృథ్వీరాజ్ సింగ్జీ నాలుగో కుమారుడైన రావు గోపాల్జీ ఈ కోట నిర్మాణానికి పునాది వేశారు. శత్రువుల దాడుల నుంచి రక్షణ కల్పించేలా, సైన్యం బస చేసేలా 5 మీటర్ల మందపాటి రాతి గోడలతో దీనిని అత్యంత వ్యూహాత్మకంగా నిర్మించారు.
రాజసం ఉట్టిపడే వాస్తుశిల్పం
రాజ్పుత్, మొఘల్, యూరోపియన్ నిర్మాణ శైలుల కలయికతో ఈ ప్యాలెస్ ముగ్ధులని చేస్తుంది. ఇక్కడి గోడలపై ఉండే ఫ్రెస్కోలు, పురాణ గాథలు, రాజరికపు వేట దృశ్యాలను ప్రతిబింబించే చిత్రాలు నాటి వైభవాన్ని కళ్లకు కడతాయి.
అద్భుతమైన మార్బుల్ ఇన్లే వర్క్, రంగురంగుల రాళ్లతో చేసిన పూల డిజైన్లు, గాలి వెలుతురు ధారాళంగా వచ్చేలా రాతిలో చెక్కిన జాలీ వర్క్ ఈ కట్టడానికి ప్రత్యేక ఆకర్షణలు.
100 రూమ్ లు
సినిమాలో దెయ్యాల కోటగా కనిపించినా, నిజజీవితంలో ఇది విలాసవంతమైన బసకు కేరాఫ్ అడ్రస్. 'దంగయాచ్ గ్రూప్' ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ హోటల్లో 100కు పైగా సూట్ రూములు ఉన్నాయి.
రాజరికపు ఫర్నీచర్, మార్బుల్ రూమ్స్, విలాసవంతమైన బాత్ టబ్స్, స్విమ్మింగ్ పూల్, రుచికరమైన రాజస్థానీ వంటకాలతో పర్యాటకులను ఇది అలరిస్తుంది. రాయల్ వెడ్డింగ్స్ కోసం కూడా ఇది దేశంలోనే అత్యంత ఆదరణ పొందిన వేదికల్లో ఒకటిగా మారింది.
ఖర్చు ఎంత?
చోము ప్యాలెస్లో ఒక రాత్రి బస చేయాలంటే రూ. 39,999 నుంచి రూ. 51,999 వరకు ఖర్చవుతుంది. ఒకవేళ ఇక్కడ రెండు రోజుల పాటు ఘనంగా పెళ్లి వేడుక నిర్వహించుకోవాలనుకుంటే సుమారు రూ. 50 లక్షల నుంచి రూ. 70 లక్షల వరకు వెచ్చించాల్సి ఉంటుంది. ఇది జైపూర్ నుంచి 45 కిలోమీటర్లు, ఢిల్లీ నుంచి 255 కిలోమీటర్ల దూరంలో నేషనల్ హైవే 11పై ఉంది.