Brahmamudi April 27 Episode: రాజ్, ఇందుకు బ్రహ్మముడి- కోరుకున్న అమ్మనాన్న- పీకల్లోతు కష్టాల్లో రేఖ- నందుకు భయపడిన లక్కీ

Brahmamudi Serial April 27th Episode: బ్రహ్మముడి సీరియల్ ఏప్రిల్ 27వ ఎపిసోడ్‌లో ఇంట్లో ఉన్న సామాన్లతో అందరికి ఎలా భోజనాలు పెట్టాలో ఇందు ప్లాన్ చేస్తుంది. చుట్టు పక్కల వాళ్లందరిని పిలుస్తారు. రేఖకు అపర్ణ 2 రోజుల గడువు ఇచ్చి బెదిరిస్తుంది. రాజ్ ఇంట్లో నందును చూసి భయపడిపోతాడు లక్కీ. పక్కకు పిలుస్తాడు.

Published on: Apr 27, 2026, 07:05:45 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఇంట్లో ఉన్న వంట సామాన్లతో ఫంక్షన్ అడ్జస్ట్ చేద్దామంటుంది ఇందు. కప్పుల్లో చికెన్ వేద్దామని ఇందు అంటే.. నేను ఒక్కన్నే పావుకిలో చికెన్ తింటానంటాడు రాజ్. అందరూ నీలా తినడం కోసమే ఫంక్షన్‌కి రారు. ఒక చికెన్ ముక్క వేసి మొత్తం సూప్ వేద్దామంటుంది ఇందు.

బ్రహ్మముడి సీరియల్ ఏప్రిల్ 27 ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్ ఏప్రిల్ 27 ఎపిసోడ్

నిమ్మకాయతో జ్యూస్

అలా అయితే వాళ్లు కాదు నేను ఫీల్ అవుతానంటాడు రాజ్. సరే తినడానికి ముందు అందరికి నిమ్మకాయ షరబత్ ఇద్దాం. అది లెమెన్ జ్యూస్ అని చెప్పకుండా ఫ్రూట్ పంచ్ అని పేరు పెట్టి ఇద్దాం. అది తాగాక అంతా తక్కువ తింటారు. నిమ్మకాయలు ఎక్కడి నుంచి తేవాలనకు. మీ ఇంట్లో చెట్టు ఉంది. దానికి చాలా కాయలు ఉన్నాయని ఇందు అంటుంది. ఐడియా సూపర్‌గా ఉందని వెంకీ, నందు అంటారు.

తర్వాత రాజ్, ఇందు చుట్టుపక్కల వాళ్లను ఫంక్షన్‌కు పిలిచేందుకు వెళ్తారు. రాజ్‌ను పిలవమంటుంది ఇందు. తాను పిలవనంటాడు. నువ్వు ఉండగా నేను పిలిస్తే బాగుండదు. పిలవకుంటే నువ్వు నన్ను కిడ్నాప్ చేసిన విషయం మీ అమ్మనాన్నకు చెబుతాను అని బ్లాక్ మెయిల్ చేస్తుంది ఇందు. ఇలా ఆడుకుంటున్నావేంటే అని తిట్టుకున్న పక్కింటివాళ్లను రాజ్ పిలుస్తాడు. బయటకొచ్చిన అతను ముందు రాజ్, ఇందుకు పెళ్లయిందని అనుకుంటాడు.

రాజ్ చెప్పడంతో చలపతి, లక్ష్మీల పెళ్లిరోజుకు వస్తానంటాడు. మరి భోజనాలు ఉన్నాయా. చికెనా, మటనా, ఫ్రాన్సా అని అతను అడుగితే.. రాజ్ చికెన్ అని చెబుతాడు. మరోవైపు ఇందుతో వెంకీని చూసి పక్కింటి ఆవిడ తిడుతుంది. అన్నకు కాకుండా నువ్వెందుకు పెళ్లి చేసుకున్నావురా అని అంటుంది. దాంతో పెళ్లి కాలేదు. తల్లిదండ్రుల ఫంక్షన్ ఉందని చెబుతాడు వెంకీ. అలా నందు-వెంకీ, ఇందు-రాజ్ అందరిని ఫంక్షన్‌కు పిలుస్తాడు.

పీకల్లోతు కష్టాల్లో రేఖ

మరోవైపు చక్రి డబ్బులు ఇవ్వలేదని, జమ చేసుకోమన్నాడని భ్రమరాంబకు చెబుతాడు భూషణ్. దాంతో భ్రమరాంబ గోల చేస్తుంది. ఇప్పుడు ఇందును తీసుకురాలేమని రేఖ అంటుంది. ఆ మాటలు విన్న అపర్ణ ఎందుకు తీసుకురాలేరు. నేను స్వయంగా వెళ్లి పోలీస్ కంప్లైంట్ చేస్తానంటుంది అపర్ణ. ఇన్నాళ్లు ఆఫీస్ నుంచి వచ్చే డబ్బు నొక్కేశారుగా. దాంతో తీసుకురండి. మీకు రెండు రోజులు గడువు ఇస్తాను. ఆలోపు నా మనవరాలిని తీసుకురండి. లేదంటే ఏం చేయాలో అది చేస్తానని బెదిరిస్తుంది అపర్ణ.

