Anumana Pakshi Trailer: 'డీజే టిల్లు' లాంటి సెన్సేషనల్ బ్లాక్బస్టర్ అందించిన డైరెక్టర్ విమల్ కృష్ణ తన నెక్స్ట్ ప్రాజెక్ట్తో బాక్సాఫీస్ వద్ద నవ్వుల హంగామా సృష్టించడానికి రెడీ అయ్యారు. యంగ్ యాక్టర్ రాగ్ మయూర్ హీరోగా నటించిన అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ 'అనుమాన పక్షి' థియేట్రికల్ ట్రైలర్ను స్టార్ హీరో సిద్ధు జొన్నలగడ్డ గ్రాండ్గా లాంచ్ చేశారు.
ప్రతి విషయంలో ఓవర్థింకింగ్.. కశ్మీర్లో లవ్ ట్విస్ట్!

ఈ అనుమాన పక్షి సినిమాలో సన్నీ అనే డిఫరెంట్ క్యారెక్టర్లో రాగ్ మయూర్ కనిపించనున్నారు. ఏ చిన్న విషయాన్ని కూడా మామూలుగా తీసుకోకుండా, అన్నింటినీ అనుమానించే విచిత్రమైన అలవాటు సన్నీకి ఉంటుంది. ఈ అతిగా ఆలోచించే అలవాటు వల్ల అతనికి ఎదురయ్యే కామెడీ సన్నివేశాలు ట్రైలర్లో విపరీతంగా ఆకట్టుకున్నాయి.
సన్నీ ప్రశాంతత కోసం కశ్మీర్ పర్యటనకు వెళ్లినప్పుడు ఒక అమ్మాయితో లవ్లో పడతాడు. అయితే వీరి ప్రేమకథ సవ్యంగా సాగుతుందనుకున్న టైమ్లో అనుకోకుండా ఒక పోలీస్ ఆఫీసర్ అతన్ని ఛేజ్ చేయడం మొదలుపెడతాడు. కశ్మీర్లో అసలు ఏం జరిగింది? ఆ పోలీస్ సన్నీని ఎందుకు తరుముతున్నాడు? అనే ఆసక్తికరమైన ప్రశ్నతో కథ సాగుతుంది.
'డీజే టిల్లు' మేజిక్ రిపీట్ అవుతుందా?
డైరెక్టర్ విమల్ కృష్ణ గతంలో సిద్ధు జొన్నలగడ్డతో కలసి 'డీజే టిల్లు' సినిమాతో టాలీవుడ్లో సరికొత్త డైలాగ్ డెలివరీ, హ్యూమర్ ట్రెండ్ సెట్ చేశారు. ఇప్పుడు అదే తరహా డిఫరెంట్ కాన్సెప్ట్ తో, డార్క్ కామెడీతో పాటు లవ్, మిస్టరీ, హారర్ ఎలిమెంట్స్ని మిక్స్ చేసి 'అనుమాన పక్షి' సినిమాను మలచడం విశేషం.
'సినిమా బండి', 'కీడా కోలా' సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాగ్ మయూర్ ఈ సన్నీ క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. తన మార్క్ కామెడీ టైమింగ్తో, ఎక్స్ప్రెషన్స్తో ఆడియన్స్ని అలరించబోతున్నారు. కథానాయికగా నటించిన మెరిన్ ఫిలిప్ రోల్ కూడా కెమిస్ట్రీ పరంగా చాలా కలర్ఫుల్గా కనిపిస్తోంది.
పోలీసుగా అజయ్ రచ్చ.. నటీనటులే బలం
{{/usCountry}}'సినిమా బండి', 'కీడా కోలా' సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాగ్ మయూర్ ఈ సన్నీ క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. తన మార్క్ కామెడీ టైమింగ్తో, ఎక్స్ప్రెషన్స్తో ఆడియన్స్ని అలరించబోతున్నారు. కథానాయికగా నటించిన మెరిన్ ఫిలిప్ రోల్ కూడా కెమిస్ట్రీ పరంగా చాలా కలర్ఫుల్గా కనిపిస్తోంది.
పోలీసుగా అజయ్ రచ్చ.. నటీనటులే బలం
{{/usCountry}}ఈ సినిమాలో సీరియస్ పోలీస్ ఆఫీసర్గా వర్సటైల్ యాక్టర్ అజయ్ కనిపించి వినోదాన్ని పంచబోతున్నారు. సీనియర్ నటి రాశి, ప్రిన్స్ సెసిల్, అనన్య, చరిత్, బ్రహ్మాజీ వంటి పవర్ ప్యాక్డ్ యాక్టర్లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అజయ్ సీరియస్నెస్, రాగ్ మయూర్ అనుమానాల నడుమ వచ్చే సీన్లు థియేటర్లలో నవ్వులు పూయించడం ఖాయంగా కనిపిస్తోంది.
సాంకేతిక విభాగం విషయానికి వస్తే, సునీల్ కుమార్ నామా అందించిన సినిమాటోగ్రఫీ కశ్మీర్ అందాలను విజువల్గా చాలా రిచ్గా ప్రెసెంట్ చేసింది. ఇక శ్రీచరణ్ పాకాల బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ సినిమా నైపథ్యానికి తగ్గట్టుగా ఫన్ మూడ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాయి. చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్పై రాజీవ్ చిలకా, రాజేష్ జగతియాని, హీరాచంద్ దండ్ అత్యున్నత ప్రొడక్షన్ వాల్యూస్తో నిర్మించారు.
సెప్టెంబర్ 18న థియేటర్లలోకి వస్తున్న ఈ 'అనుమాన పక్షి' యూత్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ని ఏ రేంజ్లో నవ్విస్తుందో చూడాలి.