నటుడు శివాజీ హీరోయిన్లను ఉద్దేశించి చేసిన కామెంట్స్ ఇంకా దుమారం రేపుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఓసారి దీనిపై ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా స్పందించిన అనసూయ.. తాజాగా పరోక్షంగా అతని పేరు ఎత్తకుండానే మళ్లీ కౌంటర్ వేసింది. అలా అనడం మగతనం కాదంటూ ఆమె చాలా గట్టిగానే స్పందించింది.
అనసూయ కౌంటర్ ఇలా..

నటుడు శివాజీ చేసిన కామెంట్స్ ను పరోక్షంగా ప్రస్తావిస్తూ అనసూయ కాసేపటి కిందట ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేసింది. అందులో ఆమె ఇలా రాసుకొచ్చింది.
“ఈ మధ్య ఆడవాళ్లు ఎలాంటి బట్టలు వేసుకోవాలి అనే దానిపై పబ్లిక్గా వస్తున్న కామెంట్స్ చూస్తుంటే.. ఇది గుర్తుచేయాలి అనిపిస్తోంది. కొందరు ఇతరులను కంట్రోల్ చేయడాన్ని 'బాధ్యత' అని, జడ్జ్ చేయడాన్ని 'రక్షణ' అని ఎలా కన్ఫ్యూజ్ అవుతున్నారో ఆశ్చర్యంగా ఉంది. ఒక అమ్మాయి ఎలాంటి బట్టలు వేసుకోవాలనేది పూర్తిగా తన పర్సనల్ ఛాయిస్. అది ఎవరినో ఉద్దేశించి వేసుకునేది కాదు, దాని వల్ల ఎవరికీ హాని జరగదు” అని అనసూయ చెప్పింది.
అది మగతనం అనిపించుకోదు
ఇంకా ఆమె స్పందిస్తూ.."నిజానికి ఇతరులను ఇబ్బంది పెట్టేవి, హాని కలిగించేవి ఏంటంటే.. అవతలి వాళ్ళు చేసే కామెంట్స్, చూసే వెకిలి చూపులు, అడగకపోయినా ఇచ్చే ఉచిత సలహాలు. వీటి ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. మీలోని అభద్రతా భావాన్ని 'మోరల్ పోలీసింగ్' లా మార్చేసి.. అదేదో మగతనం అనో, రక్షణ కల్పిస్తున్నామనో అనుకుంటే పొరపాటు. అది కేవలం ఎదుటివారిని కంట్రోల్ చేయడమే అవుతుంది. గౌరవం ఇవ్వడానికి ఎవరి పర్యవేక్షణా అవసరం లేదు. ఇతరులను కంట్రోల్ చేయాలనుకోవడం అనేది.. బలం ముసుగులో ఉన్న బలహీనత. సాటి మనిషిని గౌరవించడమే నిజమైన పవర్" అని అనసూయ చాలా ఘాటుగా స్పందించింది.
అసలు ఏం జరిగిందంటే?
ఓ సినిమా ఈవెంట్ లో నటుడు శివాజీ హీరోయిన్లు వేసుకొనే బట్టల విషయంలో చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి.
{{/usCountry}}ఓ సినిమా ఈవెంట్ లో నటుడు శివాజీ హీరోయిన్లు వేసుకొనే బట్టల విషయంలో చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి.
{{/usCountry}}‘‘ఒక విషయం చెబుతున్నా. అమ్మాయిలు, హీరోయిన్లు ఏ బట్టలు పడితే అవి వేసుకుని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తదమ్మా. ఏం అనుకోవద్దు హీరోయిన్లందరూ, మీరు అనుకున్నా నాకు పోయేదేం లేదు. లైట్ తీసుకుంటాం అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనే, నిండుగా కప్పుకొనే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాన్లు కనపడేదాంట్లో ఏముండదమ్మా’’ అని శివాజీ అన్నారు.
‘‘అవి వేసుకున్నంత మాత్రాన చాలా మంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు కానీ దరిద్రపు ము*.. ఇలాంటి బట్టలు ఎందుకు వేసుకుంది? మంచివి వేసుకోవచ్చు కదా అని అనాలని ఉంటుంది లోపల. కానీ అనలేం కదా. అంటే మళ్లీ స్ట్రీ స్వాతంత్రం లేదంటారు’’ అని శివాజీ కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేశారు.
స్త్రీ అంటే ప్రకృతి
‘‘స్త్రీ అంటే ప్రకృతి. ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరుగుతుంది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది. అలాగే స్త్రీ మా అమ్మ ఎప్పటికీ గుండెల్లో కనిపిస్తూ ఉంటుంది. సావిత్రి, సౌందర్య కానీ ఈ జనరేషన్ లో రష్మిక లాంటి వాళ్లు. చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. వీళ్లందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి వెంబడే చెప్పగలుగుతున్నాం. గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాలి. ఇక్కడి (చేతులు) వరకు ఉంటే పర్వాలేదు కానీ ఇక్కడి (ఎద) వరకూ రాకూడదు’’ అని శివాజీ మాట్లాడాడు.