...
...
Next Story

సూపర్ బోల్డ్ వెబ్ సిరీస్ ఫైనల్ సీజన్ ట్రైలర్ వచ్చేసింది.. ఈసారి మరింత రెచ్చిపోయిన గర్ల్స్ గ్యాంగ్.. స్ట్రీమింగ్ ఆరోజే

ఇండియన్ ఓటీటీలో ఇప్పటి వరకూ వచ్చిన అత్యంత బోల్డ్ వెబ్ సిరీస్ లలో ఒకటైన ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ ఇప్పుడు చివరిదైన నాలుగో సీజన్ తో వస్తోంది. శుక్రవారం (డిసెంబర్ 12) ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈసారి ఇందులోని గర్ల్స్ గ్యాంగ్ మరింత రెచ్చిపోయింది.

Published on: Dec 12, 2025, 15:18:29 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

అమెజాన్ ప్రైమ్ వీడియోలో సంచలనం రేపిన ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ వెబ్ సిరీస్ తెలుసు కదా. ఈ సిరీస్ కు మేకర్స్ ముగింపు పలకబోతున్నారు. చివరిదైన నాలుగో సీజన్ ను వచ్చే శుక్రవారం (డిసెంబర్ 19) ప్రేక్షకుల ముందుకు తీసుకురానుండగా.. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇది గతంలోని మూడు సీజన్లలాగే చాలా బోల్డ్ గా సాగిపోయింది.

ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ నాలుగో సీజన్ ట్రైలర్

సూపర్ బోల్డ్ వెబ్ సిరీస్ ఫైనల్ సీజన్ ట్రైలర్ వచ్చేసింది.. ఈసారి మరింత రెచ్చిపోయిన గర్ల్స్ గ్యాంగ్.. స్ట్రీమింగ్ ఆరోజే
సూపర్ బోల్డ్ వెబ్ సిరీస్ ఫైనల్ సీజన్ ట్రైలర్ వచ్చేసింది.. ఈసారి మరింత రెచ్చిపోయిన గర్ల్స్ గ్యాంగ్.. స్ట్రీమింగ్ ఆరోజే

బోల్డ్ కంటెంట్, స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్‌తో యూత్‌ను ఆకట్టుకున్న 'ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్' వెబ్ సిరీస్ ముగింపు దశకు చేరుకుంది. ఈ ఫైనల్ సీజన్ ట్రైలర్ ఫుల్ ఎనర్జీతో, కాస్త ఎమోషనల్ టచ్‌తో విడుదలైంది. ఈసారి ఈ నలుగురు ఫ్రెండ్స్ (దామిని, ఉమంగ్, అంజన, సిద్ధి) తాము మొదలుపెట్టిన దాన్ని పూర్తి చేయడానికి, తమ సమస్యల నుంచి బయటపడటానికి సిద్ధమవడం ఇందులో చూడొచ్చు.

తమ జీవితాలను వెనక్కి లాగుతున్న సమస్యలను పరిష్కరించుకోవడానికి ఈ నలుగురు ఒక ఒప్పందం కుదుర్చుకుంటారు. దాని కోసం ఆరు నెలల గడువు పెట్టుకుంటారు. ఈ ఆరు నెలల్లో తమ సమస్యలను పరిష్కరించుకోవాలని అనుకుంటారు.

సిద్ధి స్టాండప్ కామెడీతో ప్రయోగాలు చేస్తూ కనిపిస్తుంది. తన భర్త (రాజీవ్ సిద్ధార్థ)తో కలిసి వైవాహిక జీవితంలో, సెక్సువాలిటీ పరంగా కొత్త విషయాలను ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉంటుంది. ఇక సింగిల్ మదర్ అయిన అంజన లైఫ్‌లోకి ఈసారి మరో కొత్త వ్యక్తి వస్తాడు. డీనో మోరియా ఆ కొత్త క్యారెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చాడు.

ఉమంగ్ రిలేషన్షిప్స్ విషయంలో ఇంకా గందరగోళంలోనే ఉంది. "కలిసిన ప్రతివారినీ సోల్‌మేట్‌గా అనుకోవడం ఆపేయ్" అని ఫ్రెండ్స్ సలహా ఇవ్వడం ఈ ట్రైలర్లో చూడొచ్చు. అటు దామిని తన కెరీర్‌లో భాగంగా సొంతంగా ఒక పాడ్‌కాస్ట్ స్టార్ట్ చేస్తుంది. తన అటెన్షన్ కోరుకునే తత్వాన్ని బయటపెడుతూ, తన రిగ్రెట్స్ గురించి కొత్త బాయ్‌ఫ్రెండ్‌తో పంచుకుంటూ ఎమోషనల్ అవుతుంది.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో అత్యంత పాపులర్ వెబ్ సిరీస్‌లలో ఒకటి ‘ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్’. ఇది కేవలం వినోదాన్ని పంచడమే కాకుండా ఆధునిక మహిళల ఆలోచనా ధోరణిని, వారి స్నేహ బంధాన్ని కొత్త కోణంలో ఆవిష్కరించింది. 2019లో ప్రారంభమైన ఈ సిరీస్.. మూడు సీజన్లుగా విజయవంతంగా కొనసాగుతూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది.

ఈ షో దామిని, అంజన, ఉమంగ్, సిద్ధి అనే నలుగురు అమ్మాయిల చుట్టూ తిరుగుతుంది. వీరు తమ జీవితాలను తమకు నచ్చినట్లుగా బతకాలను అనుకుంటూ ఉంటారు. తమ బలహీనతలను, తప్పులను నిర్మొహమాటంగా అంగీకరిస్తూ తమదైన శైలిలో జీవించే అమ్మాయిలు వీళ్లు.

ఆధునిక ముంబై మహానగరంలో స్నేహం, ప్రేమ, కెరీర్, తమకంటూ ఒక గుర్తింపు కోసం వారు చేసే ప్రయాణమే ఈ వెబ్ సిరీస్. ఎన్ని కష్టాలు వచ్చినా ఒకరికొకరు తోడుగా నిలిచే వారి స్నేహ బంధం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.

ఇండియన్ 'సెక్స్ అండ్ ది సిటీ'

ప్రముఖ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ 'సెక్స్ అండ్ ది సిటీ' (Sex and the City)కి ఇండియన్ వెర్షన్ గా ఈ షోను తరచుగా చెబుతుంటారు. మితిమీరిన శృంగారంతో కూడిన బోల్డ్ సీన్స్ కూడా ఆశ్చర్యపరిచాయి. ఇదే తీవ్ర విమర్శలు రావడానికి కూడా కారణమైంది. సమాజం కట్టుబాట్లను ప్రశ్నిస్తూ.. నలుగురు అమ్మాయిల కోణంలో ఈ కథను నడిపించడం మాత్రం కొందరికి బాగా నచ్చింది.

రంగితా ప్రీతిష్ నంది ఈ సిరీస్‌ను రూపొందించారు. ఒక్కో సీజన్‌కు ఒక్కో మహిళా దర్శకురాలు పనిచేశారు. సీజన్ 1కు అనూ మీనన్, సీజన్ 2కు నుపూర్ ఆస్థానా, సీజన్ 3కి జోయితా పట్పటియా దర్శకులుగా ఉన్నారు. ఈ సిరీస్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్‌లో 'బెస్ట్ కామెడీ సిరీస్' విభాగంలో నామినేట్ కావడం విశేషం.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks