ఇవాళ ఓటీటీలోకి మలయాళం సూపర్ హిట్ మూవీ ‘అవిహితం’ వచ్చేసింది. వాస్తవ సంఘటనలకు చాలా దగ్గరగా ఉండే కథతో తీసుకొచ్చిన సాహసోపేత సినిమా ఇది. అక్రమ సంబంధాలు, వాటి వెనుక ఉన్న కారణాలు, ఓ రహస్య స్త్రీని పట్టుకునేందుకు గ్రామస్తుల ప్రయత్నాలు.. ఇలా అవిహితం మూవీ సాగుతోంది.
అవిహితం ఓటీటీ

ఓటీటీలో మలయాళం సినిమాలకు ఉండే క్రేజే వేరు. ఇవి వాస్తవికతకు చాలా దగ్గరగా ఉంటాయి. మన చుట్టుపక్కల జరిగిన కథలాగే ఉంటాయి. ఇప్పుడు అదే కోవలో వచ్చిన బ్లాక్ కామెడీ థ్రిల్లర్ సినిమానే అవిహితం. ఈ మూవీ శుక్రవారం (నవంబర్ 14) ఓటీటీలో రిలీజైంది. జియోహాట్స్టార్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది.
తెలుగులోనూ
ఓటీటీలకు క్రేజ్ పెరిగిపోయాక భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లోని కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలను ఆడియన్స్ ఇష్టపడుతున్నారు. ఇక తెలుగు ఆడియన్స్ అయితే మలయాళ సినిమాలకు ఫ్యాన్స్ గా మారిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే మలయాళ చిత్రాలు కూడా తెలుగులో ఓటీటీలోకి వస్తున్నాయి. అవిహితం కూడా తెలుగు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు తెలుగు భాషలో వచ్చేసింది. మలయాళం, తెలుగుతో పాటు కన్నడ, తమిళం, హిందీ భాషల్లో అవిహితం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
అవిహితం కథ
అవిహితం మూవీ కథ ఓ గ్రామంలో జరిగే వాస్తవ ఘటనలకు దగ్గరగా ఉంటుంది. కంజన్ గడ్ గ్రామంలో ఓ రాత్రి బాగా తూలుతూ వచ్చిన ఓ ప్రకాశన్ ముద్దు పెట్టుకుంటున్న ఓ జంటను చూస్తాడు. అందులో పురుషుడు మిల్ వినోద్. మరి ఆ అమ్మాయి ఎవరు? ఆ మిస్టరీ లేడీని కనిపెట్టేందుకు ఏడుగురు గ్రామస్తులు ఒక్కటవుతారు. అందరిపై అనుమానం పెట్టుకుంటారు.
ఎవరు?
గ్రామంలో ఆ అమ్మాయి ఎవరనేది హాట్ టాపిక్ గా మారుతుంది. అందరూ ఓ మహిళపై అనుమానం వ్యక్తం చేస్తారు. ఆమె ఎక్కడికి వెళ్లినా ఓ కన్నేసి ఉంచుతారు. ఈ క్రమంలోనే అక్రమ సంబంధాలు, ఆడవాళ్లపై మగవాళ్ల ఆలోచన విధానం. లైంగిక కోరికలు తదితర అంశాలకు సంబంధించిన విషయాలు బయటపడతాయి. ఇది మన సమాజ మూస ధోరణిని ప్రశ్నించేలా ఉంటుంది.
నెల రోజుల తర్వాత
{{/usCountry}}గ్రామంలో ఆ అమ్మాయి ఎవరనేది హాట్ టాపిక్ గా మారుతుంది. అందరూ ఓ మహిళపై అనుమానం వ్యక్తం చేస్తారు. ఆమె ఎక్కడికి వెళ్లినా ఓ కన్నేసి ఉంచుతారు. ఈ క్రమంలోనే అక్రమ సంబంధాలు, ఆడవాళ్లపై మగవాళ్ల ఆలోచన విధానం. లైంగిక కోరికలు తదితర అంశాలకు సంబంధించిన విషయాలు బయటపడతాయి. ఇది మన సమాజ మూస ధోరణిని ప్రశ్నించేలా ఉంటుంది.
నెల రోజుల తర్వాత
{{/usCountry}}అవిహిత మూవీ నెల రోజుల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. ఈ చిత్రం అక్టోబర్ 10, 2025న థియేటర్లలో రిలీజ్ అయింది. ఇవాళ జియోహాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాకు సెన్నా హెగ్డే డైరెక్టర్. ఇందులో ఉన్ని రాజ్, రెంజి నాకోల్, వ్రిందా మీనన్ తదితరులు నటించారు. ఈ4 ఎక్స్ పెరిమెంట్స్, ఇమాజిన్ సినిమాస్, మార్లీ స్టేట్ ఆఫ్ మైండ్ బ్యానర్లపై దీన్ని నిర్మించారు.