Drishyam 3: దృశ్యం 3 క్రేజ్ మామూలుగా లేదు.. అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డ్.. మోహన్‌లాల్ సరికొత్త చరిత్ర!

Drishyam 3: మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ 'దృశ్యం 3' అడ్వాన్స్ బుకింగ్స్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా భారీ ప్రీ-సేల్స్ కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ విశేషాలు మీకోసం.

Published on: May 19, 2026, 13:59:36 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Drishyam 3: మలయాళ చిత్ర పరిశ్రమలోనే కాకుండా భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత ఆదరణ పొందిన 'దృశ్యం' ఫ్రాంచైజీ నుంచి రాబోతున్న మూడో భాగం థియేటర్లలో అలరించేందుకు సిద్ధమైంది. సూపర్ స్టార్ మోహన్‌లాల్ 66వ పుట్టినరోజును పురస్కరించుకుని మే 21న ఈ దృశ్యం 3 సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

దృశ్యం 3 పోస్టర్ లో మోహన్ లాల్
దృశ్యం 3 పోస్టర్ లో మోహన్ లాల్

దృశ్యం 3 అడ్వాన్స్ టికెట్లు

దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించిన 'దృశ్యం 3' సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఆదివారం అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాగా, కేవలం బుక్‌మైషో ప్లాట్‌ఫామ్‌లోనే 3.34 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడై ఈ చిత్రం సరికొత్త రికార్డుల దిశగా దూసుకుపోతోంది.

రూ. 20 కోట్లకు పైగా

ప్రంచవ్యాప్తంగా 'దృశ్యం 3' ప్రీ-సేల్స్ ద్వారా ఇప్పటికే రూ. 20 కోట్లకు పైగా వసూలు చేసినట్లు చిత్ర నిర్మాతలు ప్రకటించారు. ప్రముఖ బాక్సాఫీస్ ట్రాకింగ్ పోర్టల్ సక్నిల్క్ నివేదిక ప్రకారం, విడుదల కాకముందే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ. 15 కోట్ల మార్కును దాటేసింది. ఇందులో కేవలం కేరళ రాష్ట్రం నుంచే మొదటి రోజు కోసం దాదాపు రూ. 5 కోట్ల ప్రీ-సేల్స్ కలెక్షన్లు రావడం విశేషం.

మోహన్‌లాల్ రికార్డు

తన సొంత సినిమా రికార్డులను తానే బ్రేక్ చేస్తూ మోహన్‌లాల్ బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తున్నారు. గతంలో ఆయన నటించిన 'పేట్రియాట్' సినిమా బుక్‌మైషోలో 3,33,000 అడ్వాన్స్ టికెట్ల విక్రయాలతో సరికొత్త మైలురాయిని అందుకుంది. ఇప్పుడు 'దృశ్యం 3' కేవలం కొద్ది రోజుల్లోనే 3,34,000 టికెట్ల మార్కును దాటి ఆ రికార్డును తిరగరాసింది.

మలయాళ సినిమా చరిత్రలోనే అత్యధిక అడ్వాన్స్ బుకింగ్స్ సాధించిన రెండో దృశ్యం 3 ఇది నిలిచింది. ఈ జాబితాలో 1.33 మిలియన్ల (13.3 lakhs) టికెట్ల విక్రయాలతో 'L2: ఎంపురాన్' ఇప్పటికీ అగ్రస్థానంలో కొనసాగుతోంది. మలయాళ చిత్రసీమలో ఒక ప్యూర్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాకు ఈ స్థాయిలో ప్రీ-రిలీజ్ క్రేజ్ రావడం ఇదే తొలిసారి.

హౌస్‌ఫుల్ బోర్డులు

అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్స్ పరిశీలిస్తే, అన్ని ప్లాట్‌ఫామ్‌లలో కలిపి ప్రతి 24 గంటలకు దాదాపు 30,000 టికెట్లు అమ్ముడవుతున్నాయి. కేరళలో మొదటి రోజు బుకింగ్స్ రూ. 5 కోట్ల మార్కును దాటగా, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 2 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. కొచ్చి, త్రివేండ్రం, కాలికట్ వంటి ప్రధాన నగరాల్లో టికెట్లకు విపరీతమైన డిమాండ్ కనిపిస్తోంది. విడుదల రోజున తెల్లవారుజామున 4:00 గంటలకు, ఉదయం 7:00 గంటలకు ప్లాన్ చేసిన స్పెషల్ షోలకు ఇప్పుడే హౌస్‌ఫుల్ అయ్యాయి.

‘దృశ్యం 3’ గురించి

ఒక సీనియర్ పోలీస్ అధికారి కుమారుడు అదృశ్యమైన తర్వాత జార్జ్‌కుట్టి, అతని కుటుంబం ఎదుర్కొన్న అనుమానాలు, సవాళ్ల చుట్టూ 'దృశ్యం' సిరీస్ సాగుతుంది. మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో 2013లో విడుదలైన మలయాళ చిత్రం 'దృశ్యం' భారీ విజయాన్ని సాధించింది. ఆ తర్వాత 2022లో వచ్చిన రెండో భాగం కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు మే 21న ప్రేక్షకుల ముందుకు రానున్న మూడో భాగంపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ మూడు చిత్రాలకు జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు. మునుపటి భాగాల్లో నటించిన మీనా, అన్సిబా హసన్, ఎస్తేర్ అనిల్ ఈ చిత్రంలోనూ తమ పాత్రలను పునరావృతం చేస్తున్నారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఈ సినిమాకు 'U/A 13' సర్టిఫికేట్ మంజూరు చేసింది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

ప్రశ్న: 'దృశ్యం 3' సినిమా ఎప్పుడు విడుదలవుతుంది?

జవాబు: మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటించిన 'దృశ్యం 3' సినిమా మే 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

ప్రశ్న: ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికేట్ ఇచ్చింది?

జవాబు: సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి 'U/A 13' సర్టిఫికేట్ జారీ చేసింది.

ప్రశ్న: మలయాళ, హిందీ 'దృశ్యం 3' సినిమాలు ఒకేలా ఉంటాయా?

జవాబు: లేదు.. మలయాళ వెర్షన్, అజయ్ దేవగన్ నటించే హిందీ వెర్షన్ చిత్రాలు పూర్తిగా వేర్వేరు కథనాలతో సాగుతాయని నిర్మాతలు స్పష్టం చేశారు. హిందీ వెర్షన్ 2026 అక్టోబర్ 2న విడుదల కానుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More