అలాంటి కథలు ఎక్కడి నుండైనా పుట్టొచ్చు, వాటిని నిర్మించడంపైనే మా ఫోకస్: అమెజాన్ ప్రైమ్ ఓటీటీ సౌత్ హెడ్ పద్మ కస్తూరిరంగన్
ఇండియా జాయ్ 2025 సంత్సరానికి సంబంధించిన 8వ ఎడిషన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఇందులో ఓటీటీ పల్స్ 2025 చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్స్ సౌత్ హెడ్ పద్మ కస్తూరిరంగన్ పాల్గొన్నారు. వారి ఫోకస్ ఎలాంటి కథలను నిర్మించడంపై ఉందో ఆమె తెలిపారు.
ఇండియా జాయ్ 2025 8వ ఎడిషన్ యానిమేషన్, వీఎఫ్ఎక్స్, గేమింగ్, కామిక్స్ (AVGC) రంగాలలో సృజనాత్మకత, ఆవిష్కరణ, సాంకేతికతకు సంబంధించిన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సంవత్సరం ప్రధాన ముఖ్యాంశాలలో ఓటీటీ పల్స్ 2025 ఉంది. ఇది డిజిటల్ యుగంలో ప్రాంతీయ కథల భవిష్యత్తును చర్చించడానికి భారతదేశ ఓటీటీ, వినోద పరిశ్రమ నుంచి అగ్ర తారలను ఒకచోట చేర్చింది.

ఫ్యూచర్ ఆఫ్ ఒరిజినల్స్
“సౌత్ స్టోరీస్, గ్లోబల్ స్ట్రోక్స్: ది ఫ్యూచర్ ఆఫ్ రీజినల్ ఒరిజినల్స్” అనే నినాదంతో అమెజాన్ ప్రైమ్ వీడియోలో జరిగిన ఈ కార్యక్రమంలో ఇండియా ఒరిజినల్స్ సౌత్ హెడ్ పద్మ కస్తూరిరంగన్ పాల్గొన్నారు. దక్షిణ భారత కథలు స్ట్రీమింగ్ వినోదం భవిష్యత్తును ఎలా రూపొందిస్తున్నాయనే దానిపై ఆమె తన అభిప్రాయాల్ని పంచుకున్నారు.
తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రతిబింబించే ప్రామాణిక కథలను రూపొందించడంపై ప్రైమ్ వీడియో దృష్టి పెట్టడం గురించి కూడా ఆమె మాట్లాడారు.
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ నుంచి
ఆమె నాయకత్వంలో ప్రైమ్ వీడియో నుంచి ‘సుడల్: ది వోర్టెక్స్’, ‘ఇన్స్పెక్టర్ రిషి’, ‘ధూత’, ‘పోచర్’ వంటి అనేక విజయవంతమైన ప్రాంతీయ ఓటీటీ ఒరిజినల్స్ సిరీస్లను అందించారు. ఇవి వాటి సృజనాత్మకత, కథ చెప్పిన విధానానికి ప్రశంసలు అందుకున్నాయి.
అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియా ఒరిజినల్స్ సౌత్ హెడ్ పద్మా కస్తూరిరంగన్ ఇంకా మాట్లాడుతూ.. "గొప్ప కథలు ఎక్కడి నుండైనా వచ్చి ప్రతిచోటా ప్రతిధ్వనిస్తాయని మేము ఎల్లప్పుడూ నమ్ముతున్నాము. దక్షిణ భారత శైలిలో కథలు చెబుతుండటంలోని అసాధారణ పెరుగుదల ఈ నమ్మకాన్ని పునరుద్ఘాటించింది" అని అన్నారు.
వివిధ భాషల్లో
"కథలు ప్రామాణికతతో చెప్పబడినప్పుడు, స్థానిక సంస్కృతితో లీనమైనప్పుడు, అవి భాషలు, సరిహద్దులను దాటి ప్రేక్షకులను కదిలించగలవని రుజువు చేస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ పరిశ్రమల నుండి సృష్టికర్తలు సృజనాత్మక సరిహద్దులను నెట్టి, స్థానిక భావోద్వేగాలను సార్వత్రిక ఇతివృత్తాలతో మిళితం చేయడాన్ని మేము చూశాము" అని పద్మ కస్తూరి రంగన్ తెలిపారు.
"ఇది ప్రాంతీయ కథనాన్ని ఉన్నతీకరించడమే కాకుండా భారతదేశంలో 'మెయిన్ స్ట్రీమ్' అంటే ఏమిటో పునర్నిర్వచించింది. ప్రైమ్ వీడియోలో ఈ కథల్ని శక్తివంతం చేయడం, తాజా ప్రతిభను పెంపొందించడం, గొప్ప, అద్భుతమైన కథలను నిర్మించడంపై మా దృష్టి ఉంది. ఎందుకంటే వినోద పరిశ్రమ భవిష్యత్తు అంతర్గతంగా వైవిధ్యమైనది, సరిహద్దులు లేనిది" అని పద్మ కస్తూరి రంగన్ చెప్పుకొచ్చారు.
కొత్త శైలి ప్రయోగాలు చేయడానికి
ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ ప్రాంతీయ సృష్టికర్తలకు కొత్త శైలిలతో ప్రయోగాలు చేయడానికి, ప్రపంచ ప్రతిభతో సహకరించడానికి, విస్తృత ప్రేక్షకులను చేరుకోవడానికి ఎలా అధికారం ఇస్తున్నాయో కూడా సెషన్లో చర్చించారు. భారతదేశ సృజనాత్మక ఆర్థిక వ్యవస్థను రూపొందించడంలో ప్రాంతీయ కథ చెప్పడం, పెరుగుతున్న ప్రాముఖ్యతను, ప్రపంచ వేదికపై దాని గుర్తింపును నొక్కి చెప్పారు.
ఓటీటీ ప్రతినిధులు, చిత్రనిర్మాతలు, రచయితలు, విద్యార్థులు, మీడియా నిపుణులను ఒకచోట చేర్చి, ఆలోచనలు, సహకారం, ప్రేరణతో నిండిన ఉత్సాహభరితమైన కేంద్రంగా 'ఓటీటీ పల్స్ 2025' ఎడిషన్ నిలిచింది.
హైలెట్గా నినాదం
ఈ కార్యక్రమం ముగింపు దశకు చేరుకున్నప్పుడు ఒక సందేశం ప్రత్యేకంగా నిలిచింది. ఇండియాజాయ్లో OTT పల్స్ 2025 కేవలం చర్చ మాత్రమే కాదు, భారతదేశ ప్రాంతీయ కథలు,పెరుగుతున్న ప్రపంచ ప్రభావానికి సంబంధించిన వేడుక అనే నినాదం హైలెట్గా నిలిచింది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


