బాలకృష్ణ, బోయపాటి శ్రీను టీమ్ ప్రస్తుతం అఖండ 2 మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉంది. ఈ శుక్రవారం (డిసెంబర్ 5) సినిమా థియేటర్లలో రిలీజ్ కానుండగా.. తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర చోట్లా ప్రమోషన్లు నిర్వహిస్తున్నారు. బుధవారం (డిసెంబర్ 3) మూవీ టీమ్ చెన్నైలో మీడియాతో మాట్లాడగా.. బాలయ్య బాబు తమిళంలో ఇరగదీశాడు.
బాలకృష్ణ తమిళ స్పీచ్

అఖండ 2 మూవీ ప్రస్తుతం ఎంతో ఆసక్తి రేపుతోంది. బాలకృష్ణ, బోయపాటి ఇప్పటికే హ్యాట్రిక్ కొట్టిన వేళ ఈ రాబోయే సినిమాపైనా ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో వివిధ భాషల్లో రిలీజ్ కానుండటంతో మూవీ టీమ్ ఆయా భాషల్లో ప్రమోషన్లు నిర్వహిస్తోంది. తాజాగా బుధవారం (డిసెంబర్ 3) చెన్నై వెళ్లింది. ఎక్కడికి వెళ్లినా బాలయ్య ఆ భాషల్లో మాట్లాడుతున్నాడు.
చెన్నైలోనూ అతడు తమిళంలో మాట్లాడాడు. తాను మద్రాస్ లో పుట్టానని, అందుకే ఇది నా జన్మభూమి అని అతడు అన్నాడు. ఇక తెలంగాణ తన కర్మభూమి కాగా.. ఏపీ తన ఆత్మభూమి అని బాలకృష్ణ అనడం విశేషం. తన తల్లిదండ్రుల ఆశీర్వాదంతో సినిమా ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్నానని, ప్రపంచంలో హీరోగా 50 ఏళ్లు చేసిన వ్యక్తిని తానే అని అతడు చెప్పడం విశేషం.
ఈ సందర్భంగా అతడు మద్రాసులో తాను గడిపిన జీవితాన్ని, తమిళ లెజెండరీ నటీనటులను అతడు గుర్త చేసుకున్నాడు. తమిళంలో అతడు అనర్గళంగా మాట్లాడటం ఆశ్చర్యం కలిగించింది. హిందీ ప్రమోషన్లలో బాలకృష్ణ హిందీలోనే మాట్లాడటంతో అతడు ఎక్కడికెళ్లినా అన్స్టాపబుల్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
అఖండ 2 మూవీ గురించి..
2021లో వచ్చిన అఖండ సినిమాకు సీక్వెల్ గా ఈ అఖండ 2 వస్తోంది. బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న నాలుగు మూవీ ఇది. గతంలో సింహా, లెజెండ్, అఖండలతో హ్యాట్రిక్ కొట్టారు. ఇక ఈ సినిమాలో సంయుక్త, ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్రాలాంటి వాళ్లు కూడా నటించారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్లో రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ సినిమాను నిర్మించారు. తమన్ మ్యూజిక్ అందించాడు.
{{/usCountry}}2021లో వచ్చిన అఖండ సినిమాకు సీక్వెల్ గా ఈ అఖండ 2 వస్తోంది. బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న నాలుగు మూవీ ఇది. గతంలో సింహా, లెజెండ్, అఖండలతో హ్యాట్రిక్ కొట్టారు. ఇక ఈ సినిమాలో సంయుక్త, ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్రాలాంటి వాళ్లు కూడా నటించారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్లో రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ సినిమాను నిర్మించారు. తమన్ మ్యూజిక్ అందించాడు.
{{/usCountry}}ఈ సినిమా ట్రైలర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దేశభక్తికి సనాతన ధర్మం అనే కాన్సెప్ట్ ను జోడించి తీసిన మూవీగా ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఇందులో రెండు వేర్వేరు పాత్రల్లో బాలయ్య నటించాడు. తొలిసారి అఘోరా పాత్రలో అతడు నట విశ్వరూపం చూపించినట్లు ఇప్పటి వరకూ వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ చూస్తే తెలుస్తోంది. ఆ లెక్కన డిసెంబర్ 5 నుంచి థియేటర్లలో అభిమానుల పూనకాలు ఖాయంగా కనిపిస్తోంది.