...
...
Next Story

Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీ అకౌంట్ ఇండియాలో బ్లాక్.. ఎందుకంటూ సింగర్ చిన్మయి, కమెడియన్ వీర్ దాస్ ప్రశ్న

Cockroach Janata Party: ఇండియాలో సోషల్ మీడియా వేదికగా విపరీతమైన ప్రజాదరణ పొందింది 'కాక్రోచ్ జనతా పార్టీ' (Cockroach Janata Party - CJP). అయితే ప్రారంభమైన కొద్ది రోజులకే ఈ మూవ్‌మెంట్ అధికారిక ఎక్స్ ఖాతాను ఇండియాలో నిలిపివేశారు. దీనిపై గాయని చిన్మయి శ్రీపాద, స్టాండప్ కమెడియన్ వీర్ దాస్ స్పందించారు.

Published on: May 21, 2026, 20:53:43 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Cockroach Janata Party: ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో సరికొత్త సంచలనంగా మారిన పొలిటికల్ సెటైర్ మూవ్‌మెంట్ 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP). అయితే ఈ ఖాతాపై లీగల్ డిమాండ్ రావడంతో ఇండియాలో దీనిని 'విత్‌హెల్డ్' (నిలిపివేత) చేసినట్లు ఎక్స్ సంస్థ ప్రకటించింది.

Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీ అకౌంట్ ఇండియాలో బ్లాక్.. ఎందుకంటూ సింగర్ చిన్మయి, కమెడియన్ వీర్ దాస్ ప్రశ్న
Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీ అకౌంట్ ఇండియాలో బ్లాక్.. ఎందుకంటూ సింగర్ చిన్మయి, కమెడియన్ వీర్ దాస్ ప్రశ్న

ఈ విషయాన్ని సదరు మూవ్‌మెంట్ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే తన వ్యక్తిగత ఖాతా ద్వారా స్క్రీన్‌షాట్‌తో సహా పంచుకున్నారు. "మేము ఊహించినట్లుగానే కాక్రోచ్ జనతా పార్టీ అకౌంట్‌ను ఇండియాలో బ్లాక్ చేశారు" అని ఆయన పేర్కొన్నారు.

సెలబ్రిటీల రియాక్షన్.. 'స్ట్రైసాండ్ ఎఫెక్ట్' అన్న వీర్ దాస్

ఈ అకౌంట్ బ్లాక్ కావడంపై పలువురు ప్రముఖులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ రీపోస్ట్‌లు చేశారు. ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద దీనిపై స్పందిస్తూ.. "ఇండియాలో కాక్రోచ్ జనతా పార్టీ అకౌంట్‌ను ఎందుకు నిలిపివేశారు?" అని ప్రశ్నిస్తూ ఆమె ఆ పోస్ట్‌ను షేర్ చేశారు.

ఇక స్టాండప్ కమెడియన్ వీర్ దాస్ తనదైన స్టైల్ కామెడీతో స్పందిస్తూ.. "ఇది పూర్తిగా స్ట్రైసాండ్ ఎఫెక్ట్ (Streisand Effect) లాంటిది" అని రాసుకొచ్చారు. ఒక సమాచారాన్ని లేదా విషయాన్ని దాచడానికి లేదా సెన్సార్ చేయడానికి ప్రయత్నించినప్పుడు, అది మరింత ఎక్కువగా ప్రజల్లోకి వెళ్లి వైరల్ అవ్వడాన్ని సైకాలజీలో 'స్ట్రైసాండ్ ఎఫెక్ట్' అంటారు.

ప్రకాష్ రాజ్, సనమ్ శెట్టి మద్దతు

మరోవైపు సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ ఈ యూత్ మూవ్‌మెంట్‌కు తన మద్దతు పలికారు. "నమ్మకం ఉంది.. ఇది కచ్చితంగా జరుగుతుంది. నా దేశ యువత మేల్కొంటుంది.. ఎదురు తిరుగుతుంది. తమ హక్కులను తిరిగి పొందుతుంది. మీ అందరికీ మరిన్ని శక్తులు రావాలి" అంటూ తన ప్రసిద్ధ హ్యాష్‌ట్యాగ్ #justasking తో రీపోస్ట్ చేశారు.

