Ashu Reddy: ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని ఓ యువకుడి దగ్గర డబ్బు వసూలు చేసిన బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి తాజాగా తాను దోచుకున్న డబ్బులో కొంత మొత్తం తిరిగి ఇచ్చేస్తానని చెప్పింది. బాధితుడి ధర్మేంద్రకు ఆమె పంపిన ఆడియో మెసేజ్ ఇప్పుడు బయటకు వచ్చింది. అందులో మే వరకు తనకు టైమ్ ఇస్తే రూ.కోటిన్నర తిరిగి ఇస్తానని ఆమె చెప్పింది.
అషు రెడ్డి మెసేజ్లో ఏముందంటే?

అషు రెడ్డి పంపిన వాయిస్ మెసేజ్ లో ధర్మేంద్రను ఓవైపు రిక్వెస్ట్ చేస్తూనే మరోవైపు కేసు పెడతానంటూ వార్నింగ్ ఇచ్చింది.
“ప్రవీణ అక్కకి కాల్ చేసావట. అందుకే నేను మెసేజ్ పెడుతున్నాను. నాకు మే వరకు టైమ్ ఇవ్వు. రూ.1.5 కోట్లు తిరిగి ఇస్తాను. మిగిలిన డబ్బు నేను జీవితంలో సెటిలైన తర్వాత ఇస్తాను. అవి కూడా ఇవ్వను అని అనడం లేదు. కానీ ఈ వివాదంలోకి నా అక్క, తల్లిని లాగొద్దు. నా తరఫున ప్రవీణ అక్క, వేణు స్వామి మధ్యవర్తిత్వానికి వస్తారు. వాళ్లతో మాట్లాడు. మే వరకు టైమ్ ఇవ్వమనే అడుగుతున్నాను. కాదు కూడదు అని అంటే నేను నీ మీద వేధింపుల కేసు పెడతాను. ఈ వివాదంలోకి అనవసరంగా నా ఫ్యామిలీని లాగుతున్నావని చెబుతాను” అని ధర్మేంద్రకు పంపిన ఆ మెసేజ్ లో అషు రెడ్డి వార్నింగ్ ఇచ్చింది.
అసలు ఏం జరిగిందంటే?
అషు రెడ్డిపై యెనుముల సత్యనారాయణ అనే వ్యక్తి కొన్ని రోజుల కిందట పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ లోని షేక్ పేట్ లో ఉండే ఆయన.. అషు రెడ్డి తన కొడుకు వై.వి.ధర్మేంద్రను ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిందని ఆరోపించారు. ఈ మేరకు అషు రెడ్డితో పాటు కుటుంబ సభ్యులపై హైదరాబాద్ సీసీఎస్ లో కంప్లైంట్ ఇచ్చారు.
సత్యనారాయణ ఫిర్యాదు ప్రకారం.. వై.వి.ధర్మేంద్ర లండన్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నాడు. 2018లో అతను ఇండియాకు వచ్చాడు. అప్పుడే అషుతో పరిచయం ఏర్పడింది. అమెరికాలో చదువుకున్న అషు సినిమాలో యాక్ట్ చేయడం కోసం హైదరాబాద్ కు వచ్చినట్లు ధర్మేంద్రతో చెప్పింది.
{{/usCountry}}సత్యనారాయణ ఫిర్యాదు ప్రకారం.. వై.వి.ధర్మేంద్ర లండన్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నాడు. 2018లో అతను ఇండియాకు వచ్చాడు. అప్పుడే అషుతో పరిచయం ఏర్పడింది. అమెరికాలో చదువుకున్న అషు సినిమాలో యాక్ట్ చేయడం కోసం హైదరాబాద్ కు వచ్చినట్లు ధర్మేంద్రతో చెప్పింది.
{{/usCountry}}ధర్మేంద్ర, అషు మధ్య ఫస్ట్ ఫ్రెండ్ షిప్ ఏర్పడింది. అయితే ధర్మేంద్రను ప్రేమిస్తున్నానని అషు చెప్పింది. పెళ్లి చేసుకుందామని నమ్మించింది. అవసరం ఉందని చెప్పి డబ్బు లాగడం మొదలెట్టింది. కారు, బంగారం, ఆస్తులను కొనుగోలు చేయించి, తన పేరు మీదే రిజిస్ట్రేషన్ చేయించుకుందని సత్యనారాయణ ఫిర్యాదులో పేర్కొన్నారు.
మొత్తంగా రూ.9.35 కోట్లు
అషు రెడ్డి ఇలా మొత్తంగా రూ.9.35 కోట్ల విలువైన డబ్బు, 5 కిలోల బంగారం, ఫ్లాట్ లు, వాహనాలు కొనుగోలు చేయించుకుందని సత్యనారాయణ ఆరోపించాడు. అషు రెడ్డి సిస్టర్ రూ.50 లక్షలు తీసుకుందని తెలిపాడు.
ఆ తర్వాత పెళ్లి గురించి అడిగితే తప్పించుకుంటున్నారని, ఇప్పుడు ముఖం చాటేస్తున్నారని సత్య నారాయణ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఫిర్యాదు మేరకు సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నారు. ఓవైపు కేసు నడుస్తుండగానే బాధితుడితో సెటిల్మెంట్ కోసం అషు రెడ్డి ఇలా వాయిస్ మెసేజ్ పంపించడం గమనార్హం.