Deepika Padukone: లడఖ్ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్చుక్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ సపోర్ట్ చేస్తూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టిందంటూ ఒక స్క్రీన్ షాట్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. కేంద్ర ప్రభుత్వంపై ఆమె సంచలన కామెంట్స్ చేసి, నిమిషాల్లోనే ఆ పోస్ట్ను డిలీట్ చేసిందని ప్రచారం నడుస్తోంది. అయితే ఈ వైరల్ ప్రచారం వెనుక ఉన్న అసలు సత్యం ఏంటో ఫ్యాక్ట్ చెక్లో తేలిపోయింది.
వైరల్ స్క్రీన్ షాట్ కథేంటి?

సోషల్ మీడియా వేదికగా దీపికా పదుకోన్ ఇన్స్టాగ్రామ్ స్టోరీకి సంబంధించిన ఒక స్క్రీన్ షాట్ తెగ చక్కర్లు కొడుతోంది. అందులో సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష ఫోటోను రీ-షేర్ చేస్తూ.. "ఆయన ఉపవాసం చేస్తున్నారు.. మనం మాత్రం స్క్రోలింగ్ చేస్తున్నాం" అనే క్యాప్షన్ కనిపించింది.
దానితో పాటు "దీనిపై ఎవరూ ఎందుకు మాట్లాడటం లేదు? మనం ప్రజాస్వామ్యంలో అత్యంత చీకటి సమయాన్ని చూస్తున్నాం. ఫెయిల్ అయిన లీడర్ను కలర్ ఫుల్గా చూపించడానికి ఎన్ని సినిమాలు తీసినా నిజ జీవితంలో మాత్రం అది మారడం లేదు" అంటూ ఘాటు వ్యాఖ్యలు రాసి ఉన్నాయి.
ఫ్యాక్ట్ చెక్ లో తేలిన నిజం ఇదే!
ఈ పిక్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవ్వడంతో చాలామంది దీపికా నిజంగానే ప్రభుత్వంపై ఫైర్ అయిందని భావించారు. అయితే దీపికా అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో కానీ, ఆమె సోషల్ మీడియా ఆర్కైవ్స్లో కానీ ఇలాంటి పోస్ట్ పెట్టినట్లు ఎలాంటి ఆధారాలు లేవు. ఎవరో కావాలని డిజిటల్ ఎడిటింగ్ టూల్స్ ఉపయోగించి మార్ఫింగ్ చేసిన ఫేక్ స్క్రీన్ షాట్ ఇదని స్పష్టమైంది.
దీపికా ఇలాంటి ఫేక్ ప్రచారాల్లో చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఆమె భర్త రణ్వీర్ సింగ్ నటించిన 'ధురంధర్: ది రివేంజ్' సినిమాపై కూడా ఆమె ఒక నెగెటివ్ రివ్యూ ఇన్స్టాగ్రామ్ లో రాసి డిలీట్ చేసిందంటూ ఒక ఫేక్ స్క్రీన్ షాట్ వైరల్ అయింది. ఆ సమయంలో కూడా అది ఫేక్ పిక్ అని తేలింది.
19వ రోజుకు చేరిన సోనమ్ వాంగ్చుక్ దీక్ష
{{/usCountry}}దీపికా ఇలాంటి ఫేక్ ప్రచారాల్లో చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఆమె భర్త రణ్వీర్ సింగ్ నటించిన 'ధురంధర్: ది రివేంజ్' సినిమాపై కూడా ఆమె ఒక నెగెటివ్ రివ్యూ ఇన్స్టాగ్రామ్ లో రాసి డిలీట్ చేసిందంటూ ఒక ఫేక్ స్క్రీన్ షాట్ వైరల్ అయింది. ఆ సమయంలో కూడా అది ఫేక్ పిక్ అని తేలింది.
19వ రోజుకు చేరిన సోనమ్ వాంగ్చుక్ దీక్ష
{{/usCountry}}మరోవైపు ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర సోనమ్ వాంగ్చుక్ చేపట్టిన నిరాహార దీక్ష గురువారంతో 19వ రోజుకు చేరుకుంది. ఇటీవల దేశవ్యాప్తంగా కలకలం రేపిన నీట్ (NEET) పరీక్షల పేపర్ లీక్, అక్రమాలపై బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జూన్ 28న ఆయన ఈ దీక్ష ప్రారంభించారు.
ప్రస్తుతం సోనమ్ వాంగ్చుక్ ఆరోగ్య పరిస్థితి దారుణంగా క్షీణించింది. ఆయన బరువు 57.15 కేజీలకు పడిపోయిందని, దీక్ష ప్రారంభించినప్పటి నుంచి దాదాపు 8.9 కేజీల బరువు తగ్గారని డాక్టర్లు వెల్లడించారు. ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. ఆయనకు తక్షణమే ఆసుపత్రిలో అత్యవసర వైద్యం అందించాలని పిటిషనర్లు కోరారు. అయితే ప్రభుత్వం వచ్చి తనతో చర్చలు జరిపే వరకు దీక్ష విరమించేది లేదని వాంగ్చుక్ స్పష్టం చేస్తున్నారు.