బ్రహ్మముడి నవంబర్ 20 ఎపిసోడ్: కావ్య, స్వప్నకు చిచ్చు పెట్టిన రాహుల్- పవర్స్ లాక్కునేలా స్కెచ్- ఇంట్లో కళావతితో అక్క గొడవ
బ్రహ్మముడి సీరియల్ నవంబర్ 20 ఎపిసోడ్లో రాహుల్ ఆఫీస్కు వెళ్తాడు. ఫైల్స్ అన్ని రాజ్ చూశాడని, రాహుల్ను కేవలం సంతకం మాత్రం పెట్టమంటుంది శ్రుతి. డిజైన్స్ కూడా కావ్య చూసిందని మేనేజర్ చెబుతాడు. దాంతో స్వప్నను ఆఫీస్కు వచ్చేలా చేసిన రాహుల్ అదంతా చూసేలా చేస్తాడు. దాంతో స్వప్వ వెళ్లి కావ్యతో గొడవ పడుతుంది.
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో రాహుల్ ఆఫీస్కు వెళ్తాడు. కానీ, అక్కడ అన్ని ఫైల్స్ రాజ్ ముందే చూసి ఉంటాడు. కేవలం రాహుల్ను మాత్రం సైన్ చేయమని శ్రుతి చెబుతుంది. అంటే నేను ఏ ఫైల్ చూడాల్సిన అవసరం లేదా అని రాహుల్ అంటాడు.

పనికి రాని కుర్చీ
లేదు సర్, అరగంట క్రితమే రాజ్ సర్ అన్ని ఫైల్స్ చూశారు. మీరు కేవలం సంతకం చేస్తే చాలంటుంది. దాంతో రాహుల్ సైన్ చేస్తాడు. అది చూసి శ్రుతి నవ్వుతుంది. మీది కేవలం పేపర్ వెయిట్ పోస్ట్ అని తెలియక పొంగిపోయాడనుకుంటుంది శ్రుతి. ఈ మాత్రం దానికి అంతా బిల్డప్ ఎందుకు. ఎలాంటి పవర్స్ లేని ఈ పనికిరాని కుర్చీ నాకు ఎందుకు అనుకుంటాడు రాహుల్.
తర్వాత మేనేజర్ దగ్గరికి వెళ్లి డిజైన్స్లో కరెక్షన్స్ చెప్పానుగా ఏమైంది అని రాహుల్ అడుగుతాడు. కావ్య మేడమ్ మొత్తం చూసి ఎలాంటి కరెక్షన్స్ అవసరం లేదు. క్లైంట్స్కు అలాగే నచ్చాయని చెప్పారు. మాన్యుఫాక్చరింగ్కు కూడా పంపించామని మేనేజర్ చెబుతాడు. దాంతో రాహుల్ వెళ్లి నా చేతికి పవర్స్ రావాలంటే స్వప్నకు తెలియాల్సిందే అని కాల్ చేస్తాడు.
భోజనం పేరు చెప్పి స్వప్న ఆఫీస్కు లంచ్ క్యారేజ్ తీసుకొచ్చేలా చేస్తాడు రాహుల్. మరోవైపు అపర్ణ, సుభష్ పెళ్లి చూపుల హడావిడి నడుస్తుంటుంది. సుభాష్ వాళ్లు వస్తారు. మావిచిగురు సినిమాలోని పాటతో పెళ్లి చూపుల తంతు కానిస్తారు. మరోవైపు ఆఫీస్లో రాహుల్కు స్వప్న వడ్డిస్తుంది. రాహుల్ మారడం గురించి స్వప్న ఎమోషనల్గా చెబుతుంది.
ఓరీ నీ బిల్డప్పు..
తన బాధ అంతా పోయిందని స్వప్న అంటుంది. ఈపాటికి శ్రుతి రావాలిగా అని రాహుల్ అనుకుంటాడు. ఇంతలో శ్రుతి వస్తుంది. మీరు లంచ్ చేశాక వస్తానని శ్రుతి అంటే.. లంచ్దేముంది వర్క్ ముఖ్యం అని రాహుల్ అంటాడు. ఓరీ నీ బిల్డప్పు అని శ్రుతి మనసులో అనుకుంటుంది. అయినా నా లంచ్ అయిపోయింది అని చేయి కడుక్కుని వస్తాడు రాహుల్.
