Epic Trailer: 'బేబి' లాంటి సంచలన బ్లాక్బస్టర్ తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన లేటెస్ట్ లవ్స్టోరీ 'ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్' (Epic: First Semester) ట్రైలర్ గ్రాండ్గా రిలీజ్ అయింది. '90s మిడిల్ క్లాస్ బయోపిక్' సిరీస్తో ఆకట్టుకున్న డైరెక్టర్ ఆదిత్య హాసన్ తెరకెక్కించిన ఈ మూవీ ట్రైలర్, యూత్ఫుల్ ఎమోషన్స్ తో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఆదిత్య - కడలి ప్రేమ కథ.. ఫినిష్ కాని ఒక అధ్యాయం

ఎపిక్ మూవీ ట్రైలర్ చూస్తుంటే కాలేజ్ డేస్, ఫస్ట్ లవ్, లవర్స్ మధ్య మనస్పర్ధల చుట్టూ కథ నడుస్తున్నట్లు అర్థమవుతోంది. ఆనంద్ దేవరకొండ 'ఆదిత్య' పాత్రలో, వైష్ణవి చైతన్య 'కడలి' అనే క్యారెక్టర్లో కనిపించి తమ నాచురల్ యాక్టింగ్తో ఆకట్టుకున్నారు.
కాలేజ్ బ్యాక్డ్రాప్లో మొదలైన వీరి లవ్ స్టోరీలో ఎమోషన్స్, బాధ, రొమాన్స్ పర్ఫెక్ట్గా మిక్స్ అయ్యాయి. "ఒక ప్రేమ కథ.. లెక్కలేని భావోద్వేగాలు.. ఒక ముగియని అధ్యాయం" అంటూ మేకర్స్ ఇచ్చిన క్యాప్షన్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది.
90s వెబ్ సిరీస్ లోని ఆదిత్య పాత్ర పెరిగి పెద్దదైన తర్వాత ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లడం, అక్కడ అమ్మాయితో ప్రేమలో పడటం ఈ ట్రైలర్ లో చూపించారు. ఆదిత్య తల్లిదండ్రుల పాత్రల్లో శివాజీ, వాసుకి తిరిగి వచ్చారు. ఆదిత్య మార్క్ కామెడీ డైలాగులు, ఆనంద్, వైష్ణవి రొమాంటిక్ సీన్లు ఈ ట్రైలర్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
'90s' డైరెక్టర్ విజన్, హేషమ్ మ్యాజికల్ మ్యూజిక్
ఈ ఎపిక్ సినిమాకు అసలైన ప్లస్ పాయింట్ దర్శకుడు ఆదిత్య హాసన్ మేకింగ్ అని చెప్పొచ్చు. ఓటీటీలో '90s మిడిల్ క్లాస్ బయోపిక్' వెబ్ సిరీస్తో రికార్డు వ్యూస్ రాబట్టిన ఆదిత్య.. ఈసారి బిగ్ స్క్రీన్పై ఫుల్ లెంగ్త్ లవ్ స్టోరీతో మేజిక్ చేయడానికి సిద్ధమయ్యారు.
అలాగే 'ఖుషి', 'హాయ్ నాన్న' సినిమాలతో చార్ట్బస్టర్ ఆల్బమ్స్ అందించిన హేషమ్ అబ్దుల్ వహాబ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, పాటలు ట్రైలర్కు ప్రాణంగా నిలిచాయి. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ ప్రాజెక్ట్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ చాలా రిచ్గా ఉన్నాయి.
సెప్టెంబర్ 11న థియేటర్లలో రిలీజ్
{{/usCountry}}అలాగే 'ఖుషి', 'హాయ్ నాన్న' సినిమాలతో చార్ట్బస్టర్ ఆల్బమ్స్ అందించిన హేషమ్ అబ్దుల్ వహాబ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, పాటలు ట్రైలర్కు ప్రాణంగా నిలిచాయి. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ ప్రాజెక్ట్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ చాలా రిచ్గా ఉన్నాయి.
సెప్టెంబర్ 11న థియేటర్లలో రిలీజ్
{{/usCountry}}ఆనంద్ దేవరకొండ, వైష్ణవి కాంబినేషన్కు యూత్లో మంచి క్రేజ్ ఉంది. 'బేబి' తర్వాత మళ్లీ ఈ ఇద్దరూ జంటగా నటిస్తుండటంతో థియేటర్ల దగ్గర మంచి ఓపెనింగ్స్ వస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
సెప్టెంబర్ 11న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. మరి ఈ 'ఫస్ట్ సెమిస్టర్' లవ్స్టోరీ ఆడియన్స్ను ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.