రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ జోడీ గత కొన్ని వారాలుగా వార్తల్లో కొనసాగుతూనే ఉంది. ఫిబ్రవరి 26న ఉదయ్పూర్లో వీళ్ల వివాహం జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్ లో మార్చి 4న రిసెప్షన్ నిర్వహించారు. ఈ పెళ్లి, రిసెప్షన్ ఫొటోలు వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడేమో డియర్ కామ్రేడ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో రష్మిక మందన్న స్పీచ్ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది.
రష్మిక, విజయ్ కలిసి

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి రెండు సినిమాలు చేశారు. 2018లో గీత గోవిందం, 2019లో డియర్ కామ్రేడ్ సినిమాల్లో జోడీగా కలిసి కనిపించారు. అయితే గీత గోవిందం చేసిన తర్వాత విజయ్ తో మళ్లీ డియర్ కామ్రేడ్ లో కలిసి నటించేందుకు రష్మిక తన ఇంట్లో వాళ్లతో ఫైట్ చేసింది. ఈ విషయాన్ని డియర్ కామ్రేడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో రష్మిక మందన్న స్వయంగా వెల్లడించింది.
సినిమా వద్దని
“నేను నా తల్లిదండ్రులు, కుటుంబం, స్నేహితులతో పోరాడిన తర్వాతే సినీ పరిశ్రమలోకి వచ్చా. అమ్మాయిలకు ఇది సురక్షితం కాదనే అభిప్రాయం ఉంది. సినీ నేపథ్యం లేకపోయినా నేను పట్టుదలతో పనిచేశా. భరత్ (కమ్మా) సర్ నాకు స్క్రిప్ట్ (డియర్ కామ్రేడ్ మూవీ) పంపినప్పుడు ఈ మూవీ చేయాలనుకున్నా.
కానీ నా కుటుంబాన్ని ఒప్పించడానికి చాలా సమయం పట్టింది. ఇంట్లో పెద్ద ఫైట్ జరిగింది. వాళ్లేమో 'వద్దు, విజయ్తో రెండో సినిమా చేయొద్దు' అన్నారు. నేనేమో 'నేను ఎవరితో చేస్తున్నాననేది ముఖ్యం కాదు' అని ఒప్పించా’’ అని రష్మిక చెప్పింది.
అదే కారణమా?
అయితే విజయ్ దేవరకొండతో రష్మిక మందన్నను రెండో సినిమా చేయొద్దని ఫ్యామిలీ చెప్పడం వెనుక ఓ కారణం ఉందనే టాక్ వినిపిస్తోంది. రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం రద్దు చేసుకున్నాక విజయ్ తో కలిసి గీత గోవిందం మూవీ చేసింది రష్మిక. రష్మిక నిశ్చితార్థం చెడిపోవడానికి కారణం విజయ్ అనే ఆరోపణలు వినిపించాయి. అందుకే వెంటనే విజయ్ తో మరో సినిమా అంటే బాగోదని రష్మిక ఫ్యామిలీ చెప్పిందనే ప్రచారం జోరుగా సాగింది.
{{/usCountry}}అయితే విజయ్ దేవరకొండతో రష్మిక మందన్నను రెండో సినిమా చేయొద్దని ఫ్యామిలీ చెప్పడం వెనుక ఓ కారణం ఉందనే టాక్ వినిపిస్తోంది. రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం రద్దు చేసుకున్నాక విజయ్ తో కలిసి గీత గోవిందం మూవీ చేసింది రష్మిక. రష్మిక నిశ్చితార్థం చెడిపోవడానికి కారణం విజయ్ అనే ఆరోపణలు వినిపించాయి. అందుకే వెంటనే విజయ్ తో మరో సినిమా అంటే బాగోదని రష్మిక ఫ్యామిలీ చెప్పిందనే ప్రచారం జోరుగా సాగింది.
{{/usCountry}}రష్మిక వార్నింగ్
విజయ్ దేవరకొండతో రష్మిక మందన్న పెళ్లి తర్వాత గతంలో తన లైఫ్ కు సంబంధించిన విషయాలపై ఓ ఆడియో క్లిప్ వైరల్ అయింది. 2017లో రక్షిత్ శెట్టితో రష్మిక ఎంగేజ్మెంట్ జరిగింది. 2018లో వీళ్లు ఆ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు వైరల్ గా మారిన ఆడియో క్లిప్ పై రష్మిక ఫైర్ అయింది. 24 గంటల్లో ఆ క్లిప్ తొలగించాలని వార్నింగ్ ఇచ్చింది.
మూడో సినిమా
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా చేస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘రణబాలి’లో కలిసి నటిస్తున్నారు. ఈ మూవీ 2026 సెప్టెంబర్ లో థియేటర్లకు రాబోతుంది.