అట్లీ తర్వాత అల్లు అర్జున్ సినిమా ఈ డైరెక్టర్ తోనే- బాక్సాఫీస్ ను షేక్ చేసే కాంబినేషన్- అఫీషియల్ వీడియో

ప్రస్తుతం తమిళ డైరెక్టర్ అట్లీతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ సైన్స్ ఫిక్షన్ మూవీ చేస్తున్నాడు. దీని తర్వాత ఐకాన్ స్టార్ మరో తమిళ డైరెక్టర్ తోనే పని చేయబోతున్నాడు. ఈ కాంబినేషన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందని అంటున్నారు. భోగి సందర్భంగా ఈ అనౌన్స్ మెంట్ చేశారు. 

Published on: Jan 14, 2026 5:50 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అఫీషియల్.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తర్వాతి సినిమా ఏ డైరెక్టర్ తో చేయబోతున్నాడో తెలిసింది. భోగి సందర్భంగా మేకర్స్ ఈ విషయాన్ని వీడియోతో అనౌన్స్ చేశారు. తమిళ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ మూవీ చేయబోతున్నాడు. తమిళ దర్శకుడు అట్లీతో సినిమా తర్వాత అల్లు అర్జున్-లోకేష్ మూవీ పట్టాలెక్కనుంది.

అల్లు అర్జున్
అల్లు అర్జున్

అల్లు అర్జున్ మూవీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కలబోతున్నారు. సినిమా కోసం పనిచేయనున్నారు. ఏఏ23 (వర్కింగ్ టైటిల్)కు ఈ సెన్సేషనల్ కాంబినేషన్ సెట్ అయింది. నెలల తరబడి జరిగిన ఊహాగానాలకు తెరదించుతూ, నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ భోగి పండుగ (జనవరి 14) రోజున ఈ చిత్రాన్ని ప్రకటించారు.

అఫీషియల్ అనౌన్స్ మెంట్

అల్లు అర్జున్ ఫ్యాన్స్ కిక్కిిచ్చే న్యూస్ ఇది. మకర సంక్రాంతికి ముందు బుధవారం నాడు అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రకటన చేస్తూ.. 'భారతీయ సినిమాలో శాశ్వతంగా నిలిచిపోయే కలయిక. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్, మైత్రి మూవీస్, అనిరుధ్ రవిచందర్. గొప్పతనం కోసం పోరాడండి’’ అని పోస్టు చేశారు.

ఇంట్రెస్టింగ్ వీడియో

ఏఏ23 అనౌన్స్ మెంట్ వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉంది. బ్యాక్ గ్రౌండ్ లో హైసెన్‌బర్గ్ రాసిన లిరిక్స్‌తో హెక్టర్ సలామాంకా పాడిన పాట వస్తుంది. కామిక్ లో అడవిలో గుర్రాలు పరుగెత్తుతాయి. ఓ గుర్రంపై హీరో క్యారెక్టర్ లా ఎంట్రీ ఉంది. ఆ తర్వాత తోడేళ్ల గుంపు, సింహం గర్జన కనిపించింది. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు. 2026లోనే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది.

అల్లు అర్జున్ పోస్ట్

అల్లు అర్జున్ కూడా ఈ ప్రకటన వీడియోను పోస్ట్ చేస్తూ.. ‘‘23 అని చెప్తున్నా. దూకుడుగా ముందుకు సాగుతున్నా. అతి తక్కువగా, మానసికంగా లాక్ అయ్యాను. అది గ్యారెంటీ! మెవ్రిక్ లోకేష్ కనగరాజ్, అలాగే సోదరుడు బ్రదర్ అనిరుధ్ రవిచందర్ తో ఈ కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నందుకు ఉత్సాహంగా ఉన్నా. దీని కోసం వేచి ఉండలేను’’ అని రాసుకొచ్చాడు.

రీసెంట్ మూవీస్

2020లో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన హిట్ మూవీ 'అల వైకుంఠపురములో' తర్వాత అల్లు అర్జున్ తన ఐదేళ్ల జీవితాన్ని సుకుమార్ పుష్ప చిత్రాలకు అంకితం చేశారు. 'పుష్ప: ది రైజ్' 2021లో విడుదలైంది. 'పుష్ప 2: ది రూల్' 2024లో విడుదలైంది. మొదటి పుష్ప ప్రపంచవ్యాప్తంగా రూ.350 కోట్లు వసూలు చేయగా, పుష్ప 2 రికార్డులు బద్దలు కొట్టి ప్రపంచవ్యాప్తంగా రూ.1871 కోట్లు వసూలు చేసింది.

2023లో వచ్చిన విజయ్-స్టారర్ 'లియో' తర్వాత, లోకేష్ చివరిగా రజినీకాంత్, నాగార్జున, శృతి హాసన్, సౌబిన్ షాహిర్ తదితరులు నటించిన కూలీ మూవీని డైరెక్ట్ చేశాడు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.518 కోట్లు వసూలు చేసింది. లోకేష్ ఇప్పుడు అరుణ్ మాథెస్వరన్ దర్శకత్వంలో 'DC' చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.