...
...
Next Story

బ్రహ్మముడి జూన్ 30 ఎపిసోడ్: రాజుపై రేఖ ప్రతీకారం.. పెళ్లి గురించి తల్లిదండ్రులకు సమాచారం.. వెంకీ జాబ్ కాపాడిన నందు

Brahmamudi June 30 Episode: బ్రహ్మముడి సీరియల్ జూన్ 30 ఎపిసోడ్ లో రాజుపై రేఖ ప్రతీకారం తీర్చుకునేందుకు ఓ మాస్టర్ ప్లాన్ వేస్తుంది. ఇందుతో పెళ్లి గురించి అతని తల్లిదండ్రులకు సమాచారం చేరవేస్తుంది. ఇటు వెంకీకి నందు అండగా నిలుస్తుంది.

Published on: Jun 30, 2026, 08:13:59 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Brahma Mudi Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ లో ఇటు ఇందు విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడం, అటు నందు వెంకీకి అండగా నిలవడంలాంటి సీన్లతో ఎమోషనల్ గా సాగిపోయింది. అయితే రాజుపై రేఖ ప్రతీకారం తీర్చుకోవడానికి తల్లిదండ్రులను పావులుగా వాడుకునే ప్రయత్నానికి తెరలేపింది.

ఇంట్లో పని మనుషులుగా రేఖ, భ్రమరాంబ

బ్రహ్మముడి జూన్ 30 ఎపిసోడ్: రాజుపై రేఖ ప్రతీకారం.. పెళ్లి గురించి తల్లిదండ్రులకు సమాచారం.. వెంకీ జాబ్ కాపాడిన నందు
బ్రహ్మముడి జూన్ 30 ఎపిసోడ్: రాజుపై రేఖ ప్రతీకారం.. పెళ్లి గురించి తల్లిదండ్రులకు సమాచారం.. వెంకీ జాబ్ కాపాడిన నందు

రాజు ఇచ్చిన షాక్ తో రేఖ, భ్రమరాంబ ఆవేశంతో రగిలిపోయే సీన్ తో బ్రహ్మముడి సీరియల్ మంగళవారం (జూన్ 30) ఎపిసోడ్ ప్రారంభమైంది. రాజుని ఇలాగే వదిలేస్తే ఇంట్లో మీరు పనిమనుషులుగా మారడం ఖాయమని, అది ఊహించుకోండని శేషు అంటాడు. ఇద్దరూ ఇమాజినేషన్ లోకి వెళ్లిపోతారు.

అపర్ణ, సుభాష్ కాలు మీద కాలేసుకొని ఆర్డర్ వేస్తుంటే రేఖ కాఫీ తెచ్చివ్వడం, భ్రమరాంబ ఇల్లు తుడవడంలాంటి సీన్లు కనిపిస్తాయి. ఆ ఊహకే వాళ్లు భయపడిపోతారు.

రాజుపై ప్రతీకారంతో రగిలిపోయిన రేఖ

దీంతో రాజుపై రేఖ ప్రతీకారంతో రగిలిపోతుంది. శేషుని తిట్టి పంపించేస్తుంది. అతన్ని తిట్టి లాభం లేదని, ఇందుని నువ్వు సీఈవోని చేస్తే.. రాజు పెత్తనం చెలాయిస్తున్నాడని, ఈరోజు నీ అవసరం లేకుండా డీల్ కుదుర్చుకున్నారని, ఇక వాడి కన్ను ఇంటి మీద పడుతుందేమో అని భూషణ్, భ్రమరాంబ అంటారు. కానీ రేఖ మాత్రం ఓడిపోతే ఏడుస్తూ కూర్చునే రకం తాను కాదని, వాడు తనకు ఇచ్చిన గిఫ్ట్ కు పదింతల గిఫ్ట్ ఇస్తానని శపథం చేస్తుంది.

జాబ్ గురించి వెంకీని నిజం చెప్పేయమన్న నందు

తన అన్న రాజు తనను బాగా చూసుకున్నాడని అంటాడు. తను గవర్నమెంట్ స్కూలుకు వెళ్లి నన్ను మాత్రం ప్రైవేట్ స్కూలుకు పంపించాడు.. అతడు మామూలు బట్టలు వేసుకొని నాకు బ్రాండెడ్ బట్టలు తీసుకునేవాడు అని చెబుతూ ఎమోషనల్ అవుతాడు. ఎక్కువగా ఆలోచించకు.. ఏమీ కాదు.. రేపు మరొకరి ద్వారా నిజం తెలిస్తే బాగుండదు.. అందుకే నువ్వే నిజం చెప్పు అని నందు ధైర్యం చెబుతుంది.

రాజుని ప్రశంసలతో ముంచెత్తిన అపర్ణ.. సుభాష్ వార్నింగ్

ఇటు ఇంట్లో రాజు, ఇందు సాధించిన విజయంతో అపర్ణ, సుభాష్ చాలా సంతోషిస్తారు. రాజు వచ్చిన తర్వాతే ఇందులో ధైర్యం పెరిగిందని అతని ప్రశంసలతో ముంచెత్తుతుంది అపర్ణ. అయితే సుభాష్ మాత్రం ఇప్పటి నుంచే జాగ్రత్తగా ఉండాలని, గాయపడ్డ వాళ్లు ప్రతీకారం కోసం మరింత దూకుడుగా వస్తారని అంటాడు. భయం లేదని, తాను చూసుకుంటానని రాజు అంటాడు.

వెంకీని నిలదీసిన చలపతి, లక్ష్మీ

మరోవైపు ఇంటికి రాగానే వెంకీని చలపతి, లక్ష్మీ నిలదీస్తారు. నువ్వు డెలివరీ జాబ్ చేయడమేంటని అడగటంతో వెంకీ షాక్ తింటాడు. ముందే చెబితే నేనే ఏదైనా చేసేవాడిని కదా.. డెలివరీ జాబ్ చేయాల్సిన అవసరం నీకేంటి అని చలపతి ప్రశ్నిస్తాడు. వెంటనే ఆ జాబ్ మానేయమని డిమాండ్ చేస్తాడు.

వెంకీకి అండగా నిలబడిన నందు

కానీ అప్పుడే అక్కడికి వచ్చిన నందు.. అతనికి అండగా నిలుస్తుంది. వెంకీ తప్పేమీ చేయడం లేదని, ఇప్పుడిప్పుడే లోకం తీరు ఏంటో అతనికి అర్థమవుతోందని అంటుంది. కానీ డెలివరీ జాబ్ చేస్తే చూసే వాళ్లు ఏమనుకుంటారు.. మా పరువు పోతుందని చలపతి అంటాడు. వెంకీ తప్పుడు పనేమీ చేయడం లేదని, బాధ్యతగా ఉంటున్నాడని, ఏదో ఒక రోజు చాలా ఎత్తుకు ఎదుగుతాడని నందు చెప్పడంతో సరే అని వాళ్లు వెంకీ ఉద్యోగం చేయడానికి అంగీకరిస్తారు. దీంతో నందుకు థ్యాంక్స్ చెబుతాడు వెంకీ.

రాజు, ఇందు పెళ్లి గురించి తల్లిదండ్రులకు చెప్పిన రేఖ

ఇటు రాజు దగ్గరికి ప్రేమగా వెళ్లిన ఇందు తనకు ఎప్పుడూ అండగా ఉండాలని అడుగుతుంది. అలాగే అంటూ ఇందుకు ప్రామిస్ చేస్తాడు రాజు. అయితే ఇదంతా చూసిన ఐశ్వర్య.. వాళ్ల పెళ్లిలో ఏదో మతలబు ఉందని, అందుకే తల్లిదండ్రులను దాస్తున్నాడని రేఖతో చెబుతుంది. దీంతో రేఖ తన మనషులను రాజు ఇంటికి పంపించి మీ కొడుకు దుగ్గిరాల ఇంటికి అల్లుడయ్యాడు.. ఇందుని పెళ్లి చేసుకున్నాడని చెప్పడంతో వాళ్లు కంగారు పడతారు. అంతటితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe