ధురంధర్ విజయం తలకెక్కింది- అతను విషపూరితం- దృశ్యం 3 నుంచి తప్పుకున్న అక్షయ్ ఖన్నాపై నిర్మాత ఫైర్- లీగల్ నోటీసులు

బ్లాక్ బస్టర్ ధురంధర్ విజయంతో ఆ మూవీ నటులంతా హ్యాపీగా ఉన్నారు. కానీ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన అక్షయ్ ఖన్నాపై మాత్రం సంచలన ఆరోపణలు వస్తున్నాయి. దృశ్యం 3 నుంచి అతను తప్పుకోవడమే అందుకు కారణం. అక్షయ్ ఖన్నాకు ధురంధర్ విజయం తలకెక్కిందని దృశ్యం 3 ప్రొడ్యూసర్ అన్నాడు. 

Published on: Dec 27, 2025 5:37 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ధురంధర్ సినిమాలో అక్షయ్ ఖన్నా యాక్టింగ్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. కానీ మరోవైపు మాత్రం సంచలన ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అజయ్ దేవగణ్ హీరోగా తెరకెక్కుతున్న దృశ్యం 3 సినిమా షూటింగ్ నుంచి అతను తప్పుకోవడమే ఇందుకు కారణం. అక్షయ్ ఖన్నాకు ధురంధర్ విజయం తలకెక్కిందని దృశ్యం 3 ప్రొడ్యూసర్ కుమార్ మంగత్ పాఠక్ హిందుస్థాన్ టైమ్స్ తో మాట్లాడుతూ చెప్పాడు.

అక్షయ్ ఖన్నా
అక్షయ్ ఖన్నా

ఇదే కారణం

దృశ్యం 3 సినిమా నుంచి అక్షయ్ ఖన్నా తప్పుకోవడం వెనుక ఉన్న కారణాలను మంగత్ పాఠక్ వెల్లడించాడు. అంతే కాకుండా అతని స్థానంలో జైదీప్ అహ్లావత్ ను తీసుకున్నట్లు చెప్పాడు. ఛావా, ధురంధర్ విజయాలతో అక్షయ్ ఖన్నా తన రెమ్యునరేషన్ రూ.21 కోట్లకు పెంచాడని, అలాగే దృశ్యం 3 లో విగ్ వాడతానని చెప్పాడని పాఠక్ పేర్కొన్నాడు. దృశ్యం 2లో అక్షయ్ బట్టతలతో కనిపించాడు.

లీగల్ నోటీస్

శనివారం (డిసెంబర్ 27) నిర్మాత కుమార్ మంగత్ పాఠక్ హిందుస్థాన్ టైమ్స్ తో మాట్లాడుతూ.. "అతని (అక్షయ్ ఖన్నా) ప్రవర్తన వల్ల నేను నష్టపోయా. నేను చట్టపరమైన చర్య తీసుకుంటా. ఇప్పటికే అతనికి లీగల్ నోటీసు పంపా. అతను ఇంకా స్పందించలేదు" అని తెలిపాడు. దృశ్యం సినిమాలో అక్షయ్ ఖన్నా ఐజి తరుణ్ అహ్లావత్ పాత్ర పోషిస్తున్నాడు. అతను తన కొడుకు హత్యకు విజయ్ సాలగాంకర్ (అజయ్ దేవ్‌గణ్) ను జైలుకు పంపాలని కోరుకుంటాడు.

రెమ్యునరేషన్

అక్షయ్ ఖన్నా దృశ్యం 3 రెమ్యునరేషన్ ను మూడు సార్లు చర్చించామని మంగత్ పాఠక్ అన్నాడు. అతను రూ.21 కోట్లు డిమాండ్ చేశాడని చెప్పాడు. తన జీతాన్ని మూడు సార్లు చర్చించినప్పటికీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత నిర్మాత కాల్స్ కు స్పందించడం మానేశారని సమాచారం. అక్షయ్ పారితోషికంపై అంగీకారం తెలిపిన తర్వాత వెనక్కి తగ్గారని నిర్మాత ఆరోపించాడు. ఒప్పందం కూడా కుదిరిందని సమాచారం. అయితే షూట్ కు 10 రోజుల ముందు పని చేయడానికి నిరాకరించాడు.

విగ్గు వివాదం

ఈ సారి అక్షయ్ ఖన్నా తన పాత్ర కోసం విగ్గు ధరించాలనుకున్నట్లు తెలుస్తోంది. అయితే నిర్మాతలు దీనికి ఒప్పుకోలేదు. "మేము అక్షయ్ ఖన్నా తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాం. అతని వైపు నుంచి చాలా చర్చల తర్వాత అతని జీతం కూడా ఖరారైంది. అతను విగ్గు ధరించాలని కోరుకున్నాడు. కానీ దర్శకుడు అభిషేక్ పాఠక్ ఏమో ఇది దృశ్యం 2 సీక్వెల్ కాబట్టి, కొనసాగింపు సమస్యలు వస్తాయని చెప్పాడు. అతని చుట్టూ ఉన్నవారు విగ్గు ధరిస్తే మరింత స్మార్ట్ గా కనిపిస్తాడని సలహా ఇచ్చారు’’ అని పాఠక్ చెప్పాడు

విషపూరితం

"అక్షయ్ ఖన్నా విషపూరితమైన వాడు. ఒకప్పుడు అతను జీరో. అప్పుడే నేను అతనితో సెక్షన్ 375 (2019) తీశాను. అప్పుడు కూడా, అతని వృత్తిపరమైన ప్రవర్తన కారణంగా అతనితో పనిచేయవద్దని చాలా మంది మాకు చెప్పారు. సెట్ లో అతని శక్తి చాలా విషపూరితమైనది. సెక్షన్ 375 అతనికి గుర్తింపు తెచ్చింది. తరువాత నేను అతనిని దృశ్యం 2 (2022) లో తీసుకున్నాను. దృశ్యం 2 తర్వాతే అతనికి అన్ని పెద్ద ఆఫర్లు వచ్చాయి. అంతకుముందు అతను 3-4 సంవత్సరాలు ఇంట్లో కూర్చునే ఉన్నాడు" అని పాఠక్ అన్నాడు.

విజయం తలకెక్కింది

"ఒకవేళ అతను సూపర్ స్టార్ అయ్యానని నమ్మితే, పెద్ద బడ్జెట్ తో సొంత సినిమా చేసి, దానికి ఎవరు మద్దతు ఇస్తారో చూసుకోవాలి" అని కుమార్ అన్నాడు. ధురంధర్ విజయం తలకెక్కిందని కుమార్ ఆరోపించాడు. అక్షయ్ ఖన్నా ఈ ఆరోపణలకు ఇంకా స్పందించలేదు.