David Dhawan Re Entry Reason At Age 74: బాలీవుడ్లో అవుట్ అండ్ అవుట్ కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచిన సీనియర్ దర్శకుడు డేవిడ్ ధావన్ మళ్లీ మెగాఫోన్ పట్టారు. 74 ఏళ్ల వయసులో, సాధారణంగా చాలా మంది విశ్రాంతి తీసుకునే రోజుల్లో ఆయన సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రీ ఎంట్రీ ఇస్తున్నారు.
హై జవానీ తో ఇష్క్ హోనా హై ట్రైలర్ లాంచ్

ఆరేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత డేవిడ్ ధావన్ దర్శకత్వం వహించిన 'హై జవానీ తో ఇష్క్ హోనా హై' సినిమా ట్రైలర్ లాంచ్ వేడుక ముంబైలో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో డేవిడ్ ధావన్ కుమారుడు, ఈ మూవీ హీరో వరుణ్ ధావన్ తన తండ్రి రీఎంట్రీ వెనుకున్న అసలు కారణాన్ని వెల్లడించారు.
తెలుగు ప్రేక్షకులకు జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ సినిమాలు ఎలాంటి వినోదాన్ని పంచాయో, హిందీలో డేవిడ్ ధావన్ మార్క్ కామెడీ చిత్రాలు అలాంటి నవ్వుల పండగను సృష్టించాయి. గోవిందాతో ఆయన చేసిన 'రాజా బాబు', 'కూలీ నెం.1', 'బీవీ నెం.1' వంటి చిత్రాలు తెలుగులోనూ రీమేక్ అయి ఇక్కడి ప్రేక్షకులను అలరించాయి. ఇప్పుడు అదే నవ్వుల ఫార్ములాతో డేవిడ్ ధావన్ మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
నవ్వించడమే మా కుటుంబ సిద్ధాంతం
ప్రస్తుత కాలంలో థియేటర్లకు వచ్చే సినిమాల విజయాలపై ఇండస్ట్రీలోనే రకరకాల సందేహాలు వ్యక్తమవుతున్నాయని వరుణ్ ధావన్ పేర్కొన్నారు. "ఈ వయసులో కూడా నాన్న సినిమా తీయడం నిజంగా అద్భుతం. ప్రతి శుక్రవారం సినిమా ఆడుతుందో లేదో అని అందరం టెన్షన్ పడుతున్న రోజులివి. కానీ, నాన్న మాత్రం కేవలం ప్రేక్షకులను నవ్వించాలనే బలమైన నమ్మకంతో ఈ సినిమా తీశారు. మా కుటుంబానికి ఒకే ఒక సిద్ధాంతం ఉంది, అది జనాలను నవ్వించడం మాత్రమే" అని వరుణ్ ధావన్ స్పష్టం చేశారు.
ఈ సినిమాతో తండ్రీకొడుకుల కాంబినేషన్ నాలుగోసారి రిపీట్ అవుతోంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన 'మై తేరా హీరో' (2014), 'జుడ్వా 2' (2017), 'కూలీ నెం.1' (2020) చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి.
కొడుకును చూసి కన్నీళ్లు పెట్టుకున్న తండ్రి
{{/usCountry}}ఈ సినిమాతో తండ్రీకొడుకుల కాంబినేషన్ నాలుగోసారి రిపీట్ అవుతోంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన 'మై తేరా హీరో' (2014), 'జుడ్వా 2' (2017), 'కూలీ నెం.1' (2020) చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి.
కొడుకును చూసి కన్నీళ్లు పెట్టుకున్న తండ్రి
{{/usCountry}}హై జవానీ తో ఇష్క్ హోనా హై ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో డేవిడ్ ధావన్ తన కుమారుడు వరుణ్ గురించి మాట్లాడుతూ కాస్త భావోద్వేగానికి లోనయ్యారు. వరుణ్ కేవలం మంచి నటుడే కాదు, అంతకంటే మంచి కొడుకంటూ ప్రశంసలు కురిపించారు.
"నటుడిగా వరుణ్ రోజురోజుకూ ఎదుగుతున్నాడు, ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని అందిస్తున్నాడు. కానీ, ఒక తండ్రిగా చెప్తున్నాను.. ప్రతి ఒక్కరికీ వరుణ్ లాంటి కొడుకే పుట్టాలి. నేను అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నప్పుడు వరుణ్ నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాడు. నాతోపాటే ఆసుపత్రి గదిలోనే పడుకునేవాడు. ఒక తండ్రికి ఇంతకంటే ఏం కావాలి?" అంటూ డేవిడ్ ధావన్ కన్నీళ్లు పెట్టుకున్నారు.
తెలుగు భామల సందడి
ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్లో వరుణ్ ధావన్ సరసన మన టాలీవుడ్ బ్యూటిఫుల్ భామలు పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ హీరోయిన్స్గా నటిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై సౌత్ ఇండియాలోనూ మంచి అంచనాలు ఉన్నాయి.
రమేష్ తౌరానీ 'టిప్స్ ఫిల్మ్స్' బ్యానర్పై ఈ చిత్రాన్ని నిర్మించగా, గౌరవ్ బోస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మనీష్ పాల్, చుంకీ పాండే, జిమ్మీ షెర్గిల్, మౌనీ రాయ్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఈ సమ్మర్ కానుకగా జూన్ 5వ తేదీన హై జవానీ తో ఇష్క్ హోనా హై సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.