అనసూయపై బిగ్ బాస్ ఫేమ్ దివ్వెల మాధురి విరుచుకుపడింది. శివాజీ వివాదాస్పద కామెంట్లపై రియాక్టయిన మాధురి సంచలన వ్యాఖ్యలు చేసింది. శివాజీ మాట్లాడిన విధానం, ఉపయోగించిన పదాలు తప్పు కానీ ఆయన ఉద్దేశం తప్పు కాదని మాధురి చెప్పింది. ఆమె భర్త దువ్వాడ శ్రీనివాస్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
కొన్ని తప్పుడు మాటలు

శివాజీ కామెంట్లు వైరల్ గా మారాయి. హీరోయిన్ల డ్రెస్ తీరుపై శివాజీ ఓ మూవీ ఈవెంట్లో మాట్లాడుతూ ‘సామాన్లు’, ‘దొంగము**’ అనే పదాలు వాడాడు. దీనిపై అనసూయ, చిన్మయి లాంటి వాళ్లు ఫైర్ అయ్యారు. వీటిపై ఓ టీవీ డిబేట్లో దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి రియాక్టయ్యారు.
శివాజీ తప్పు లేదు
‘‘శివాజీ చెప్పిన దాంట్లో తప్పు లేదు. కానీ కొన్ని మాటలు తప్పుగా మాట్లాడారు. ఇప్పటికే సారీ కూడా చెప్పారు కాబట్టి క్లియర్. కొంతమంది హీరోయిన్లు అసభ్యకరంగానే బట్టలు వేసుకుంటున్నారు. స్త్రీ నిండుగా కట్టుకుంటే అందంగా ఉంటుంది. మితిమీరిన బట్టలు వేసుకుంటున్నారు. ప్రతి ఇంట్లోనూ ఒక మహిళ ఉంటుంది. మహిళను కించపరిచేలా శివాజీ అలాంటి పదాలు వాడి మాట్లాడకూడదు’’ అని మాధురి చెప్పింది.
బట్టలు విప్పుకొని
‘‘స్త్రీకి ఎప్పుడూ చీర అందం. డైరెక్టర్ కు చెప్పండి. డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు చెప్పినట్లే కదా హీరోయిన్లు బట్టలు వేసుకుంటారు. అందుకే వాళ్లకు ముందే చెప్పాలి’’ అని మాధురి తెలిపింది. ఏంటి నిండుగా బట్టలు వేసుకోకపోతే పోయేకాలం మగాళ్లకు అని అనసూయ, చిన్మయి లాంటి వాళ్లు అంటున్నారని యాంకర్ ప్రశ్నిస్తాడు.
‘‘అది మగవాళ్లను అడగండి. నచ్చినవాళ్లను బట్టలు విప్పుకొని తిరగమనండి. ఎవరి ఇష్టం వాళ్లది. అంతకంటే ఎక్కువ ఆమె గురించి మాట్లాడలేం’’ అని మాధురి తెలిపింది.
అతిగా మాట్లాడుతోందని
{{/usCountry}}‘‘అది మగవాళ్లను అడగండి. నచ్చినవాళ్లను బట్టలు విప్పుకొని తిరగమనండి. ఎవరి ఇష్టం వాళ్లది. అంతకంటే ఎక్కువ ఆమె గురించి మాట్లాడలేం’’ అని మాధురి తెలిపింది.
అతిగా మాట్లాడుతోందని
{{/usCountry}}‘‘శివాజీ చెప్పిన మాటల్లో తప్పు ఉంది. కానీ ఆయన ఉద్దేశంలో తప్పు లేదు. కానీ ఆయన వాడిన కొన్ని పదాలు ఇబ్బందికరంగా ఉన్నాయి. ఆ విషయంలో ఆయన సారీ కూడా చెప్పారు. అంతటితో విషయం ముగిసిపోవాలి. కానీ అనసూయ అనవసరంగా అతిగా మాట్లాడుతోంది’’ అని మాధురి ఘాటు వ్యాఖ్యలు చేసింది.
శివాజీ ఏమన్నారంటే?
దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివాజీ మాట్లాడుతూ హీరోయిన్లు పద్ధతిగా బట్టలు వేసుకోవాలని సూచించాడు. ‘సామాన్లు’ కనపడేలా కాదమ్మా, ‘దొంగము**’ అంటారు అనే పదాలు వాడారు. ఇవి వివాదానాకి దారితీశాయి. దీనిపై చిన్మయి, అనసూయ ఫైర్ అయ్యారు. కొంతమంది ఏమో శివాజీ చెప్పిన దాంట్లో తప్పు లేదు కానీ ఆయన మాటలే పద్ధతిగా లేవని అంటున్నారు.