బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అతనికి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. వారం రోజుల క్రితం అతడు సాధారణ వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్లినప్పుడు ధర్మేంద్ర ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఆ సమయంలో అతని భార్య, నటి హేమ మాలిని మీడియాతో మాట్లాడుతూ.. అతడు ఆరోగ్యంగానే ఉన్నట్లు చెప్పింది.
బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో ధర్మేంద్ర

హిందుస్థాన్ టైమ్స్ వర్గాల సమాచారం ప్రకారం.. ధర్మేంద్ర సోమవారం (నవంబర్ 10) ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరాడు. ప్రస్తుతం అతనికి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లు పలు రిపోర్టులు చెబుతున్నా.. అతని ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియరాలేదు. కుటుంబ సభ్యులు దీనిపై అధికారిక ప్రకటన ఏమీ విడుదల చేయలేదు. ధర్మేంద్ర ఆరోగ్యంపై త్వరలోనే మరింత సమాచారం తెలియనుంది.
హేమా మాలిని ఏమన్నదంటే?
ఈ నెల ప్రారంభంలో ధర్మేంద్ర చెకప్ కోసం హాస్పిటల్ కు వెళ్లిన తర్వాత.. అతని ఆరోగ్యం గురించి ఆందోళన చెందిన అభిమానులకు అతని భార్య, నటి హేమ మాలిని అభయం ఇచ్చింది. విమానాశ్రయం నుంచి బయలుదేరుతున్న హేమ మాలినిని ఫోటోగ్రాఫర్లు "సార్ ఎలా ఉన్నారు" అని అడగగా.. ఆమె కేవలం 'ఓకే' అని సంజ్ఞ చేసి, అందరికీ ధైర్యం చెప్పింది. ఈ సందర్భంగా ఆమె కృతజ్ఞతలు తెలుపుతూ చేతులు జోడించారు కూడా.
అప్పుడు కూడా ధర్మేంద్ర ఆసుపత్రిలో చేరారని రిపోర్టులు వచ్చాయి. అయితే నటుడికి సన్నిహితంగా ఉన్న వర్గాలు అది కేవలం సాధారణ ఆరోగ్య పరీక్ష మాత్రమే అని తెలిపాయి. “అవును, ధర్మేంద్ర ప్రస్తుతం బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో ఉన్నారు. కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నటుడు మంచి ఆరోగ్యంతో ఉన్నారు. సాధారణ వైద్య పరీక్షల కోసం తరచుగా ఆసుపత్రికి వెళ్తారు. అందుకే ఈసారి కూడా వెళ్లారు. అక్కడ ఎవరైనా ఆయనను చూసి ఉండవచ్చు. అందుకే అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కానీ ఆయన పూర్తిగా బాగున్నారు, ఆందోళన పడాల్సిన అవసరం లేదు” అని ఆ వర్గాలు అప్పట్లో చెప్పాయి.
ధర్మేంద్ర ఇటీవలి సినిమాలు
ధర్మేంద్ర చివరిసారిగా 2024లో షాహిద్ కపూర్, కృతి సనన్లతో కలిసి 'తేరీ బాతోన్ మే ఐసా ఉల్జా జియా' చిత్రంలో తెరపై కనిపించాడు. త్వరలో అతడు శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో అగస్త్య నందాతో కలిసి 'ఇక్కిస్' చిత్రంలో నటించనున్నాడు. ఈ వార్ డ్రామా పరమ వీర చక్ర అవార్డు గ్రహీతలలో అత్యంత చిన్న వయస్కుడైన అరుణ్ ఖేతర్పాల్ జీవితం ఆధారంగా రూపొందిస్తున్నారు. ఈ డిసెంబర్లో ధర్మేంద్రకు 90 ఏళ్లు నిండనున్నాయి.
{{/usCountry}}ధర్మేంద్ర చివరిసారిగా 2024లో షాహిద్ కపూర్, కృతి సనన్లతో కలిసి 'తేరీ బాతోన్ మే ఐసా ఉల్జా జియా' చిత్రంలో తెరపై కనిపించాడు. త్వరలో అతడు శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో అగస్త్య నందాతో కలిసి 'ఇక్కిస్' చిత్రంలో నటించనున్నాడు. ఈ వార్ డ్రామా పరమ వీర చక్ర అవార్డు గ్రహీతలలో అత్యంత చిన్న వయస్కుడైన అరుణ్ ఖేతర్పాల్ జీవితం ఆధారంగా రూపొందిస్తున్నారు. ఈ డిసెంబర్లో ధర్మేంద్రకు 90 ఏళ్లు నిండనున్నాయి.
{{/usCountry}}