బాలీవుడ్ యాక్షన్ స్టార్, అందరూ ప్రేమగా పిలుచుకునే ‘ఖిలాడీ’ అక్షయ్ కుమార్ మళ్లీ తన పాత పంథాలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. నేటి తరం సినిమాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), వీఎఫ్ఎక్స్ (VFX) వాడకం పెరిగిపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. కేవలం కంప్యూటర్ స్క్రీన్ల ముందు కూర్చుని చేసే యాక్షన్ కంటే, ప్రాణాలకు తెగించి చేసే ఒరిజినల్ స్టంట్స్లోనే అసలైన మజా ఉంటుందని 58 ఏళ్ల ఈ ఫిట్నెస్ ఫ్రీక్, కన్నప్ప శివుడు స్పష్టం చేశారు.
వీఎఫ్ఎక్స్ వద్దు.. రియల్ యాక్షన్ ముద్దు!

కరాటే, ముయ్ థాయ్, టైక్వాండో వంటి యుద్ధ విద్యల్లో ఆరితేరిన అక్షయ్ కుమార్, పీటీఐ (PTI) వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ప్రస్తుతం యాక్షన్ సినిమాలు తీసే విధానంలో భారీ మార్పులు వచ్చాయి. ఒకప్పుడు ఫైట్స్ అన్నీ సహజంగా ఉండేవి. ఇప్పుడు అంతా వీఎఫ్ఎక్స్ మయం అయిపోయింది. ఇది చూడటానికి కృత్రిమంగా అనిపిస్తోంది. నాకు మాత్రం నిజమైన యాక్షన్ సినిమా చేయాలని ఉంది" అని అక్షయ్ కుమార్ తన మనసులో మాట చెప్పారు.
నిజంగా దూకడమే
నేటి టెక్నాలజీ యుగంలో తన ఆలోచనలు వింతగా అనిపించవచ్చు కానీ, ప్రేక్షకులు ఆ కష్టాన్ని గుర్తించాలని అక్కీ కోరుకుంటున్నారు. "నేను దూకానంటే అది నిజంగా దూకడమే అయి ఉండాలి. నేను తన్నానంటే అది నిజంగా తన్నడమే కావాలి. 15 మంది సాయంతో గాలిలో ఎగిరి తన్నడం నాకు నచ్చదు" అని అక్షయ్ కుమార్ తెలిపారు.
చేత్తో గీసిన పెయింటింగ్
"AI కాలంలో కూడా నేను రియల్ యాక్షన్ గురించి మాట్లాడుతున్నాను అంటే కొందరు ఏదైనా అనుకోవచ్చు. కానీ, చేత్తో గీసిన పెయింటింగ్కు, డిజిటల్ ప్రింట్కు ఉండే తేడానే ఇక్కడ కూడా కనిపిస్తుంది. డిజిటల్ ప్రింట్ పర్ఫెక్ట్గా ఉండవచ్చు కానీ, చేత్తో గీసిన బొమ్మలో ఉండే ఆ చిన్న చిన్న లోపాలే దానికి సహజత్వాన్ని ఇస్తాయి" అని అక్షయ్ కుమార్ వివరించారు.
ఖిలాడీ నుంచి దేశభక్తి చిత్రాల వరకు..
కెరీర్ మొదట్లో 'మొహ్రా', 'సుహాగ్', 'జాన్వర్' వంటి చిత్రాలతో యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అక్షయ్ కుమార్ గత దశాబ్ద కాలంగా తన శైలిని మార్చుకున్నారు. 'హౌస్ఫుల్', 'భూల్ భులయ్యా' వంటి కామెడీ సినిమాలతో పాటు 'ఎయిర్లిఫ్ట్', 'బేబి', 'కేసరి', 'మిషన్ మంగళ్', 'స్కై ఫోర్స్' వంటి దేశభక్తి నిండిన చిత్రాల్లో నటించి మెప్పించారు.
తెలుగులోనూ ఎంట్రీ
{{/usCountry}}కెరీర్ మొదట్లో 'మొహ్రా', 'సుహాగ్', 'జాన్వర్' వంటి చిత్రాలతో యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అక్షయ్ కుమార్ గత దశాబ్ద కాలంగా తన శైలిని మార్చుకున్నారు. 'హౌస్ఫుల్', 'భూల్ భులయ్యా' వంటి కామెడీ సినిమాలతో పాటు 'ఎయిర్లిఫ్ట్', 'బేబి', 'కేసరి', 'మిషన్ మంగళ్', 'స్కై ఫోర్స్' వంటి దేశభక్తి నిండిన చిత్రాల్లో నటించి మెప్పించారు.
తెలుగులోనూ ఎంట్రీ
{{/usCountry}}'సూర్యవంశీ' వంటి పక్కా యాక్షన్ ఎంటర్టైనర్తో పలకరించిన అక్షయ్ కుమార్ ఇప్పుడు మళ్లీ పాత రోజులను గుర్తుచేసేలా విన్యాసాలు చేయాలని తహతహలాడుతున్నారు. అక్షయ్ కుమార్ తెలుగులోనూ ఎంట్రీ ఇచ్చారు. మంచు విష్ణు కన్నప్ప సినిమాలో శివుడి పాత్రలో అక్షయ్ కుమార్ కనిపించిన విషయం తెలిసిందే.
రాబోయే చిత్రాలు
అక్షయ్ కుమార్ ప్రస్తుతం వరుస భారీ చిత్రాలతో బిజీగా ఉన్నారు. రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపొందుతున్న 'గోల్మాల్ 5'లో అజయ్ దేవగణ్, అర్షద్ వార్సీలతో కలిసి ఆయన అలరించనున్నారు. అలాగే, ప్రియదర్శన్ దర్శకత్వంలో వస్తున్న 'భూత్ బంగ్లా' ఏప్రిల్ 10న థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధంగా ఉంది.