'దృశ్యం' ఫేమ్ ఎస్తర్ అనిల్ అరుదైన ఘనత సాధించింది. ప్రపంచ ప్రఖ్యాత 'లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్' నుంచి ఇంటర్నేషనల్ డెవలప్మెంట్లో డిగ్రీ పూర్తి చేసింది. ఈ సందర్భంగా ఆర్థిక ఇబ్బందుల వల్ల ఒకప్పుడు ఆ చదువును వదులుకోవాలనుకున్నానని, తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి వచ్చానని ఎస్తర్ రాసుకొచ్చిన ఎమోషనల్ నోట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
దృశ్యం పాప ఇప్పుడిలా..

వెంకటేశ్ నటించిన 'దృశ్యం' సినిమాలో చిన్న పాపగా నటించి అందరినీ ఆకట్టుకున్న ఎస్తర్ అనిల్ ఇప్పుడు పెద్దదైపోయింది. అంతేకాదు చదువులోనూ టాప్ అని నిరూపించుకుంది. ప్రతిష్టాత్మకమైన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి పట్టా అందుకుంది. గ్రాడ్యుయేషన్ ఫోటోలను షేర్ చేస్తూ ఆమె రాసిన నోట్ చదివి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
"నాన్నకు పిచ్చి అనుకున్నా.."
కొన్నేళ్ల క్రితం వాళ్ళ నాన్న ఈ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ గురించి చెప్పినప్పుడు.. "ఇవన్నీ మనవల్ల అయ్యే పనులు కాదు.. నాన్నకు పిచ్చి, అందని ద్రాక్ష కోసం ఆశపడుతున్నారు" అనుకుందట ఎస్తర్ అనిల్.
"కానీ ఈరోజు ఆయన కూతురు అదే కాలేజీ ముందు గ్రాడ్యుయేట్ అయి నిలబడింది. లైఫ్ లో నిజంగా మ్యాజిక్ ఉంటుంది" అని ఎస్తర్ ఎమోషనల్ అయింది.
"డబ్బుల్లేవని ఇంట్లో చెప్పలేదు.."
ఎస్తర్ కు సీటు వచ్చాక కూడా మొదట్లో ఇంట్లో చెప్పలేదట. కారణం.. అప్పటికే తన ఇద్దరు అన్నయ్యలు స్టూడెంట్ లోన్లతో చదువుతున్నారు. ఎస్తర్ దగ్గర కూడా డబ్బులు లేవు. ఆ భారీ ఫీజులు కట్టే స్తోమత తమకు లేదని ఆమెకు తెలుసు. కానీ విషయం తెలిశాక వాళ్ళ అమ్మనాన్నలు కష్టపడైనా సరే వెళ్లమని ధైర్యం చెప్పి పంపించారట. వారికి ఎస్తర్ కృతజ్ఞతలు తెలిపింది.
ప్రపంచంలోని బెస్ట్ స్టూడెంట్స్ మధ్య తాను ఒక ఫెయిల్యూర్ లా అనిపించేదాన్ని అని, 'ఇంపోస్టర్ సిండ్రోమ్'తో బాధపడ్డానని ఆమె నిజాయతీగా ఒప్పుకుంది. అయితే చివరికి 'ఉమెన్ అండ్ పవర్' అనే అంశంపై థీసిస్ రాసి ‘డిస్టింక్షన్’ సాధించింది. "బహుశా నేను అంత డల్ స్టూడెంట్ ని కాదేమో.. పవర్ఫుల్ ఉమెన్ లిస్ట్ లో నేను కూడా చేరతానేమో" అని రాసుకొచ్చింది.
{{/usCountry}}ప్రపంచంలోని బెస్ట్ స్టూడెంట్స్ మధ్య తాను ఒక ఫెయిల్యూర్ లా అనిపించేదాన్ని అని, 'ఇంపోస్టర్ సిండ్రోమ్'తో బాధపడ్డానని ఆమె నిజాయతీగా ఒప్పుకుంది. అయితే చివరికి 'ఉమెన్ అండ్ పవర్' అనే అంశంపై థీసిస్ రాసి ‘డిస్టింక్షన్’ సాధించింది. "బహుశా నేను అంత డల్ స్టూడెంట్ ని కాదేమో.. పవర్ఫుల్ ఉమెన్ లిస్ట్ లో నేను కూడా చేరతానేమో" అని రాసుకొచ్చింది.
{{/usCountry}}ఎస్తర్ అనిల్ పోస్టుపై సెలబ్రిటీలు అయిన నజ్రియా నజీమ్, అపర్ణ బాలమురళి, ఏఆర్ రెహమాన్ కూతురు ఖతీజా తదితరులు కంగ్రాట్స్ చెప్పారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన ఎస్తర్.. మలయాళం, తెలుగు, తమిళ భాషల్లో 'దృశ్యం' సిరీస్ లో నటించింది. తెలుగులో 'జోహార్' సినిమాలో లీడ్ రోల్ చేసింది. త్వరలో ‘దృశ్యం 3’లో మళ్ళీ అలరించనుంది.