రొమాంటిక్ డ్రామాతో మొదలై.. ఇప్పుడు పెళ్లివరకు.. రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ లవ్ స్టోరీ తెలుసా?
టాలీవుడ్ లవ్ బర్ట్స్ రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. మూడుముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఇప్పుడు వీళ్ల విషయాలే హాట్ టాపిక్స్ గా మారాయి. ఈ నేపథ్యంలో రష్మిక, విజయ్ లవ్ స్టోరీ ఎలా మొదలైందో ఓ సారి చూసేయండి.
విరోష్.. ఇప్పుడు సోషల్ మీడియాలో, ఇంటర్నెట్ లో ఎక్కడ చూసినా ఇదే ట్రెండింగ్. రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ జంటకు ఫ్యాన్స్ పెట్టిన పేరు ఇది. ఈ లవ్ బర్డ్స్ ఫిబ్రవరి 26న పెళ్లి చేసుకుంటున్న నేపథ్యంలో రష్మిక, విజయ్ విషయాలు హాట్ టాపిక్ గా మారాయి. వీళ్ల లవ్ స్టోరీ గురించి తెలుసుకోవాలని నెటిజన్లు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

విరోష్ వెడ్డింగ్
లవ్, డేటింగ్, రిలేషన్ షిప్.. ఇలా రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ బంధంపై కొంత కాలంగా చాలా పుకార్లు వచ్చాయి. కానీ ఈ జంట గతంలో ఎప్పుడూ వీటిపై మాట్లాడలేదు. కలిసే వెకేషన్లకు వెళ్లినా, జంటగా కనిపించినా కానీ సైలెంట్ గానే ఉండిపోయారు. కానీ ఇప్పుడు వెడ్డింగ్ పై అనౌన్స్ మెంట్ చేయాల్సిన టైమ్ రావడంతో సోషల్ మీడియాలో విరోష్ వెడ్డింగ్ అంటూ ఓ ప్రకటన రిలీజ్ చేశారు. తమ పెళ్లిని కన్ఫామ్ చేశారు.
రష్మిక, విజయ్ పెళ్లి
ఫ్యాన్స్ అందరూ ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న రోజు రానే వస్తుంది. ఫిబ్రవరి 26న రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఉదయ్ పూర్ లో వీళ్ల పెళ్లి జరగనుంది. ఇప్పటికే రష్మిక, విజయ్ అక్కడికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ లవ్ బర్ట్స్ లవ్ స్టోరీ వైరల్ గా మారింది.
గీత గోవిందంతో మొదలై
రష్మిక మందన్న, విజయ్ దేవరకొండల ప్రేమ కథ ‘గీత గోవిందం’ సినిమాతో మొదలైంది. 2018లో రిలీజైన ఈ మూవీలో ఈ జంట తొలిసారి కలిసి నటించింది. 'గీత గోవిందం' సినిమా సెట్స్లోనే ఈ లవ్ స్టోరీ ప్రాణం పోసుకుంది. ఈ రొమాంటిక్ డ్రామా ఫిల్మ్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. స్క్రీన్ పై వాళ్ల కెమిస్ట్రీ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. తెర వెనుక కూడా రష్మిక, విజయ్ కెమిస్ట్రీ అప్పుడే మొదలైంది.
మనసులు కలిసి
గీత గోవిందం సినిమాలో కలిసి యాక్ట్ చేసిన తర్వాత రష్మిక, విజయ్ తరచుగా బయట కలిసి కనిపించారు. ఇక ఆ తర్వాత డియర్ కామ్రేడ్ తో వీళ్ల రిలేషన్ షిప్ మరింత స్ట్రాంగ్ గా మారింది. ఈ మూవీతో విరోష్ జంట సూపర్ హిట్ ఆన్ స్క్రీన్ జోడిగా నిలిచింది. వీళ్ల మనసులూ కలిశాయి. అప్పటి నుంచి వెకేషన్లు, డిన్నర్లు, టూర్లు, మూవీ షూటింగ్ లు అంటూ రష్మిక, విజయ్ బయట బాగానే కలిసి కనిపించారు. చివరకు 2025 అక్టోబర్ లో వీళ్ల ఎంగేజ్మెంట్ జరిగింది. ఇప్పుడు పెళ్లికి రెడీ అయిపోయారు.
ముచ్చటగా మూడోసారి కలిసి రణబాలి అనే సినిమాలో రష్మిక, విజయ్ నటిస్తున్నారు. వీళ్ల పెళ్లి తర్వాత ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


