బ్రహ్మముడి సీరియల్ మార్చి 2 ఎపిసోడ్ ఊహకందని మలుపు తిరిగింది. కావ్య, రాజ్ చనిపోయిన తర్వాత వాళ్లు మళ్లీ ఒకప్పుడు పిల్లలుగా ఉన్న నందు, స్వరాజ్ రూపంలో తిరిగి వచ్చారు. గతం మరచిపోయి బస్తీలో పెరిగే స్వరాజ్ రాజుగా.. ఇటు దుగ్గిరాల ఇంట్లో నందు రూపంలో వాళ్లిద్దరూ రావడం విశేషం. దీంతో కథ మరో మలుపు తిరిగింది.
దుగ్గిరాల ఫ్యామిలీ ఫొటోలు తగలబెట్టేసిన రేఖ

బ్రహ్మముడి సీరియల్ సోమవారం (మార్చి 2) ఎపిసోడ్ గతం మరచిపోయిన స్వరాజ్ ను చూసి అతని కొత్త తల్లిదండ్రులు బాధపడే సీన్ తో మొదలవుతుంది. అతడు ఎవరు? తల్లిదండ్రులు ఎవరు కనిపెట్టడం వాళ్లకు కష్టమవుతుంది. దీంతో భయంతో వణికిపోతున్న స్వరాజ్ ను చూసి వాళ్లు బాధపడతారు.
ఇటు రేఖ ఇంట్లో దుగ్గిరాల ఫ్యామిలీ ఆనవాళ్లు లేకుండా ఫొటోలను కూడా తగలబెట్టేస్తుంది. అది చూసి అపర్ణ వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఆమె వేడుకున్న రేఖ వినదు. ఆమె భర్త, అతని అక్క సంతోషించగా.. అక్క భర్త శేషు మాత్రం ఇలా చేయడం పాపం అని అంటాడు.
రాజుగా మారిన స్వరాజ్
ఇటు స్వరాజ్ ను లక్ష్మి దంపతులు కంటికి రెప్పలా చూసుకుంటారు. పేరు కూడా మరచిపోయిన అతనికి రాజు అనే పేరు పెడతారు. తమ ఇంటికి పెద్ద కొడుకుగా అతన్ని చూసుకుంటారు. అతని తల్లిదండ్రుల జాడ మాత్రం తెలుసుకోలేకపోతారు. ఇన్నాళ్లయినా మిస్సింగ్ కేసేమీ ఫైల్ కాకపోవడంతో వాళ్లు చనిపోయారేమో అని అనుకుంటారు. స్వరాజ్ కూడా వాళ్లనే తన అమ్మానాన్నలుగా ఫిక్సయిపోతాడు. తమ్ముడిని బాగా చూసుకుంటూ ఉంటాడు.
పిల్లలకు రేఖ అక్షరాభ్యాసం.. అపర్ణకు చేదు అనుభవం
మరోవైపు ఇంట్లో రేఖ తన అన్న కూతురు, తన భర్త అక్క పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తుంది. అది చూసి అపర్ణ కూడా తన మనవరాళ్లు నందు, ఇందులకు అక్షరాభ్యాసం చేయించాలని వస్తుంది. దీంతో రేఖ ఆమెను తిడుతుంది. వాళ్లకు చదువు రాకూడదని, తాను చెప్పింది మాత్రమే చేస్తూ ఈ ఇంట్లో పని మనుషులుగా ఉండాలని రేఖ అంటుంది. దీంతో అపర్ణ మరింత బాధపడుతుంది.
