Chiranjeevi Gv Narayana: ప్రముఖ నటుడు, నిర్మాత జి.వి.నారాయణరావు తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. తన మిత్రుడైన ఆయన భౌతికకాయానికి మెగాస్టార్ చిరంజీవి నేరుగా వెళ్లి నివాళులర్పించారు. నారాయణరావు కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన గాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా తన ఆప్తమిత్రుడితో ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని, తీపి గుర్తును నెమరువేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ రోజుల నుంచి

జివి నారాయణరావుతో తనకున్న స్నేహం గురించి చిరంజీవి గుర్తు చేసుకున్నారు. "మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో మేమిద్దరం శిక్షణ పొందుతున్న రోజుల నుంచే ఒకరికొకరం బాగా తెలుసు. అక్కడ ఆయన నా కంటే సీనియర్. మేము శిక్షణ తీసుకుంటున్న సమయంలో ఆయన వచ్చి తన అనుభవాలను మాతో పంచుకునేవారు. ఆ విధంగానే మా మధ్య చొరవ పెరిగి, మంచి స్నేహం ఏర్పడింది" అని చిరంజీవి తెలిపారు.
కలిసి చేసిన సినిమాలు
పరిశ్రమలో ఇద్దరి ఎదుగుదల గురించి చిరంజీవి మాట్లాడుతూ.. "ఇండస్ట్రీలో మేమిద్దరం ఎదుగుతున్న క్రమంలో, నాకు స్టార్ ఇమేజ్ వచ్చాక ఆయన నా దగ్గరకు వచ్చారు. 'నేను నిర్మాతగా నిలదొక్కుకోవాలనుకుంటున్నాను, నువ్వు నాతో సినిమాలు చేయాలి' అని అడిగారు.
ఆయన కోరిక మేరకు ఆయన నిర్మాణంలో నేను రెండు సినిమాలు చేశాను. అలాగే నా సినిమాల్లో కూడా ఆయనకు నటుడిగా అవకాశాలు దక్కేలా చూశాను. మా అనుబంధం అలా కొనసాగింది’’ అని తెలిపారు.
పది రోజుల క్రితమే
చివరిసారిగా జివి నారాయణ రావుతో మాట్లాడుకున్న సంఘటనను చిరంజీవి గుర్తుచేసుకుని ఎమోషనల్ అయ్యారు. "పది రోజుల క్రితమే ఆయన నన్ను కలిశారు. 'నేను ఒక సినిమా తీశాను. 'మంచు పల్లకి' సినిమా స్ఫూర్తితో ఐదుగురు యువకుల కథ ఆధారంగా దీనిని తెరకెక్కించాను.
వారు పెద్దయ్యాక ఏం జరిగిందనే అంశం చుట్టూ కథ తిరుగుతుంది. ఈ సినిమా ట్రైలర్ను నువ్వే లాంచ్ చేయాలి, నీ సపోర్ట్ ఉంటే అందరికీ మంచి జరుగుతుంది' అని నన్ను కోరారు. తప్పకుండా చేస్తానని నేను ఆయనకు మాట ఇచ్చాను" అని మెగాస్టార్ పేర్కొన్నారు.
అవే చివరి మాటలు
{{/usCountry}}వారు పెద్దయ్యాక ఏం జరిగిందనే అంశం చుట్టూ కథ తిరుగుతుంది. ఈ సినిమా ట్రైలర్ను నువ్వే లాంచ్ చేయాలి, నీ సపోర్ట్ ఉంటే అందరికీ మంచి జరుగుతుంది' అని నన్ను కోరారు. తప్పకుండా చేస్తానని నేను ఆయనకు మాట ఇచ్చాను" అని మెగాస్టార్ పేర్కొన్నారు.
అవే చివరి మాటలు
{{/usCountry}}"ఆ సమయంలోనే నాతో కలిసి ఒక ఫోటో దిగాలని ఆయన కోరారు. బహుశా అది ఆయన నిర్మించిన చివరి సినిమా కావచ్చు. ఆ రోజు మేమిద్దరం చాలా సేపు మాట్లాడుకున్నాం. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని చెప్పి, ఆల్ది బెస్ట్ తెలియజేశాను. కానీ ఆ మాటలే మా చివరి సంభాషణ అవుతాయని, ఆయన శాశ్వతంగా సెలవు తీసుకుంటారని నేను అసలు ఊహించలేదు" అని తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు చిరంజీవి.