Dimple Hayathi Bold Comments: ‘తప్పు మాది కాదు..ఆ సిస్టమ్ది’-పెద్ది వివాదం వేళ డింపుల్ హయాతి సంచలన పోస్ట్-వారే టార్గెట్
Dimple Hayathi Bold Comments: కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ల పాత్రల చిత్రీకరణ, 'ఫ్లవర్ పాట్' క్యారెక్టర్లపై నటి డింపుల్ హయాతి సోషల్ మీడియా వేదికగా చేసిన ఘాటు వ్యాఖ్యలు టాలీవుడ్ ను కుదిపేస్తున్నాయి. హీరోయిన్లను ట్రోల్ చేసే ముందు ఇండస్ట్రీ సిస్టమ్ను, మేకర్స్ను బ్లేమ్ చేయాలంటూ ఆమె ఫైర్ అయింది.
Dimple Hayathi Bold Comments: టాలీవుడ్ కమర్షియల్ సినిమాల్లో మహిళా పాత్రల పరిధి ఎంత? కేవలం రెండు పాటలు, నాలుగు గ్లామర్ సీన్లకే హీరోయిన్లు పరిమితం కావాలా? ఈ ప్రశ్నలపై చాలా కాలంగా చర్చ జరుగుతున్నప్పటికీ.. 'ఖిలాడీ' ఫేమ్ డింపుల్ హయాతీ (Dimple Hayathi) సోషల్ మీడియా వేదికగా చేసిన సరికొత్త పోస్ట్ ఇప్పుడు చిత్ర పరిశ్రమలో తీవ్ర దుమారం రేపుతోంది.

డింపుల్ హయాతి ఎటాక్
సినిమాల్లో హీరోయిన్ల క్యారెక్టర్లను సరిగ్గా రాయకుండా, కేవలం గ్లామర్కే పరిమితం చేస్తున్నారని డింపుల్ హయాతి ఫైర్ అయింది. ఆ తర్వాత హీరోయిన్లను బ్లేమ్ చేయడం తగదంటూ ఆమె ఇండస్ట్రీ సిస్టమ్పై డైరెక్ట్ ఎటాక్ చేసింది. పెద్ది మూవీలో జాన్వీ కపూర్ పాత్ర వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో డింపుల్ సోషల్ మీడియా పోస్టు వైరల్ అవుతోంది.
మేకర్స్పై డింపుల్ డైరెక్ట్ కౌంటర్
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లపై వచ్చే విమర్శలను తిప్పికొడుతూ డింపుల్ హయాతీ చాలా బోల్డ్గా మాట్లాడింది. "దర్శకనిర్మాతలు ఆఫర్ చేసిన పాత్రల్లో నటించిన తర్వాత, మళ్లీ ఆ హీరోయిన్నే తప్పుబట్టడం ఇక్కడ అందరికీ ఒక అలవాటుగా మారింది’’ అని డింపుల్ మండిపడింది.
తప్పు హీరోయిన్లది కాదు
‘‘ఇక్కడ తప్పు హీరోయిన్లదే కాదు, కేవలం గ్లామర్ మాత్రమే అమ్ముడుపోతుందని భావించే ఇండస్ట్రీ సిస్టమ్, మేకర్స్ది. సినిమాలో మహిళా పాత్రలను సరిగ్గా డిజైన్ చేయకపోతే, ఆ బాధ్యత పూర్తిగా రైటింగ్, మేకింగ్ ఎంపికలదే అవుతుంది" అని డింపుల్ హయాతి రాసుకొచ్చింది.
ఈ రకంగా చెప్తూ.. హీరోయిన్ల నటన సామర్థ్యాన్ని పూర్తిగా వాడకుండానే వారిని ఒక నిర్దిష్టమైన ఇమేజ్తో స్టీరియోటైప్ (Stereotype) చేస్తున్నారని, అదే సమయంలో హీరోల చుట్టూ తిరిగే కథలకైతే పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నారని ఆమె ఆరోపించింది.