నటి సనమ్ శెట్టి కూడా ఈ వినూత్న ఉద్యమాన్ని ప్రశంసించారు. "కేవలం ఒక్క వారంలోనే #CockroachJantaParty దేశవ్యాప్తంగా ఒక భారీ పవర్ సెంటర్‌గా మారింది. ఇది చాలా కొత్తగా, ఆశాజనకంగా ఉంది. ఇది ఏ దిశగా వెళ్తుందో చూడాలని ఆసక్తిగా ఉంది. యువత గొంతుకకు ఆల్ ది బెస్ట్" అని ఆమె పేర్కొన్నారు.

అసలు ఏమిటీ 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP)?

ఈ ఉద్యమం మే 16న 30 ఏళ్ల పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అభిజీత్ దిప్కే ప్రారంభించారు. ఇటీవల ఒక కోర్టు విచారణ సందర్భంగా భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్య కాంత్ చేసిన వ్యాఖ్యల ఆధారంగా ఈ పార్టీ పుట్టుకొచ్చింది.

ఆయన మాట్లాడుతూ.. "కొంతమంది యువకులు బొద్దింకల లాంటివారు. వారికి ఎలాంటి ఉపాధి లేదా ఉద్యోగం ఉండదు. అలాంటి వారిలో కొందరు మీడియాగా, మరికొందరు సోషల్ మీడియాగా, ఆర్‌టీఐ (RTI) యాక్టివిస్టులుగా మారి అందరిపై దాడులు చేయడం (విమర్శించడం) ప్రారంభిస్తారు" అని వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలపై నిరసనగా యువత తమ అసంతృప్తిని శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా తెలియజేయడానికి ఈ జెన్-జీ (GenZ) సెటైరికల్ మూవ్‌మెంట్‌ను ప్రారంభించారు. ఇది రిజిస్టర్డ్ రాజకీయ పార్టీ కాకపోయినప్పటికీ, వీరు 5-పాయింట్ల మేనిఫెస్టోను కూడా విడుదల చేశారు.

లాంచ్ అయిన కొద్ది రోజుల్లోనే ఈ మూవ్‌మెంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 16.3 మిలియన్ల ఫాలోవర్లను సంపాదించుకోవడం విశేషం. అయితే తమ ఇన్‌స్టాగ్రామ్ పేజీని కూడా హ్యాక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఫౌండర్ అభిజీత్ ఆరోపించారు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. కాక్రోచ్ జనతా పార్టీ (CJP) అంటే ఏమిటి?

ఇది దేశంలోని యువత, సోషల్ మీడియా యాక్టివిస్టుల పట్ల వచ్చిన ఒక వ్యాఖ్యకు నిరసనగా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అభిజీత్ దిప్కే ప్రారంభించిన ఒక వ్యంగ్యాత్మక, శాంతియుత నిరసన రాజకీయ ఉద్యమం.

2. కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం ప్రారంభం కావడానికి కారణం ఏమిటి?

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్ కోర్టు విచారణలో కొంతమంది నిరుద్యోగ యువత/యాక్టివిస్టులను 'బొద్దింకల'తో పోలుస్తూ చేసిన వ్యాఖ్యల ఆధారంగా ఈ నిరసన ఉద్యమం పుట్టింది.

3. ఈ పార్టీకి ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంతమంది ఫాలోవర్లు ఉన్నారు?

ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే ఈ వినూత్న ఉద్యమానికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 16.3 మిలియన్ల మంది ఫాలోవర్లు లభించారు.

4. దీనిపై సెలబ్రిటీలు ఎలా స్పందించారు?

నటుడు ప్రకాష్ రాజ్, సనమ్ శెట్టి ఈ యూత్ మూవ్‌మెంట్‌కు మద్దతు ఇవ్వగా, చిన్మయి, వీర్ దాస్ ఈ అకౌంట్‌ను ఇండియాలో బ్లాక్ చేయడంపై విమర్శలు గుప్పించారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe