AA 23: సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత సినిమా ఇండస్ట్రీలో గాసిప్స్ హద్దులు లేకుండా వ్యాప్తి చెందుతున్నాయి. ఏది నిజం, ఏది అబద్ధం అని తెలుసుకోవడం ప్రేక్షకులకు, ఫ్యాన్స్కు పెద్ద టాస్క్గా మారుతోంది. తాజాగా సినీ వర్గాల్లో ఒక పాన్-ఇండియా హీరో, క్రేజీ డైరెక్టర్ కాంబోలో రావాల్సిన ఒక భారీ ప్రాజెక్ట్ ఆగిపోయిందంటూ నెట్టింట గట్టిగా ప్రచారం జరిగింది.

ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేకపోయినా.. నెటిజన్లు వెంటనే ఆ ప్రాజెక్ట్ అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ ల ‘AA23’ అంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేయడం స్టార్ట్ చేశారు.
రూమర్లకు చెక్ పెట్టిన రత్నకుమార్
ఈ క్రేజీ ప్రాజెక్ట్ మీద వస్తున్న పుకార్లకు ఫేమస్ డైరెక్టర్, రైటర్ రత్నకుమార్ (Rathna Kumar) తన స్టైల్లో అడ్డుకట్ట వేశారు. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో వచ్చిన ఇండస్ట్రీ బ్లాక్బస్టర్ ‘విక్రమ్’ సినిమా రిలీజై సక్సెస్ఫుల్గా నాలుగు ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. రత్నకుమార్ సోషల్ మీడియాలో ఒక స్పెషల్ పోస్ట్ పెట్టారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ లోకేష్ను అభినందిస్తూ.. తాను ‘AA23’ ప్రాజెక్ట్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు రత్నకుమార్ రాసుకొచ్చారు. ఆయన డైరెక్ట్గా ఈ రూమర్ల గురించి మాట్లాడకపోయినా.. బన్నీ-లోకేష్ సినిమా కచ్చితంగా లైన్లోనే ఉందని, త్వరలోనే పట్టాలెక్కబోతుందని ఈ ఒక్క మాటతో క్లారిటీ ఇచ్చేశారు.
అసలు రూమర్స్ ఎందుకు వచ్చాయి?
అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ కుమార్ తో రాకా మూవీ చేస్తున్నాడు. ఇది కూడా భారీ పాన్ ఇండియా ప్రాజెక్టే. ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తోనూ మరో మూవీ చేయబోతున్నాడు. అటు లోకేష్ కనగరాజ్ ఖైదీ 2 చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇద్దరికీ ఇప్పట్లో టైమ్ సెట్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో పాన్ ఇండియా మూవీ అటకెక్కిందన్న వార్తలు రాగానే అందరూ అల్లు అర్జున్, లోకేష్ మూవీనే అని అనుకున్నారు. కానీ రత్న కుమార్ ట్వీట్ తో వీటిన్నింటికీ ఫుల్ స్టాప్ పడింది.
ఫిల్మ్ నగర్ టాక్ ప్రకారం.. ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్న 'ఆగిపోయిన ప్రాజెక్ట్' పూర్తిగా వేరే సినిమా అని, దానికి ‘AA23’ కి ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ వచ్చింది. ఏదేమైనా తమ ఫేవరెట్ హీరో అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ సినిమా సేఫ్ అని తెలియడంతో మెగా, ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
{{/usCountry}}ఫిల్మ్ నగర్ టాక్ ప్రకారం.. ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్న 'ఆగిపోయిన ప్రాజెక్ట్' పూర్తిగా వేరే సినిమా అని, దానికి ‘AA23’ కి ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ వచ్చింది. ఏదేమైనా తమ ఫేవరెట్ హీరో అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ సినిమా సేఫ్ అని తెలియడంతో మెగా, ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
{{/usCountry}}అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ సినిమా (AA23) ఆగిపోయిందా?
లేదు, ‘AA23’ సినిమా ఆగిపోలేదు. ఈ ప్రాజెక్ట్ ఇంకా వర్కింగ్ స్టేజ్లోనే ఉందని ప్రముఖ రైటర్ రత్నకుమార్ అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు.
‘AA23’ ప్రాజెక్ట్ మీద అప్డేట్ ఇచ్చింది ఎవరు?
లోకేష్ కనగరాజ్ సినిమాలకు కో-రైటర్గా పనిచేసే ప్రముఖ డైరెక్టర్ రత్నకుమార్ ఈ ప్రాజెక్ట్ గురించి లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు.
అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాలు ఏంటి?
ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప 2’ షూటింగ్లో ఉన్నారు. ఆ తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్లో ఒక సినిమా, లోకేష్ కనగరాజ్తో ‘AA23’ మూవీ చేయనున్నారు.