హైదరాబాద్ కు మరో కళ్లు చెదిరే మల్టీప్లెక్స్ వస్తోంది. ఈసారి అల్లు అర్జున్ దానిని తీసుకొస్తున్నాడు. అల్లు సినిమాస్ పేరుతో కోకాపేటలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఈ మల్టీప్లెక్స్ లో ఏకంగా 75 అడుగుల వెడల్పుతో ఉన్న భారీ డాల్బీ స్క్రీన్ సిద్ధంగా ఉంది. ఇండియాలో మూడో డాల్బీ స్క్రీన్ కాగా.. ఆసియాలోనే అతి పెద్దది కావడం విశేషం.
అల్లు సినిమాస్ విశేషాలు

అల్లు అర్జున్, అల్లు అరవింద్ కలిసి నిర్మించిన అల్లు సినిమాస్ మల్టీప్లెక్స్ ఒక సినిమా హాల్ మాత్రమే కాదు ఇదొక విజువల్ వండర్ అని చెప్పవచ్చు. ఆసియాలోనే అతిపెద్ద డాల్బీ స్క్రీన్ ఇక్కడ ఉంది. 75 అడుగుల వెడల్పు గల డాల్బీ సినిమా (Dolby Cinema) స్క్రీన్ పై మూవీ ఎక్స్పీరియల్స్ మరో లెవెల్లో ఉండనుంది.
ఇది డాల్బీ విజన్ 3D ప్రొజెక్షన్, డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీతో పనిచేస్తుంది. అంటే సినిమాలో కలర్స్ మరింత స్పష్టంగా, సౌండ్ మరింత రియలిస్టిక్గా ఉంటాయి. స్టేడియం తరహా సీటింగ్, పిచ్-బ్లాక్ ఆడిటోరియం, అల్ట్రా-లగ్జరీ సోఫాలతో ప్రేక్షకులు రాజభోగం అనుభవిస్తూ సినిమా చూడవచ్చు.
అల్లు సినిమాస్ ఓపెనింగ్ ఎప్పుడంటే?
ఈ మల్టీప్లెక్స్ ప్రారంభానికి అట్టహాసంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మార్చి 12న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ థియేటర్ ప్రారంభం కానుంది. ఈ వేడుకకు అల్లు అర్జున్, ఇతర మెగా కుటుంబ సభ్యులు హాజరుకానున్నారు.
ప్రారంభోత్సవం తర్వాత కొన్ని రోజులు టెక్నికల్ టెస్టింగ్ నిర్వహించి, ఉగాది సందర్భంగా మార్చి 19 నుండి సాధారణ ప్రేక్షకులకు అందుబాటులోకి వస్తుంది. ధురంధర్ 2, ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి సినిమాలతో ఈ మల్టీప్లెక్స్ ను ప్రారంభించబోతున్నారు.
అల్లు సినిమాస్ టికెట్ల ధర
అల్లు సినిమాస్ లో మొత్తం నాలుగు స్క్రీన్లు ఉండగా.. అందులో ఆసియాలోనే అతిపెద్ద డాల్బీ స్క్రీన్ ఒకటి. అయితే ఇందులో స్పెషల్ ధరలు ఉంటాయని భావించినా.. ప్రస్తుతానికి సాధారణ రేట్లతోనే అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. అంటే సాధారణ సీట్లకు రూ.295, రిక్లెయినర్లకు రూ.350గా నిర్ణయించారు. ఇవి ఏఎంబీ మల్టీప్లెక్స్ లోని ధరలే.
{{/usCountry}}అల్లు సినిమాస్ లో మొత్తం నాలుగు స్క్రీన్లు ఉండగా.. అందులో ఆసియాలోనే అతిపెద్ద డాల్బీ స్క్రీన్ ఒకటి. అయితే ఇందులో స్పెషల్ ధరలు ఉంటాయని భావించినా.. ప్రస్తుతానికి సాధారణ రేట్లతోనే అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. అంటే సాధారణ సీట్లకు రూ.295, రిక్లెయినర్లకు రూ.350గా నిర్ణయించారు. ఇవి ఏఎంబీ మల్టీప్లెక్స్ లోని ధరలే.
{{/usCountry}}అయితే ఇండియాలోని పుణె, బెంగళూరులో ఉన్న మరో రెండు డాల్బీ స్క్రీన్లలో మాత్రం ధరలు రూ.500 నుంచి రూ.1000 మధ్య ఉంటున్నాయి. ఇక్కడా అవే ధరలు ఉండే అవకాశం ఉందనీ వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇంకా స్పష్టత లేదు. త్వరలోనే BookMyShow, ఇతర ప్లాట్ఫామ్స్లో టికెట్ల బుకింగ్ అందుబాటులోకి వస్తుంది.
ఇది కోకాపేటలోని అల్లు స్టూడియోస్ (Allu Studios) ఆవరణలోనే ఉంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నార్సింగి, గండిపేట పరిసరాల్లో ఉండే ఐటీ ఉద్యోగులకు, సినీ ప్రేక్షకులకు అల్లు సినిమాస్ ఓ ప్రత్యేక ఆకర్షణ కాబోతోంది.