నేను ఇక్కడ ఏలడానికే వచ్చాను, ఏది నన్ను ఆపలేదు, డ్రామా లేనిదే ఆయేషా ఖాన్ లేదు.. తెలుగు హీరోయిన్ పోస్ట్

రణ్‌వీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా ధురంధర్ అదిరిపోయే కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమాలోని శరారత్ సాంగ్ సూపర్ హిట్ అవడమే కాకుండా 100 మిలియన్ వ్యూస్ సాధించుకుంది. ఈ నేపథ్యంలో థియేటర్లలో తనను తాను చూస్తూ మురిసిపోయిన హీరోయిన్ ఆయేషా ఖాన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది.

Published on: Jan 4, 2026, 18:05:19 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ‘ధురంధర్’ సినిమా పేరే వినిపిస్తోంది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తూ 2025లోనే అత్యంత విజయవంతమైన చిత్రంగా అగ్రస్థానంలో నిలిచింది. కేవలం కథతోనే కాకుండా, ఈ సినిమాలోని పాటలు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

నేను ఇక్కడ ఏలడానికే వచ్చాను, ఏది నన్ను ఆపలేదు, డ్రామా లేనిదే ఆయేషా ఖాన్ లేదు.. తెలుగు హీరోయిన్ పోస్ట్
నేను ఇక్కడ ఏలడానికే వచ్చాను, ఏది నన్ను ఆపలేదు, డ్రామా లేనిదే ఆయేషా ఖాన్ లేదు.. తెలుగు హీరోయిన్ పోస్ట్

100 మిలియిన్ వ్యూస్

ముఖ్యంగా తెలుగు హీరోయిన్ అయేషా ఖాన్, క్రిస్టల్ డిసౌజా ఆదరగొట్టిన డాన్స్ నంబర్ 'శరారత్' చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. యూట్యూబ్‌లో ఈ సూపర్ హిట్ సాంగ్ శరారత్ ఏకంగా 100 మిలియన్ల వ్యూస్ మార్కును దాటింది. ఈ నేపథ్యంలోనే బ్యూటిఫుల్ అయేషా ఖాన్ తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు.

మురిసిపోయిన నటి

యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్ సాధించిన సందర్భంగా అయేషా ఖాన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఆత్మీయమైన నోట్ రాశారు. దురంధర్ సినిమాకు హౌజ్ ఫుల్ నిండిన థియేటర్‌లో ప్రేక్షకుల మధ్య కూర్చుని తన పాటను వెండితెరపై చూసుకుంటున్న వీడియోను ఆయేషా ఖాన్ షేర్ చేశారు.

"వంద మిలియన్ల వ్యూస్! నిండిన థియేటర్‌లో నన్ను నేను పెద్ద తెరపై చూసుకోవడం ఒక మధురమైన అనుభూతి. 'శరారత్' పాటకు మీరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన కాస్టింగ్ డైరెక్టర్ ముఖేష్ ఛబ్రాకు, నాపై నమ్మకం ఉంచిన దర్శకుడు ఆదిత్య ధర్ గారికి కృతజ్ఞతలు" అంటూ తనను తాను చూస్తూ మురిసిపోయింది ఆయేషా ఖాన్.

‘ఏలేందుకే వచ్చాను’

తన భవిష్యత్తు లక్ష్యాల గురించి ఆయేషా చాలా స్పష్టంగా మాట్లాడారు. "నేను ఇక్కడ ఏలడానికి వచ్చాను, ఏదీ నన్ను ఆపలేదు. ఇది గర్వంతో చెబుతున్న మాట కాదు, నా పని పట్ల నాకు ఉన్న ఇష్టం, కష్టం మీద ఉన్న నమ్మకంతో చెబుతున్నాను. నా ప్రతిభపై, దేవుడిపై నాకు పూర్తి నమ్మకం ఉంది. నేను ఏవైతే కోరుకున్నానో అవి ఒకరోజు తప్పకుండా సాధిస్తాను" అని ఆయేషా ఖాన్ ధీమా వ్యక్తం చేశారు.

కష్టసుఖాల్లో అండగా నిలిచిన తన కుటుంబం, స్నేహితులకు ఆయేషా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. డ్రామా లేనిదే 'అయేషా ఖాన్' లేదని, 2026 కూడా మరిన్ని పాఠాలను, విజయాలను తెస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

పాట వెనుక ఉన్న విశేషాలు

'శరారత్' పాటను కరాచీలో జరిగే ఒక విలాసవంతమైన వివాహ వేడుక నేపథ్యంలో చిత్రీకరించారు. ఇందులో రణ్‌వీర్ సింగ్‌తో పాటు ఆయేషా ఖాన్, క్రిస్టల్ డిసౌజా వివాహ నృత్యకారులుగా కనిపిస్తారు. శాశ్వత్ సచ్‌దేవ్ స్వరపరిచిన ఈ పాటను మధుబంతి బాగ్చి, జాస్మిన్ శాండ్లాస్ ఆలపించగా, విజయ్ గంగూలీ కొరియోగ్రఫీ చేశారు.

1200 కోట్లు దాటిన ధురంధర్

రణ్‌వీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన దురంధర్ సినిమా రూ. 1200 కోట్లకుపైగా కలెక్షన్స్ అందుకుంది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్, సంజయ్ దత్ వంటి స్టార్ యాక్టర్స్ కీలక పాత్రలు పోషించారు. కాగా ఆయేషా ఖాన్ తెలుగులో ఓమ్ భీమ్ బుష్, ముఖచిత్రం తదితర సినిమాల్లో హీరోయిన్‌గా చేసింది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More