'పెద్ది' వివాదం బ్యాక్డ్రాప్
డింపుల్ హయాతీ ఈ వ్యాఖ్యలు చేయడానికి ఎంచుకున్న 'టైమింగ్' ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వచ్చిన 'పెద్ది' సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ (అచియమ్మ పాత్ర) ను కేవలం గ్లామర్ బొమ్మగా చూపించారంటూ సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్ జరిగింది. ఆ ప్రెజర్ తట్టుకోలేక మేకర్స్ థియేటర్లలో ఆ సీన్లను ట్రిమ్ చేయాల్సి వచ్చింది.
గట్టి వార్నింగ్
సరిగ్గా జాన్వీ కపూర్ పాత్రపై ఇంత వివాదం నడుస్తున్న కరెంట్ సిట్యుయేషన్లోనే.. డింపుల్ హయాతి స్పందిస్తూ, "తప్పు నటించిన హీరోయిన్ది కాదు, అలా రాసిన రైటర్స్ అండ్ డైరెక్టర్స్ది" అని చెప్పడం పరోక్షంగా టాలీవుడ్ టాప్ మేకర్స్ అందరికీ గట్టి వార్నింగ్ ఇచ్చినట్లయిందని నెటిజన్లు భావిస్తున్నారు.
'జర్ర జర్ర' నుంచి 'రామబాణం' వరకు
'గద్దలకొండ గణేష్' చిత్రంలో 'జర్ర జర్ర' ఐటెం సాంగ్ ద్వారా మాస్ ఆడియన్స్కు విపరీతంగా కనెక్ట్ అయిన డింపుల్ హయాతి.. ఆ తర్వాత లీడ్ హీరోయిన్గా మారినా గ్లామర్ ఇమేజ్ నుండి బయటకు రాలేకపోయింది.
ఈ ట్రాక్ రికార్డే డింపుల్ ఆవేదనకు కారణమని చెప్పవచ్చు. తమకు వచ్చే పరిమిత అవకాశాల్లోనే నటీమణులు కష్టపడుతుంటారని, పెద్ద సినిమాల్లో నటిస్తూ ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువ కావాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తారని, కానీ మేకర్స్ వారిని కేవలం 'కమర్షియల్ ఎలిమెంట్' గానే వాడుకుంటున్నారని ఆమె స్పష్టం చేసింది.
People Also Ask (FAQ)
ప్రశ్న: టాలీవుడ్ హీరోయిన్ల పాత్రలపై డింపుల్ హయాతి చేసిన కామెంట్స్ ఏంటి?
జవాబు: సినిమాల్లో మహిళా పాత్రలను బలంగా రాయకుండా, కేవలం గ్లామర్ కోసమే వాడుకుంటూ, ఆ తర్వాత నటీమణులపైనే నిందలు వేయడం సరికాదని డింపుల్ రాసుకొచ్చింది.
ప్రశ్న: డింపుల్ హయాతి వ్యాఖ్యలకు, 'పెద్ది' సినిమా వివాదానికి సంబంధం ఏంటి?
జవాబు: ఇటీవల 'పెద్ది' సినిమాలో జాన్వీ కపూర్ క్యారెక్టరైజేషన్, గ్లామర్ సీన్స్ పై తీవ్ర విమర్శలు వచ్చి, ఆ సీన్లను మేకర్స్ ట్రిమ్ చేశారు. ఈ నేపథ్యంలోనే డింపుల్ "తప్పు మేకర్స్ది, హీరోయిన్లది కాదు" అని వ్యాఖ్యానించడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
ప్రశ్న: డింపుల్ హయాతి టాలీవుడ్లో నటించిన ముఖ్యమైన సినిమాలు ఏవి?
జవాబు: ఆమె తెలుగులో 'గద్దలకొండ గణేష్' (జర్ర జర్ర స్పెషల్ సాంగ్), రవితేజతో 'ఖిలాడి', గోపీచంద్ సరసన 'రామబాణం' వంటి చిత్రాలలో నటించింది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