ఏం చేస్తావని భ్రమరాంబ అంటే.. చెప్పను, డైరెక్ట్ చేసి చూపిస్తాను అని అపర్ణ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది. దాంతో ఇది నిజంగా ఏదో ప్లాన్‌లో ఉంది. మనం పూర్తిగా ఊబిలో కూరుకుపోయామని భ్రమరాంబ భయపడుతుంది. ఊబిలో కూరుకుపోయినట్లుగా రేఖ ఆలోచనలో పడిపోతుంది. పీకల్లోతు కష్టాల్లో పడుతుంది రేఖ. మరోవైపు రాజ్ ఇంట్లో పూజు సిద్ధం చేస్తుంది ఇందు. రాజ్ తల్లి లక్ష్మీ పూజ చేసి హారతి ఇస్తుంది. అందరూ హారతి తీసుకుంటారు.

పెద్దోడు ఏదో బిజినెస్ అంటూ తిరుగుతున్నాడు. అది సక్సెస్ అయ్యేలా చూడమని తల్లి లక్ష్మీ కోరుకుంటుంది. అంటే రాజ్ చేసిన కిడ్నాప్ సక్సెస్ కావాలని ఇన్‌డైరెక్ట్‌గా తల్లి లక్ష్మీ కోరుకుంటుంది. అమ్మనాన్నల దగ్గర ఆశీర్వాదం తీసుకోమ్మని రాజ్, వెంకీలకు చెబుతుంది ఇందు. వాళ్లు అలాగే తీసుకుంటారు. త్వరలో ఇంటికి కోడళ్లను తీసుకు రండని ఆశీర్వదిస్తారు. వంట సామాను అంతా వచ్చేసినట్లేగా అని ఇందు అంటే.. వెంకీ అవును అంటాడు.

కొడుకులాగే తండ్రి

నలుగురి కోసం ఇదంతా ఎందుకమ్మా. కేవలం చికెన్ వండుకుని తినేయడమే కదా అని చలపతి అంటాడు. కొడుకే అనుకున్నా తండ్రి కూడా అంతేనా. ఫ్యామిలీ మొత్తం చికెన్ తినేసి బతికేస్తున్నారన్నమాట అని రాజ్‌తో అంటుంది ఇందు. ఈసారి మనం కొంచెం గ్రాండ్‌గానే ప్లాన్ చేశామని వెంకీ అంటాడు. చుట్టు పక్కల వాళ్లను 20 మందిని పిలిచామని వెంకీ అంటాడు. హమ్మా.. అని గుండె పట్టుకుంటాడు రాచ్ తండ్రి చలపతి.

ఏమైంది గుండెనొప్పా అని వెంకీ అంటే.. వచ్చేలా ఉందని. అందరూ వస్తా అన్నారా. మరి బడ్జెట్ ఎలారా అని చలపతి అంటే.. అంతా జీరో బడ్జెట్ అని ఇందు అంటుంది. మనకు ఒక్క రూపాయి కూడా ఖర్చు రాదని వెంకీ అంటాడు. ఇంట్లో వాటితోనే ఇందు అంతా ప్లాన్ చేసిందని రాజ్ చెబుతాడు. తర్వాత అంతా వంట ఏర్పాట్లు చేస్తారు. ఈ అమ్మాయి ఎవరో చాలా తెలివైందని ఇందును మెచ్చుకుంటారు చలపతి, లక్ష్మీ.

ఇంతలో లక్కీ వచ్చి నందును చూసి షాక్ అవుతాడు. ఈ పోలీస్‌ను పక్కన పెట్టుకుని వీడు ఎలా ఉన్నాడని సైలెంట్‌గా రాజ్‌ను పిలుస్తాడు లక్కీ. రాళ్లు విసురుతాడు. రాజ్‌కు తప్ప అందరికి తగులుతుంది. ఇంతలో లక్కీని నందు చూస్తుంది. ఆ ఎధవ పిలుస్తుందని రాజ్‌కు చెబుతుంది నందు. దాంతో రాజ్ వెళ్లి లక్కీతో మాట్లాడుతాడు. ఇందు చేసేదంతా చెబుతాడు. ఇప్పుడు ఆ పోలీస్ పిల్లకు మనమే కిడ్నాప్ చేసినట్లు తెలిస్తే మన బతుకు జైలే అని నందును చూసి భయపడిపోతాడు లక్కీ.

రాజ్, ఇందుకు బ్రహ్మముడి

రాజ్ ఏదోటి చెబుతాడు. తర్వాత రాజ్ కంట్లో ఏదో పడితే ఇందు ప్రేమగా చూస్తుంది. అదంతా చూసిన రాజ్ తల్లిదండ్రులు ఈ అమ్మాయి కోడలిగా వస్తే బాగుంటుంది కదా అనుకుంటారు. మీరన్నట్లు ఆ దేవుడు రాజ్, ఇందుకు బ్రహ్మముడి వేస్తే బాగుంటుందని అమ్మ లక్ష్మీ, నాన్న చలపతి కోరుకుంటారు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More