టాక్సిక్ మూవీపై పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాలు ఉన్నాయి. యశ్ లీడ్ రోల్లో నటిస్తున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులను ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఏకంగా రూ.120 కోట్లకు కొన్నాడని ఈ మధ్యే వార్తలు వచ్చాయి. ఇప్పుడు వాటిని అతడే ధృవీకరించడంతోపాటు అది నమ్మని వారికి తన బ్యాంకు స్టేట్మెంట్ పంపిస్తా అని కూడా అనడం విశేషం.
వాళ్లకు ఇదే నా సమాధానం

టాలీవుడ్ ప్రొడ్యూసర్ తాజాగా విక్రాంత్ లీడ్ రోల్లో నటించిన మార్కండేయ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఓ రిపోర్టర్ మిమ్మల్ని దిల్ రాజు అనాలా లేక డేర్ రాజు అనాలా అంటూ ప్రశ్న అడిగాడు. దీనికి అతడు స్పందిస్తూ.. మీ ఇష్టం.. ఎలా పిలిచినా ఓకే అని రాజు అన్నాడు.
ఆ తర్వాత టాక్సిక్ మూవీ తెలుగు రాష్ట్రాల హక్కులను దిల్ రాజు రూ.120 కోట్లకు కొన్నాడన్నది కేవలం పబ్లిసిటీ స్టంట్ మాత్రమే అని విమర్శలు వస్తున్నాయి కదా అని అడిగారు. దీనికి దిల్ రాజు స్పందిస్తూ.. “అలాంటి వాళ్లకు నేను బ్యాంకు నుంచి వాళ్లకు అమౌంట్ పంపిన తర్వాత వాళ్లకు స్టేట్మెంట్ చూపిస్తాను. అలా అయినా వాళ్లు నమ్ముతారేమో” అని అనడం విశేషం.
అల్లు అర్జున్ 42 రూల్స్ వివాదంపై..
ఇక సోషల్ మీడియాలో ఈమధ్య వైరల్ అయిన మరో వివాదం అల్లు అర్జున్ 42 రూల్స్. బన్నీని కలవాలంటే ఏకంగా 42 కండిషన్స్ కు ఓకే చెప్పాలంటూ కావేరి బారువా అనే ఓ బ్రాండ్ మేనేజర్ ఆరోపించడం.. దీనికి అల్లు అర్జున్ టీమ్ సీరియస్ గా స్పందిస్తూ లీగల్ చర్యలకు దిగడం తెలిసిందే.
దీని గురించి కూడా తాజాగా ఓ రిపోర్టర్ దిల్ రాజును అడిగారు. సోషల్ మీడియాలో ఈ మధ్య ఓ వివాదం జరుగుతోంది కదా.. అల్లు అర్జున్ 42 రూల్స్ అనేదో అని అడిగితే.. ఏం జరుగుతోంది.. నేను సోషల్ మీడియాలో నేను యాక్టివ్ గా ఉండను.. నాకు తెలియదు అని సింపుల్ గా చెప్పేశాడు.
{{/usCountry}}దీని గురించి కూడా తాజాగా ఓ రిపోర్టర్ దిల్ రాజును అడిగారు. సోషల్ మీడియాలో ఈ మధ్య ఓ వివాదం జరుగుతోంది కదా.. అల్లు అర్జున్ 42 రూల్స్ అనేదో అని అడిగితే.. ఏం జరుగుతోంది.. నేను సోషల్ మీడియాలో నేను యాక్టివ్ గా ఉండను.. నాకు తెలియదు అని సింపుల్ గా చెప్పేశాడు.
{{/usCountry}}మరోవైపు టాక్సిక్ మూవీ మార్చి 19న రిలీజ్ కానుంది. అయితే ఇప్పటి వరకూ వచ్చిన ఒక టీజర్ పైనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా క్రిస్టియన్ సంఘాలు కూడా టీజర్లో ఉన్న కొన్ని సీన్స్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సీబీఎఫ్సీకి ఫిర్యాదు చేశారు.