బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఇంట్లో కావ్య ప్రసాదం ఇస్తే ఎవరు తీసుకోరు. నువ్వు మనసు మార్చుకుని మేము చెప్పినట్లు వినకుంటే నువ్వు ఇచ్చే పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టుకోము అని ఇందిరాదేవి అంటుంది. అవునా, అయితే మరి ఇవాళ చేసిన పెసరట్టు ఉప్మా, వడలు, పూరీలు ఏమైపోతాయి అని ఊరిస్తుంది కావ్య.
కిందపడిపోయిన కావ్య

ఇందిరాదేవి టెంప్ట్ అవడంతో అత్తయ్య కంట్రోల్ అని అపర్ణ గుర్తు చేస్తుంది. దాంతో తినేది లేదని చెబుతుంది ఇందిరాదేవి. నేను కూడా తగ్గేది లేదు అని ముందుకు నడిచిన కావ్య కింద పడిపోతుంది. అయ్యో కావ్య కింద పడిపోయిందని రుద్రాణి చెబుతుంది. కానీ, ఎవరు నమ్మరు. కావ్య కింద కావాలని పడిందని, నాటకం స్టార్ట్ చేసిందని అంతా అనుకుంటారు.
కావ్య లే.. అక్క లే మేము నీ నాటకాలు నమ్మట్లేదు అని అంతా అంటారు. కాసేపటికి స్వప్న, అప్పు చూసి నిజంగానే అక్క కళ్లు తిరిగి పడిపోయిందని చెబుతారు. దాంతో అంతా కంగారుపడతారు. కట్ చేస్తే హాస్పిటల్లో కావ్యకు డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తుంటుంది. బయటకు వచ్చిన డాక్టర్ను ఏమైందని రాజ్ అడుగుతాడు. బేబీ ఫ్లక్చువేట్ అవుతుంది. కంగారుపడకండి. కొన్ని టెస్టులు చేయిస్తున్నా. రిపోర్ట్స్ వచ్చాకా తన పరిస్థితి ఏంటో తెలుస్తుందని వెళ్లిపోతుంది డాక్టర్.
కావ్య గురించి బాధగా మాట్లాడుతుంది అపర్ణ. కావ్య ఎలాగు స్పృహలో లేదు. పరీక్ష పెట్టిన దేవుడే మనకు కావ్యను కాపాడుకునే దారి ఇచ్చాడు. కావ్య స్పృహలోకి వచ్చేముందే అబార్షన్ చేయిద్దాం. కావ్యను కాపాడుకోవాలంటే ఇది తప్పదు. ఇది రాజ్ తీసుకోవాల్సిన నిర్ణయం. నువ్వు చెప్పురా రాజ్ అని ఇందిరాదేవి అంటుంది. నాకు కళావతి జీవితం ముఖ్యం. నువ్వు చెప్పిందే కరెక్ట్ నానమ్మా అని రాజ్ అంటాడు.
అడ్డుపడిన రుద్రాణి
అప్పు కూడా మంచి ఐడియా అంటుంది. డాక్టర్తో మాట్లాడుదామని ఇందిరాదేవి అంటుంది. రుద్రాణి అడ్డుపడుతుంది. ఇది చాలా దారుణం. దీని తర్వాత కావ్యను తట్టుకోవడం చాలా కష్టం. రేపు నిజం తెలిశాక తన బిడ్డను చంపేశారని కోర్టుకు ఎక్కిందనుకోండి. మనమంతా జైలులో ఊసలు లెక్కపెట్టాలి అని రుద్రాణి అంటుంది. అలా జరగదని సుభాష్ అంటాడు.
{{/usCountry}}అప్పు కూడా మంచి ఐడియా అంటుంది. డాక్టర్తో మాట్లాడుదామని ఇందిరాదేవి అంటుంది. రుద్రాణి అడ్డుపడుతుంది. ఇది చాలా దారుణం. దీని తర్వాత కావ్యను తట్టుకోవడం చాలా కష్టం. రేపు నిజం తెలిశాక తన బిడ్డను చంపేశారని కోర్టుకు ఎక్కిందనుకోండి. మనమంతా జైలులో ఊసలు లెక్కపెట్టాలి అని రుద్రాణి అంటుంది. అలా జరగదని సుభాష్ అంటాడు.
{{/usCountry}}రేపు ఏం జరుగుతుందనేది అవసరం. ఇప్పుడు కావ్యను కాపాడుకోవడం ముఖ్యం అని ఇందిరాదేవి అంటుంది. కావ్య జీవితం కోసం జైలులో కూర్చొన్న పర్లేదని అపర్ణ అంటుంది. డాక్టర్ వస్తే మీతో వేరే విషయం గురించి మాట్లాడాలని లోపలికి వెళ్తారు. కావ్యను అబార్షన్ గురించి ఒప్పించలేకపోయాం. బిడ్డనే కంటానంటుంది. ఇప్పుడు తను స్పృహలో లేదుగా అబార్షన్ చేసి నా భార్యను బతికించండి అని రాజ్ అంటాడు.
దాంతో డాక్టర్ కోప్పడుతుంది. తనకు తెలియకుండా అబార్షన్ చేయాలా. మీ బాధ అర్థం చేసుకోగలను. కానీ, అబార్షన్ అనేది తల్లికి తెలియకుండా చేయకూడదు. అది క్రైమ్ అవుతుంది. ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుందని అంటుంది డాక్టర్. తను బిడ్డను కంటే తన ప్రాణాలకే రిస్క్ అవుతుందిగా. కాబట్టి ఇది కూడా అత్యవసర పరిస్థితే అని రాజ్ అంటాడు.
కావ్య ప్రాణాలకు లేని ప్రమాదం
నిజమే. కానీ, కావ్య పర్మిషన్ లేకుండా అబార్షన్ చేయలేం అని డాక్టర్ అంటుంది. రుద్రాణి డాక్టర్కే సపోర్ట్ చేస్తుంది. ఇంతలో కావ్య రిపోర్ట్స్ వస్తాయి. రిపోర్ట్స్ చెక్ చేసి వస్తానని డాక్టర్ వెళ్తుంది. కావ్య స్పృహలోకి వస్తుంది. డాక్టర్ రిపోర్ట్స్ చూస్తుంది. బయటకు వచ్చిన డాక్టర్ కంగ్రాట్స్ రాజ్ మీకు గుడ్ న్యూస్ అని డాక్టర్ అంటుంది. ఏంటది అని రాజ్ అంటాడు.
మీ వైఫ్ ప్రాణాలకు ప్రమాదమనేగా అబార్షన్ చేయించాలనుకుంటున్నారు. ఇక అబార్షన్ చేయించాల్సిన అవసరం లేదు. తన గర్భసంచికి ప్రాబ్లమ్ ఉందన్నది నిజం. గర్భసంచి చిన్నదిగా ఉండటం వల్ల నెలలు నిండిన కొద్ది తల్లి ప్రాణానికి ప్రమాదం వస్తుందన్నది నిజం. కానీ, ఇప్పుడు అదంతా మారిపోయింది. గర్భసంచిలో డెవలప్మెంట్ కనిపిస్తుంది. బిడ్డను క్యారీ చేయడం వల్ల కావ్యకు ఎలాంటి ప్రమాదం లేదు అని డాక్టర్ చెబుతుంది.
దాంతో అంతా సంతోషిస్తారు. ఆ దేవుడు ఉన్నాడని ఇందిరాదేవి అంటుంది. డాక్టర్లు అబద్ధం చెప్పరు. ఒకరి ప్రాణంతో ఆడుకోరు. రిపోర్ట్స్ చూసి చెబుతున్నాను అని డాక్టర్ అంటుంది. థ్యాంక్యూ సో మచ్ డాక్టర్ అని రాజ్ సంతోషిస్తాడు. రుద్రాణి మాత్రం షాక్ అయి ఓర్వలేకపోతుంది. కట్ చేస్తే అంతా ఇంట్లో ఉంటారు. కావ్యతో చెబుతూ సంతోషిస్తారు.
భయానికి స్వస్తి
బిడ్డను కంటే తల్లికి ప్రమాదమని తెలిసి భయపడిపోయాం. ఇక ఆ భయానికి స్వస్తి ఆ బాధ పటాపంచలు అయిపోయిందని ఇందిరాదేవి అంటుంది. ఇక చాలు అమ్మమ్మ. ఈ ఏడుపులు పెడబొబ్బులతో విసిగిపోయాను. మీరు కోరుకుందే జరుగుతుంది. ఈ క్షణం నుంచి అందరం ఆనందంగా ఉందాం అని కావ్య అంటుంది.
ఆనందం అంటే ఏంటో నువ్వే చూస్తావుగా అని సీతారామయ్య అంటాడు. రాజ్ మాత్రం డల్గా ఉంటాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.