Dhruva Natchathiram: ఈ సినిమాను జూన్ 15లోపు రిలీజ్ చేయాల్సిందే.. లాభాలతో అప్పులు తీర్చండి: మద్రాస్ హైకోర్టు తీర్పు
Dhruva Natchathiram: దాదాపు దశాబ్ద కాలంగా వాయిదా పడుతూ వస్తున్న విక్రమ్ - గౌతమ్ వాసుదేవ్ మీనన్ ల భారీ బడ్జెట్ మూవీ 'ధృవ నచ్చత్తిరమ్' (Dhruva Natchathiram) ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. ఆర్థిక వివాదాలు, న్యాయపరమైన చిక్కుల వల్ల ఆగిపోయిన ఈ సినిమాకు మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Dhruva Natchathiram: తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ అభిమానుల నిరీక్షణ ఫలించింది. ఎన్నో ఏళ్లుగా ల్యాబ్ లకే పరిమితమైన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధృవ నచ్చత్తిరమ్' విడుదలలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. భారీ బడ్జెట్, ఆర్థిక ఇబ్బందులు, ఇతర న్యాయపరమైన చిక్కులతో 2017 నుంచి ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా మద్రాస్ హైకోర్టు వెలువరించిన కీలక తీర్పుతో ఈ ప్రాజెక్ట్ మళ్లీ పట్టాలెక్కింది.

కోర్టు కీలక ఆదేశాలు
విక్రమ్ నటించిన ధృవ నచ్చత్తిరమ్ సినిమా వ్యవహారంపై విచారణ చేపట్టిన జస్టిస్ సెంథిల్ కుమార్ రామమూర్తి.. ఈ ఏడాది జూన్ 15 లోపు చిత్రాన్ని తప్పనిసరిగా థియేటర్లలో విడుదల చేయాలని ఆదేశించారు.
అంతేకాకుండా ఈ సినిమా ద్వారా వచ్చే ఆదాయం మొత్తాన్ని కోర్టు పర్యవేక్షణలోనే ఉంచాలని, ఆ సొమ్ముతో 2017 నుంచి పెండింగ్లో ఉన్న అప్పులన్నీ తీర్చాలని స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో సినిమా విడుదలకు మరెక్కడా ఆటంకాలు ఎదురయ్యే అవకాశం లేదని తెలుస్తోంది.
అనుకున్న సమయం కంటే ముందే రిలీజ్?
కోర్టు జూన్ 15 వరకు గడువు ఇచ్చినప్పటికీ.. దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ అంతకంటే ముందే సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని మే 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని ఆయన భావిస్తున్నారు. ఇతర నిర్మాతలతో చర్చలు ఇంకా కొనసాగుతున్నప్పటికీ, కోర్టు క్లియరెన్స్ ఇవ్వడంతో పనులు వేగవంతం అయ్యాయి.
చియాన్ విక్రమ్ కెరీర్లో అత్యంత విలువైన ప్రాజెక్ట్
విక్రమ్ కెరీర్లో 'ధృవ నచ్చత్తిరమ్' అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం. స్టైలిష్ స్పై థ్రిల్లర్గా రూపొందిన ఈ సినిమాలో విక్రమ్ లుక్, టీజర్లు అప్పట్లో సంచలనం సృష్టించాయి. దాదాపు పదేళ్ల పాటు ఈ సినిమా భవితవ్యం అగమ్యగోచరంగా ఉన్నా.. విక్రమ్, గౌతమ్ మీనన్ టీమ్ మాత్రం పట్టువదలకుండా పోరాడి నేడు విజయం సాధించారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్లు మళ్లీ ప్రారంభం కానున్నాయి.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. ధృవ నచ్చత్తిరమ్ సినిమా విడుదలకు కోర్టు ఇచ్చిన గడువు ఎప్పటి వరకు?
మద్రాస్ హైకోర్టు ఆదేశాల ప్రకారం ఈ సినిమాను ఈ ఏడాది జూన్ 15 లోపు విడుదల చేయాల్సి ఉంటుంది.
2. దర్శకుడు గౌతమ్ మీనన్ ఏ తేదీన సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు?
కోర్టు గడువు కంటే ముందే అంటే మే 22న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు దర్శకుడు ప్లాన్ చేస్తున్నారు.
3. చియాన్ విక్రమ్ ధృవ నచ్చత్తిరమ్ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలైంది?
ఈ ప్రాజెక్ట్ 2016-17 ప్రాంతంలో ప్రారంభమైంది. ఆర్థిక సమస్యల కారణంగా దాదాపు తొమ్మిదేళ్లుగా వాయిదా పడుతూ వచ్చింది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


