...
...
Next Story

హీరోగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్.. మూవీ టైటిల్ ఇదే.. రక్తం నిండిన ముఖంతో.. హైప్ పెంచేలా టీజర్

డైరెక్టర్ గా బ్లాక్ బస్టర్ సినిమాలు అందించిన లోకేష్ కనగరాజ్ ఇప్పుడు హీరోగా మారాడు. వైలెన్స్ తో కూడిన లవ్ స్టోరీగా ఆడియన్స్ ముందుకొస్తున్నాడు. ఈ మూవీ టైటిల్ టీజర్ ను ఇవాళ రిలీజ్ చేశారు మేకర్స్.

Published on: Nov 1, 2025, 20:02:27 IST
Advertisement

లోకేష్ కగనరాజ్.. ఈ పేరు వింటే బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గుర్తుకొస్తాడు. ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో, కూలీ లాంటి సూపర్ హిట్లను అందించాడు లోకేష్. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో సంచలనమే క్రియేట్ చేశాడు. అలాంటి డైరెక్టర్ ఇప్పుడు కెప్టెన్ సీట్ వదిలి రంగంలోకి దిగాడు. హీరోగా డెబ్యూ చేయబోతున్నాడు. అతను హీరోగా వస్తున్న సినిమా టైటిల్ ను ఇవాళ (నవంబర్ 1) రిలీజ్ చేశారు.

లోకేష్ కనగరాజ్ సినిమా

లోకేష్ కనగరాజ్ స్టిల్ (youtube)
లోకేష్ కనగరాజ్ స్టిల్ (youtube)

ఇప్పటివరకూ సాధారణంగా అయితే డైరెక్టర్ గా లోకేష్ కనగరాజ్ మూవీ టైటిల్ ను రివీల్ చేసేవాడు. ఇప్పుడు హీరోగా అతని మూవీ టైటిల్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. ఫుల్ యాక్షన్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘డీసీ’ అనే పేరు పెట్టారు. అంటే ఇందులో హీరో క్యారెక్టర్ పేరు దేవదాస్. హీరోయిన్ క్యారెక్టర్ పేరు చంద్ర. ఈ రెండు పేర్లలోని ఇంగ్లీష్ మొదటి లెటర్స్ కలిపి డీసీ అని పేరు పెట్టారు.

అదిరిపోయిన టీజర్

లోకేష్ కనగరాజ్ హీరోగా తెరకెక్కుతున్న డీసీ మూవీ టైటిల్ రిలీజ్ టీజర్ అదిరిపోయింది. రక్తం నిండిన ముఖంతో అలా నడుస్తూ లోకేష్ కనగరాజ్ వస్తున్న విజువల్ అదిరిపోయింది. మరోవైపు బాధలో వామికా గబ్బి నడిచి వస్తోంది. ఈ మూవీలో హీరోయిన్ వామికా గబ్బి. టీజర్ లో వీళ్లిద్దరూ ఒకరికొకరు కలుసుకోరు. చివర్లో అద్దంలో మాత్రమే హీరోను చూస్తుంది హీరోయిన్. ఎయింట్ నోబడీ అనే సాంగ్ బ్యాక్ గ్రౌండ్లో అదిరిపోయింది.

యాక్షన్ లవ్ స్టోరీ

లోకేష్ సినిమాలంటే మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ రవిచందర్ ఉండాల్సిందే. అది డైరెక్టర్ గా లోకేష్ తీసిన సినిమాలైనా, హీరోగా వస్తున్న మూవీ అయినా. అందుకే డీసీ మూవీకి కూడా అనిరుధే మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమాకు డీఓపీ ముకేష్. సన్ పిక్చర్స్ ఈ మూవీని నిర్మిస్తుంది. 2026 సమ్మర్ లో ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks