Deepika Padukone: పిల్లలకు ఊపిరి ఆడటం లేదు.. ఇది కరెక్టేనా.. సాయం చేయండి: దీపికా పదుకోన్ పోస్ట్ వైరల్
Deepika Padukone: దీపికా పదుకోన్ చేసిన ఇన్స్టాగ్రామ్ స్టోరీ వైరల్ అవుతోంది. ముంబైలో గాలి నాణ్యత తగ్గిపోవడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేస్తూ పిల్లలకు ఊపిరి ఆడటం లేదని, సాయం చేయాలని ముంబై కార్పొరేషన్ ను ట్యాగ్ చేసింది.
బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. గురువారం (మార్చి 12) ఉదయం ముంబై మహానగరం దట్టమైన పొగమంచు, కాలుష్యం ముసుగులో నిద్రలేచింది. నగరవ్యాప్తంగా గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. దీనిపైనే దీపిక తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పౌరుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేసింది.

'ఇది ఎలా ఆమోదయోగ్యం?' - దీపికా ప్రశ్న
దీపికా పదుకోన్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ముంబై ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) మ్యాప్ను షేర్ చేస్తూ.. నగరంలోని భయంకరమైన కాలుష్య స్థాయిలను ఎత్తిచూపింది. "ఈ నగరం (ఇంకా ఇక్కడి పిల్లలు) ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు! ఇది ఎలా ఆమోదయోగ్యం!?" అని ఆమె ప్రశ్నించింది.
బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC), ఆరోగ్య శాఖ అధికారులను ట్యాగ్ చేస్తూ, వెంటనే స్పందించాలని కోరింది. గురువారం ముంబైలో AQI 159గా నమోదైంది, ఇది 'అనారోగ్యకరమైన' (Unhealthy) కేటగిరీకి చెందుతుంది.
దీపికా కంటే ముందే నటీమణులు సయామీ ఖేర్, రిచా చద్దా కూడా ముంబై కాలుష్యంపై గళం విప్పారు. సయామీ స్పందిస్తూ.. "గాలిలో వైరస్ లేదు, కానీ ఈ గాలే మనిషిని చంపేలా ఉంది" అని ఆవేదన వ్యక్తం చేయగా, రిచా చద్దా దీనిని "మానవ నిర్మిత విషాదం" అని అభివర్ణించింది.
దీపికా పదుకోన్ రాబోయే సినిమాలు
వృత్తిపరంగా దీపికా ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న కింగ్ మూవీలో దీపికా కీలక పాత్ర పోషిస్తోంది. వీరిద్దరి కలయికలో వస్తున్న ఆరో సినిమా ఇది. ఈ ఏడాది డిసెంబర్ 24న ఈ చిత్రం విడుదల కానుంది.
అట్లీ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ సినిమాలో దీపికా కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా 2027లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇక మరో రెండు పెద్ద సినిమాలు కల్కి 2898 ఏడీ సీక్వెల్, స్పిరిట్ నుంచి ఆమె తప్పుకున్న విషయం తెలిసిందే. ఆమె లేవనెత్తిన రోజుకు 8 గంటల పని డిమాండ్ పై ఇప్పటికీ చర్చ నడుస్తూనే ఉంది.

ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