మనవరాళ్లను చూసి బాధపడిన అపర్ణ.. ధైర్యం చెప్పిన కావ్య
{{/usCountry}}మరోవైపు ఇంట్లో రేఖ తన అన్న కూతురు, తన భర్త అక్క పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తుంది. అది చూసి అపర్ణ కూడా తన మనవరాళ్లు నందు, ఇందులకు అక్షరాభ్యాసం చేయించాలని వస్తుంది. దీంతో రేఖ ఆమెను తిడుతుంది. వాళ్లకు చదువు రాకూడదని, తాను చెప్పింది మాత్రమే చేస్తూ ఈ ఇంట్లో పని మనుషులుగా ఉండాలని రేఖ అంటుంది. దీంతో అపర్ణ మరింత బాధపడుతుంది.
మనవరాళ్లను చూసి బాధపడిన అపర్ణ.. ధైర్యం చెప్పిన కావ్య
{{/usCountry}}తన మనవరాళ్లను చూసి అపర్ణ కుమిలికుమిలి ఏడుస్తుంటుంది. కావ్యకు ఇచ్చిన మాట తప్పాను.. వీళ్లను బాగా చూసుకోలేకపోతున్నానని అంటుంది. అదే సమయంలో అపర్ణ మనసులోని కావ్య ఆత్మ రూపంలో వచ్చి ఆమెకు ధైర్యం చెబుతుంది. పిల్లలను రేఖ చదివించొద్దని అంటే.. మీరు మానేస్తారా? స్కూలుకు వెళ్లకపోయినా మరో మార్గం చూడండి.. ఓ దారి మూసుకుపోతే మరో దారి ఉంటుంది అని కావ్య ఆమెతో అంటుంది.
పిల్లలు అక్షరాలు నేర్చుకోకుండా అడ్డుకున్న రేఖ
దీంతో తన మనవరాళ్లకు తానే అక్షరాలు నేర్పించాలని అపర్ణ ఫిక్సవుతుంది. అప్పుడే ఇద్దరికీ అక్షరాభ్యాసం చేయిస్తుంది. మీకు తానే గురువును అవుతానని, ఇక అన్నీ తానే నేర్పిస్తానని చెబుతుంది. రేఖతోనే కాదు ఈ స్వార్థంతో నిండిన ప్రపంచంతోనూ ఎలా పోరాడాలో తానే చెబుతానని అంటుంది. అది చూసిన రేఖ వదని ఆమెను తీసుకొస్తుంది. దీంతో రేఖ పిల్లల చేతుల్లో నుంచి పలకలు తీసి పగలగొడుతుంది. నువ్వు చెప్పింది వినమంటూ నందు అనడంతో ఆమెను కొట్టడానికి వస్తుంది రేఖ. అపర్ణ ఆమెను అడ్డుకుంటుంది. దీంతో రేఖ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది. పిల్లలకు సుభాష్ ధైర్యం చెబుతాడు.
నందు, రాజుగా కావ్య, స్వరాజ్
సీరియల్ చివర్లో మేకర్స్ పెద్ద ట్విస్టే ఇచ్చారు. బ్రహ్మముడి సీరియల్ లో తరం మారిపోయింది. చనిపోయిన కావ్య, రాజ్ పాత్రలు మళీ ఇప్పుడు నందు, రాజుగా తిరిగి వచ్చారు. ఇంట్లో నాన్నమ్మ, తాతయ్యలకు నందు ధైర్యం చెబుతుంది. దుగ్గిరాల వంశాన్ని తిరిగి నిలబెడతానని శపథం చేస్తుంది. మీ అమ్మానాన్న బతికి ఉంటే ఈపాటికి మీ బావ స్వరాజ్ తో పెళ్లి జరిగేదని అపర్ణ అనుకుంటుంది.
అప్పుడే అటు బస్తీలో పెరిగిన రాజు మాస్ అవతారంలో కనిపిస్తాడు. వాటర్ ట్యాంకు దగ్గర ఆడవాళ్లతో గొడవ పడుతుంటాడు. ఈ ఇద్దరూ మళ్లీ ఎలా కలవబోతున్నారు? సీరియల్ ఎలాంటి మలుపు తీసుకోబోతోంది అన్న ఆసక్తి కలుగుతుంది. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.