కవి, రచయిత వైరముత్తు ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ్ అవార్డుకు ఎంపికయ్యారు. దేశంలోనే అత్యున్నత సాహిత్య పురస్కారం అందుకున్న మూడవ తమిళ రచయితగా ఆయన నిలిచారు. అయితే మీటూ ఉద్యమంలో వైరముత్తుపై ఆరోపణలు చేసిన చిన్మయి శ్రీపాద ఇప్పుడు ఫైర్ అవుతోంది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వైరముత్తుకు అవార్డు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తోంది.
చిన్మయి శ్రీపాద ఫైర్

వైరముత్తుకు జ్ఞానపీఠ్ పురస్కారం రావటం పట్ల కోలీవుడ్ హర్షం వ్యక్తం చేస్తోంది. తమిళ దిగ్గజ నటులు కమల్ హాసన్, రజినీకాంత్ తదితరులు వైరముత్తుకు అభినందనలు తెలిపారు. ఈ సెలబ్రిటీలందరిపై చిన్మయి శ్రీపాద ఫైర్ అవుతోంది. తాజాగా రజినీకాంత్ నూ వదలకుండా కౌంటర్ వేసింది.
రజినీకాంత్ పోస్ట్
వైరముత్తుకు రజినీకాంత్ అభినందనలు తెలుపుతూ ఎక్స్ లో పోస్టు పెట్టారు. తమిళంలో ఇలా రాసుకొచ్చారు. “మా భారత జాతి గొప్ప జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, నా ప్రియమైన స్నేహితుడు, గౌరవనీయులైన కవి వైరముత్తుకు నా హృదయపూర్వక అభినందనలు’’ అని రజినీకాంత్ పేర్కొన్నారు. దీన్ని రీషేర్ చేస్తూ.. “అయ్యయ్యో!!! పురియవే పురియాధ (ఏం పజిల్)?!” అని చిన్మయి ప్రశ్నించింది.
ఆశాపూర్ణ దేవి పేరుతో
వైరముత్తుకు జ్ఞానపీఠ్ అవార్డు ఇవ్వడంపై చిన్మయి తన నిరసన వ్యక్తం చేస్తూనే ఉంది. ఆశాపూర్ణ దేవి పేరుతో తన గురించి ఫేస్ బుక్ లో ఓ యూజర్ పెట్టిన పోస్టును చిన్మయి ఎక్స్ లో పోస్టు చేసింది.
{{/usCountry}}వైరముత్తుకు జ్ఞానపీఠ్ అవార్డు ఇవ్వడంపై చిన్మయి తన నిరసన వ్యక్తం చేస్తూనే ఉంది. ఆశాపూర్ణ దేవి పేరుతో తన గురించి ఫేస్ బుక్ లో ఓ యూజర్ పెట్టిన పోస్టును చిన్మయి ఎక్స్ లో పోస్టు చేసింది.
{{/usCountry}}“భారతదేశంలో జ్ఞానపీఠ్ అవార్డు అందుకున్న మొదటి మహిళా రచయిత ఆశాపూర్ణ దేవి. ఎక్స్ లో చిన్మయి పోస్ట్ చదివినప్పుడు ఆమె జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. జ్ఞానపీఠ్ అందుకునేటప్పుడు ఆశాపూర్ణ దేవి ప్రశ్నలు లేవనెత్తారు.
‘పురుషుల చేసే ఇన్ని అన్యాయమైన చర్యలను సమాజం ఎందుకు సహిస్తుంది? జీవితంలోని ప్రతి రంగంలోనూ మహిళల హక్కులను ఎందుకు నిరాకరిస్తున్నారు? వారు ఎందుకు ఇరుకు గదుల్లో చీకటిలో ఊపిరాడకుండా జీవించాలి?’ అని ఆమె ప్రశ్నించారు. అర్ధ శతాబ్దం తర్వాత చిన్మయి శ్రీపాద కూడా ఇదే అడుగుతున్నారు’’ అని ఆ పోస్టులో ఉంది.
మూడో తమిళ రైటర్
సాహిత్యంలో అత్యున్నత పురస్కారమైన జ్ఞానపీఠ్ అవార్డు అందుకున్న మూడో తమిళ రచయిత వైరముత్తు. అంతకుముందు అకిలన్ (1975), జయకాంతన్ (2002) ఈ అవార్డును సొంతం చేసుకున్నారు. వైరముత్తుకు జ్ఞానపీఠ్ పురస్కారం రావటం పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ సంతోషం వ్యక్తం చేశారు.