బాలీవుడ్ టాప్ సింగర్ అరిజీత్ సింగ్ రిటైర్మెంట్ వెనుక అసలు కారణం ఇదీ అంటూ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. తన గొంతుతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న అరిజీత్ సింగ్.. ఇకపై సినిమాల్లో ప్లేబ్యాక్ సింగర్గా పాటలు పాడనని అనౌన్స్ చేసి అందరినీ షాక్కు గురిచేశాడు. ‘ట్రైడ్ అండ్ రెఫ్యూజ్డ్ ప్రొడక్షన్స్’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో డైరెక్టర్ అనురాగ్.. అరిజీత్ మనసులో మాటను బయటపెట్టాడు.
"ఎప్పుడూ అదే పాట.. అదే ఏడుపు.."

అనురాగ్ కశ్యప్ మాట్లాడుతూ.. "అరిజీత్ సింగ్ రిటైర్మెంట్ ప్రకటించడానికి ప్రధాన కారణం.. అతను ఒకే రకమైన పాటలు పాడి పాడి అలసిపోయాడు. ఎప్పుడు చూసినా అదే ‘హార్ట్ బ్రేక్ సాంగ్’ పాడమంటారు. అరిజీత్ చాలా ప్రతిభావంతుడు. సాన్యా మల్హోత్రా నటించిన 'పగ్లైట్' (Pagglait) సినిమాకు అతను సంగీతం అందించాడు. అతను కేవలం గాయకుడే కాదు.. ఒక మంచి ఫిలిం మేకర్ కూడా. అతను చాలా ప్రైవేట్ వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఎప్పుడూ ఒకే మూసలో పాటలు పాడమంటే కష్టమే. విరహ గీతాల కంటే అరిజీత్ లో ఇంకా చాలా గొప్ప సంగీతం దాగి ఉంది" అని అనురాగ్ తెలిపాడు.
"మనసుతో పాడేవాడిని బంధించలేం.."
అరిజీత్ స్వేచ్ఛను కోరుకుంటాడని అనురాగ్ చెప్పాడు. "అతను చాలా కొత్తగా ఏదో చేయాలనుకుంటున్నాడు. మేము 'నిషాంచీ' (Nishaanchi) సినిమా చేసేటప్పుడు, అతను ఆ పాట కోసం 100 రకాలుగా ప్రయత్నించాడు. ఎందుకంటే అలాంటి పాట పాడమని అతన్ని అంతకుముందెవరూ అడగలేదు. సంగీతం అనేది మనసు నుంచి రావాలి. స్వచ్ఛమైన గాయకులు, సంగీతకారులు మనసుతో పని చేస్తారు. వాళ్లకు స్వేచ్ఛనిస్తే అద్భుతాలు సృష్టిస్తారు. అలా కాకుండా.. 'మాకు ఇలాగే కావాలి' అని ఆర్డర్ వేస్తే, వాళ్లు తమ చేతులు కట్టేసినట్లుగా ఫీలవుతారు. తమని తాము కోల్పోతున్నట్లు భావిస్తారు" అని అనురాగ్ విశ్లేషించాడు.
అరిజీత్ షాకింగ్ ప్రకటన..
గత నెల 27న అరిజీత్ సింగ్ తన సోషల్ మీడియా ద్వారా ఈ సంచలన నిర్ణయాన్ని ప్రకటించాడు. "అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇన్నేళ్లుగా శ్రోతలుగా మీరు నాకు ఇచ్చిన ప్రేమకు కృతజ్ఞతలు. ఇకపై నేను ప్లేబ్యాక్ వోకలిస్ట్గా కొత్త అసైన్మెంట్స్ తీసుకోనని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఇక్కడితో ఆపేస్తున్నాను. ఇదొక అద్భుతమైన ప్రయాణం" అని అతడు ఇన్స్టాగ్రామ్, ఎక్స్ వేదికగా పోస్ట్ చేశాడు.
అరిజీత్ కెరీర్ ఇలా..
{{/usCountry}}గత నెల 27న అరిజీత్ సింగ్ తన సోషల్ మీడియా ద్వారా ఈ సంచలన నిర్ణయాన్ని ప్రకటించాడు. "అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇన్నేళ్లుగా శ్రోతలుగా మీరు నాకు ఇచ్చిన ప్రేమకు కృతజ్ఞతలు. ఇకపై నేను ప్లేబ్యాక్ వోకలిస్ట్గా కొత్త అసైన్మెంట్స్ తీసుకోనని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఇక్కడితో ఆపేస్తున్నాను. ఇదొక అద్భుతమైన ప్రయాణం" అని అతడు ఇన్స్టాగ్రామ్, ఎక్స్ వేదికగా పోస్ట్ చేశాడు.
అరిజీత్ కెరీర్ ఇలా..
{{/usCountry}}2005లో ‘ఫేమ్ గురుకుల్’ అనే రియాలిటీ షో ద్వారా అరిజీత్ తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. 2011లో 'మర్డర్ 2' సినిమాలోని "ఫిర్ మొహబ్బత్" పాటతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. అయితే 2013లో వచ్చిన 'ఆషికి 2'లోని "తుమ్ హి హో" పాటతో రాత్రికి రాత్రే స్టార్ అయిపోయాడు.
చన్నా మేరేయా, అగర్ తుమ్ సాత్ హో, రాబ్తా, కేసరియా, ఏ దిల్ హై ముష్కిల్ వంటి ఎన్నో ఐకానిక్ పాటలను అతడు పాడాడు. విశాల్ భరద్వాజ్ 'ఓ రోమియో' సినిమాలో కూడా అతడు అద్భుతమైన పాటలు పాడాడు. ప్లేబ్యాక్ సింగింగ్ ఆపేసినా, అతడు మ్యూజిక్ డైరెక్టర్గా, ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ గా కొనసాగే అవకాశం ఉంది.