ఉస్తాద్ భగత్ సింగ్ తో థియేటర్లను షేక్ చేస్తున్నారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. మిక్సడ్ టాక్ వచ్చినప్పటికీ ఈ సినిమా దూసుకెళ్తోంది. ఉగాది సందర్బంగా మార్చి 19న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజైంది. ఈ మూవీకి హరీష్ శంకర్ డైరెక్టర్. ఈ సినిమాను తాజాగా చిరంజీవి తన తమ్ముడు పవన్ కల్యాణ్ తో కలిసి చూశారు.
చిరంజీవి, పవన్

మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒక చోట కలిశారు. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని స్పెషల్ గా ఫ్యామిలీతో కలిసి చూశారు. ఈ స్క్రీనింగ్ కు చిరంజీవి దంపతులు, పవన్ కల్యాణ్ దంపతులు, డైరెక్టర్ హరీష్ శంకర్ కపుల్స్, తల్లితో కలిసి హీరోయిన్ శ్రీలీల, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలు అటెండ్ అయ్యారు.
ఆ సాంగ్ కు
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో అన్నయ్య చిరంజీవి సినిమా పాటలను వాడారు. ఇందులో ‘వాన వాన వెల్లువాయే’ అనే సూపర్ హిట్ సాంగ్ కు స్విమ్మింగ్ పూల్ పక్కన కూర్చుని కాళ్లను కదుపుతాడు పవన్ కల్యాణ్. ఈ సాంగ్ వచ్చినప్పుడు పవన్ కల్యాణ్ డ్యాన్స్ చూసి చిరంజీవి నవ్వుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ గా మారింది.
అన్నయ్యకు వెల్కమ్
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చూసేందుకు వచ్చిన అన్నయ్య చిరంజీవికి పవన్ కల్యాణ్ వెల్ కమ్ చెప్పారు. ప్రేమగా ఈ అన్నదమ్ములు హత్తుకున్నారు. ఆ తర్వాత వదిన సురేఖను పవన్ పలకరించారు. సినిమా చూస్తున్నప్పుడు సురేఖాతో పవన్ నవ్వుతూ మాట్లాడారు. సినిమా కంప్లీట్ అయ్యాక మూవీ టీమ్ ను చిరంజీవి అభినందించారు.
పవర్ ఫుల్ పోలీస్
{{/usCountry}}ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చూసేందుకు వచ్చిన అన్నయ్య చిరంజీవికి పవన్ కల్యాణ్ వెల్ కమ్ చెప్పారు. ప్రేమగా ఈ అన్నదమ్ములు హత్తుకున్నారు. ఆ తర్వాత వదిన సురేఖను పవన్ పలకరించారు. సినిమా చూస్తున్నప్పుడు సురేఖాతో పవన్ నవ్వుతూ మాట్లాడారు. సినిమా కంప్లీట్ అయ్యాక మూవీ టీమ్ ను చిరంజీవి అభినందించారు.
పవర్ ఫుల్ పోలీస్
{{/usCountry}}గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత హరీష్ శంకర్- పవన్ కల్యాణ్ కాంబినేషన్లో వచ్చిన మరో సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఇందులో భగత్ సింగ్ అనే పవర్ ఫుల్ పోలీసు క్యారెక్టర్లో పవన్ కనిపించారు. తనదైన స్టైల్లో మాస్ డైలాగ్స్, యాక్షన్ తో అదరగొట్టారు. ఈ సినిమాలో రాశీ ఖన్నా, శ్రీలీల హీరోయిన్లు.
మిక్స్ డ్ టాక్
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు మిక్స్ డ్ టాక్ వస్తోంది. మార్చి 19న ఉగాది సందర్భంగా ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది. దీన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. తమన్ బీజీఎం సమకూర్చాడు. ఈ సినిమాకు ఫస్ట్ డే ఇండియాలో రూ.30 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి.