...
...
Next Story

తీవ్ర విషాదంలో బాలీవుడ్.. అమితాబ్ నుంచి ప్రియాంక చోప్రా వరకు బాధలో సెలబ్రిటీలు.. కన్నుమూసిన సతీష్ షా ఎవరు?

బాలీవుడ్ లో సీనియర్ కమెడియన్ సతీష్ షా మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. బిగ్ బి అమితాబ్ బచ్చన్ నుంచి ప్రియాంక చోప్రా వరకూ సెలబ్రిటీలు బాధ వ్యక్తం చేశారు.

Published on: Oct 26, 2025, 13:59:18 IST
Advertisement

బాలీవుడ్ సీనియర్ కమెడియన్ సతీష్ షా మరణించిన సంగతి తెలిసిందే. శనివారం (అక్టోబర్ 25) ఆయన కన్నుమూశారు. ఆయన మరణ వార్త బాలీవుడ్ లో తీవ్ర విషాదాన్ని నింపింది. బిగ్ బి అమితాబ్ బచ్చన్, ప్రియాంక చోప్రా, కరీనా కపూర్, హృతిక్ రోషన్, అనుపమ్ ఖేర్, ఆర్ మాధవన్ వంటి పలువురు ప్రముఖులు దిగ్గజ నటుడు సతీష్ షా మృతి పట్ల సంతాపం తెలిపారు. నివేదికల ప్రకారం సతీష్ షా 74 ఏళ్ల వయసులో శనివారం సెప్టిక్ షాక్ కారణంగా మరణించారు.

అమితాబ్ నివాళి

సతీష్ షా మరణంపై బాలీవుడ్ సెలబ్రిటీల సంతాపం
సతీష్ షా మరణంపై బాలీవుడ్ సెలబ్రిటీల సంతాపం

“మరో రోజు, మరో పని, మరో నిశ్శబ్దం. మాలో మరొకరు వెళ్లిపోయారు. సతీష్ షా.. ఒక యువ ప్రతిభావంతుడు. చాలా చిన్న వయసులోనే మనల్ని విడిచిపెట్టారు. నక్షత్రాలు మనందరినీ కరుణించడం లేదు. ఈ విషాద సమయాల్లో సాధారణంగా భావాలను వ్యక్తం చేయడం సరికాదు. ప్రతి క్షణం మనందరిలో ఒక అశుభ సూచనను రేకెత్తిస్తోంది” అని అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

ప్రియాంక ఏమన్నదంటే?

ప్రియాంక చోప్రా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఇండియా కల్చరల్ హబ్ పోస్ట్‌ను రీ-షేర్ చేశారు. ఆమె "(నమస్కారం ఎమోజి) రెస్ట్ ఇన్ పీస్, సతీష్ జీ" అని రాశారు. కరీనా కపూర్ 'సారాభాయ్ వర్సెస్ సారాభాయ్'లోని సుమీత్ రాఘవన్, రాజేష్ కుమార్‌లతో కలిసి ఉన్న సతీష్ చిత్రాన్ని పంచుకున్నారు. ఆమె.. "రెస్ట్ ఇన్ గ్లోరీ (నమస్కారం, స్టార్ ఎమోజీలు) సతీష్ షా (ఇంద్రధనస్సు ఎమోజి)" అని పేర్కొన్నారు.

ఈ స్టార్లు కూడా

హృతిక్ రోషన్, ఆర్ మాధవన్ కూడా సతీష్‌ను స్మరించుకున్నారు. ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో హృతిక్ రోషన్ ఇలా అన్నారు. “రెస్ట్ ఇన్ పీస్ డియర్ సతీష్ సర్. సెట్‌లో నాలాంటి కొత్త నటుడి పట్ల మీరు చూపిన దయను నేను ఎప్పటికీ మరచిపోలేను. మీ హాస్యం, వారసత్వం స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. వారి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతి” అని హృతిక్ పోస్ట్ చేశాడు.

ఆ ఫొటోతో

సతీష్ షా షాకింగ్ మరణం తర్వాత అనుపమ్ ఖేర్ ఒక భావోద్వేగ వీడియోను పంచుకున్నారు. ఆ వీడియోలో అనుపమ్.. “క్యా హో రహా హై యే? 3-4 దిన్ మే ఇత్నే అచ్చే అచ్చే లోగ్ చలే గయే. క్యా హో రహా హై యే (ఏమిటిది? గత 3-4 రోజుల్లో ఇంత మంచి వాళ్లు మనల్ని విడిచి వెళ్లిపోయారు. అసలేం జరుగుతోంది?)" అని అన్నారు. తాను సతీష్‌ను "సతీష్ మేరే షా (సతీష్ నా రాజా)" అని పిలిచేవాడినని, దివంగత నటుడు తనను “జహాపనా (రాజా)” అని పిలిచేవారని కూడా అనుపమ్ గుర్తుచేసుకున్నారు.

“అతను నాకు చాలా మంచి స్నేహితుడు. షాకింగ్, ఇది చాలా షాకింగ్.. నేను అతనితో చాలా సినిమాల్లో కలిసి పనిచేశాను. అతను నన్ను నవ్వించేవాడు. అతనికి గొప్ప జనరల్ నాలెడ్జ్ ఉంది. నేను అతన్ని పరీక్షిస్తూ ఉండేవాడిని... కోయి హక్ నహీ హై ఆప్కో ఐసే అచానక్ జానే కా (మీకు ఇలా అకస్మాత్తుగా వెళ్లిపోయే హక్కు లేదు)” అని అనుపమ్ అన్నారు.

సతీష్ షా కెరీర్ గురించి..

నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్‌లో సతీష్ షా సినిమాలు, టెలివిజన్‌లలో తన హాస్య పాత్రల ద్వారా ఇంటింటా సుపరిచితులయ్యారు. ఈ నటుడు 'జానే భీ దో యారో', 'మాలామాల్', 'హీరో హీరాలాల్', 'మై హూ నా', 'హమ్ సాథ్-సాథ్ హై', 'కల్ హో నా హో', 'కభీ హా కభీ నా', 'దిల్వాలే దుల్హనియా లే జాయేంగే', 'సారాభాయ్ వర్సెస్ సారాభాయ్', 'ఓం శాంతి ఓం', 'షాదీ నెం. 1' వంటి అనేక చిత్రాలలో నటించారు.

Priyanka re-shared a post by India Cultural Hub.
 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe