Akshay Kumar: లైట్ల వెలుతురుకు దూరంగా హీరో అక్షయ్ కుమార్- కొన్నాళ్లపాటు షూటింగ్లకు బ్రేక్- నాగార్జున, ఎన్టీఆర్ తరహాలో!
Akshay Kumar Eye Surgery: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కొద్దిరోజులు షూటింగ్లకు బ్రేక్ ఇచ్చారు. అలాగే, కొన్నాళ్లపాటు లైట్ల వెలుతురుకు దూరంగా ఉండమని వైద్యులు సూచించినట్లు సమాచారం. ఇప్పుడు ఈ విషయం బాలీవుడ్ సినీ వర్గాల్లో తెగ వైరల్ అవుతోంది.
Akshay Kumar Eye Surgery: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తన కంటికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. దృష్టి లోపాలను సరిదిద్దుకునేందుకు (Vision Correction) ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్షయ్ కుమార్ కోలుకుంటున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం.

పనికి విరామం.. ఆరోగ్యానికి ప్రాధాన్యం
వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉండే అక్షయ్ కుమార్, తన తాజా చిత్రాల షూటింగ్ షెడ్యూల్స్ పూర్తి చేసిన వెంటనే కంటి సర్జరీకి వెళ్లారు. మే 6, బుధవారం ఉదయం ముంబైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఈ మైనర్ ఆపరేషన్ జరిగినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు.
కొన్నాళ్ల పాటు లైట్ల వెలుతురుకు దూరంగా, ప్రశాంతంగా ఉండాలని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. మన దగ్గర కూడా ఎన్టీఆర్, నాగార్జున వంటి స్టార్ హీరోలు గతంలో ఇలాంటి కంటి చికిత్సలు చేయించుకున్న సందర్భాలు ఉన్నాయి. నిరంతరం కెమెరా ఫ్లాష్లు, సెట్స్లో ఉండే హై-వోల్టేజ్ లైట్ల వల్ల కళ్లపై పడే ఒత్తిడిని తగ్గించుకోవడానికి నటులు ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంటారు.
అసలు 'విజన్ కరెక్షన్' సర్జరీ అంటే ఏమిటి?
చాలామందికి సాధారణంగా ఉండే దృష్టి లోపాలను సరిదిద్దే ప్రక్రియనే 'విజన్ కరెక్షన్' అంటారు. ఇది ప్రధానంగా కంటి ముందు భాగం (Cornea) ఆకారాన్ని మార్చడం ద్వారా జరుగుతుంది. దీనివల్ల కాంతి నేరుగా రెటినాపై పడి చూపు స్పష్టంగా మారుతుంది.
ఈ సర్జరీలో కొన్ని ముఖ్యమైన రకాలు ఉన్నాయి:
లాసిక్ (LASIK): ఇది అత్యంత ప్రాచుర్యం పొందిన పద్ధతి. దగ్గరి చూపు, దూరపు చూపు సమస్యలను ఇది పోగొడుతుంది.
స్మైల్ (SMILE): ఇది చాలా చిన్న కోతతో చేసే ఆధునిక ప్రక్రియ.
పీఆర్కే (PRK): కంటి పొరలు పల్చగా ఉన్నవారికి ఈ పద్ధతిని సిఫార్సు చేస్తారు.
ఆర్ఎల్ఈ (RLE): ఇది దాదాపు క్యాటరాక్ట్ (కంటి శుక్లం) ఆపరేషన్ లాంటిదే. తీవ్రమైన దృష్టి లోపాలు ఉన్నవారికి ఇది మేలు చేస్తుంది.
ఈ ఆపరేషన్ల వల్ల అద్దాలు లేదా కాంటాక్ట్ లెన్స్లపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఇది 'అవుట్ పేషెంట్' సర్జరీ కావడం విశేషం. అంటే ఉదయం ఆపరేషన్ చేయించుకుని, సాయంత్రానికి ఇంటికి వెళ్లిపోవచ్చు. ఆసుపత్రిలో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం కూడా ఉండదు.
షూటింగ్ల హడావిడి ముగిశాకే..
అక్షయ్ కుమార్ తన తదుపరి చిత్రం 'కేరళం' షూటింగ్ను ఇటీవల కేరళలో పూర్తి చేశారు. ఈ సినిమాలో విద్యా బాలన్, రాశీ ఖన్నా హీరోయిన్స్గా పోషిస్తున్నారు. అనీస్ బజ్మీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షెడ్యూల్ ముగిసిన వెంటనే అక్షయ్ కుమార్ తన కంటి చికిత్సపై దృష్టి పెట్టారు.
"అందమైన ప్రదేశంలో మంచి మనసున్న వ్యక్తులతో పనిచేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది" అంటూ కేరళ షెడ్యూల్ ముగిసిన సందర్భంగా అక్షయ్ కుమార్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
అక్షయ్ చేతిలో ఉన్న ప్రాజెక్టులు
ప్రస్తుతం అక్షయ్ కుమార్ చేతిలో భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. 'వెల్కమ్ టు ది జంగిల్', 'హైవాన్', 'గోల్మాల్ 5' వంటి సినిమాలతో పాటు 'వేదత్ మరాఠే వీర్ దౌడ్లే సాత్' అనే మరాఠీ చిత్రంలోనూ అక్షయ్ కుమార్ నటిస్తున్నారు. ఈ సర్జరీ తర్వాత ఆయన మరికొంత కాలం విశ్రాంతి తీసుకుని, మళ్లీ పూర్తి ఫిట్నెస్తో షూటింగ్లలో పాల్గొంటారని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