మీ సైన్ కావాలి అని శ్రుతి అంటుంది. ఈ ఫైల్ కూడా నేను చూడక్కర్లేదా అని రాహుల్ అంటే.. చెప్పానుగా సర్ మీరు ఏ ఫైల్ స్టడీ చేయనక్కర్లేదు. అన్ని ఫైల్స్ రాజ్ సర్ చెక్ చేశారు అని శ్రుతి చెబుతుంది. అలా అయితే ఎలా, రేపు ఏదైనా తప్పు జరిగితే రాజ్, కావ్యకు నేను ఏం సమాధానం చెప్పాలని రాహుల్ అంటాడు. అవన్నీ మేము చూసుకుంటాం కదా సర్. మీరు హ్యాపీగా టైమ్ పాస్ చేసి వెళ్లండి అని శ్రుతి అంటుంది.
టైమ్ పాస్ చేయడమేంటీ. ఇది మన కంపెనీ అని రాహుల్ అంటాడు. సర్ రాజ్ సర్ చేయమన్నారు, చెప్పమన్నారు చెబుతున్నాం అని శ్రుతి అంటుంది. ఏం మాట్లాడుతున్నావ్. బాధ్యతలు ఇచ్చి కేవలం సైన్ చేయమని ఎలా అంటారు అని శ్రుతితో స్వప్న గొడవ పడుతుంది. మేము ఉద్యోగులం. రాజ్ సర్ ఇంట్లో ఉండే ఫైల్స్ అన్ని చూస్తున్నారు అని శ్రుతి చెబుతుంది.
పవర్స్ వాళ్ల చేతిలో పెట్టుకుని
సరే సరే అని ఫైల్ తీసుకుని రాహుల్ సైన్ చేసి పెట్టి పంపించేస్తాడు. ఏంటీ రాహుల్ ఇదంతా అని స్వప్న అంటే నాకు కొత్త కదా. పవర్స్ వాళ్ల చేతిలో పెట్టుకుని కేవలం సీట్ ఇచ్చినట్లున్నారు. రాజ్, కావ్య మన మంచికోసమే చేస్తారు అని రాహుల్ అంటాడు. ఇలా అయితే ఎలా ప్రూవ్ చేసుకుంటావ్ అని స్వప్న అంటుంది.
తర్వాత మేనేజర్ వచ్చి కూడా డిజైన్స్ కరెక్షన్స్ అన్ని కావ్య మేడమ్ చేస్తారు. మీ దాకా ఏది రాదు. మీరు జస్ట్ సైన్ చేస్తే చాలు అని మేనేజర్ అని వెళ్లిపోతాడు. పవర్స్ వాళ్ల చేతిలో పెట్టుకుని పెన్ నీకు ఇస్తే ఏంటీ. ఎక్కడ తేల్చుకోవాలో అక్కడే తేల్చుకుంటా అని స్వప్న వెళ్లిపోతుంది. ఇదే ఆవేశం మెయింటేన్ చేయు. అప్పుడేగా నేను అనుకుంది జరుగుతుంది అని రాహుల్ అనుకుంటాడు.
మరోవైపు కట్నం గురించి రుద్రాణి మాట్లాడుతుంది. అంతా రుద్రాణిని తిడతారు. ఏ యావరేజ్ అపర్ణను లేచి నడవమని ఆర్డర్ వేస్తుంది రుద్రాణి. నేను లేవను, పెళ్లి కొడుకు చెల్లి, గోడ మీద బల్లి. ఛాన్స్ దొరికింది కదా అని రెచ్చిపోకు అని అపర్ణ అంటుంది. ఇంతలో స్వప్న వస్తుంది.
కావ్యతో స్వప్న గొడవ
అందనంత ఎత్తుకు చేర్చినట్లు చేర్చి అథః పాతాళానికి తొక్కారు అని కావ్యతో గొడవ పడుతుంది స్వప్న. ఏం మాట్లాడుతున్నావ్ అక్క అని కావ్య అరుస్తుంది. రుద్రాణి కూడా సపోర్ట్ చేస్తూ గొడవ పెంచుతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


