Dhurandhar Rerelease: ధురంధర్ రీరిలీజ్.. ధురంధర్ 2 రిలీజ్కు ముందు సర్ప్రైజ్.. అనౌన్స్ చేసిన రణ్వీర్ సింగ్
Dhurandhar Rerelease: బాక్సాఫీస్ దగ్గర రికార్డులు తిరగరాసిన ధురంధర్ మూవీ రీరిలీజ్ కానుంది. ధురంధర్ 2 రిలీజ్ కు ముందు మేకర్స్ ఈ సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ విషయాన్ని రణ్వీర్ సింగ్ వెల్లడించాడు.
బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణవీర్ సింగ్ బాక్సాఫీస్ వద్ద మరోసారి తన ప్రతాపం చూపేందుకు సిద్ధమయ్యాడు. అతడు నటించిన బ్లాక్ బస్టర్ హిట్ 'ధురంధర్' (Dhurandhar) మూవీ.. దాని సీక్వెల్ విడుదలకు ముందు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తిరిగి వస్తోంది. "తుఫానుకు ముందు ఆంధీ (పెను తుఫాను) వస్తోంది" అంటూ రణవీర్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.

ధురంధర్ రీ-రిలీజ్ ఎప్పుడు? ఎక్కడ?
'ధురంధర్' సీక్వెల్ 'ధురంధర్: ది రివెంజ్' మార్చి 19న విడుదల కానుంది. దానికి వారం రోజుల ముందుగానే మొదటి భాగాన్ని భారీ స్థాయిలో రీ-రిలీజ్ చేస్తున్నారు. ఇండియాలో మార్చి 12 నుండి సుమారు 250 థియేటర్లలో ప్రదర్శించనున్నారు.
ఇక ప్రపంచవ్యాప్తంగా మార్చి 13 నుండి మరో 250 స్క్రీన్లలో ఈ మూవీ అలరించనుంది. మొత్తం 1000కి పైగా స్క్రీన్లలో రోజుకు 1250కి పైగా షోలతో ఇది అతిపెద్ద రీ-రిలీజ్ గా నిలవనుంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో 185 స్క్రీన్లలో ఈ సినిమాను ప్రదర్శించబోతున్నారు.
బాక్సాఫీస్ సునామీ: మొదటి భాగం రికార్డులు
ఆదిత్య ధర్ దర్శకత్వంలో గతేడాది డిసెంబర్ 5న విడుదలైన 'ధురంధర్' బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఒక స్పై థ్రిల్లర్ గా వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 1,300 కోట్లు వసూలు చేయగా, అందులో కేవలం భారత మార్కెట్ నుంచే రూ. 1,000 కోట్లు రావడం విశేషం. ఈ అద్భుతమైన ఆదరణను దృష్టిలో పెట్టుకుని జియో స్టూడియోస్, బి62 స్టూడియోస్ ఈ చిత్రాన్ని మళ్లీ వెండితెరపైకి తెస్తున్నాయి.
'ధురంధర్: ది రివెంజ్' పై భారీ అంచనాలు
సీక్వెల్ మార్చి 19న ఉగాది, గుడి పడ్వా, ఈద్ పండుగల సందర్భంగా విడుదల కానుంది. మొదటి భాగం కేవలం హిందీలో మాత్రమే రాగా, సీక్వెల్ ను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా డబ్ చేసి విడుదల చేస్తున్నారు.
కరాచీలోని లియారీ టౌన్ గ్యాంగ్ వార్స్, కందహార్ హైజాక్, ముంబై దాడుల వంటి వాస్తవ సంఘటనల నేపథ్యంలో సాగే ఈ స్పై థ్రిల్లర్ లో రణవీర్ పాత్ర 'హమ్జా అలీ మజారీ' అలియాస్ 'జస్కీరత్ సింగ్ రంగీ' ప్రయాణాన్ని సీక్వెల్ లో మరింత లోతుగా చూపించనున్నారు.
ఈ చిత్రంలో ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, సారా అర్జున్, రాకేశ్ బేడి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అమెరికా, కెనడాల్లో మార్చి 18నే ప్రీమియర్ షోలు వేయనున్నారు. సాధారణంగా హాలీవుడ్ భారీ చిత్రాలకు కేటాయించే పీఎల్ఎఫ్ (PLF) స్క్రీన్లలో, డాల్బీ అట్మోస్ వంటి అత్యాధునిక సాంకేతికతతో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


