...
...
Next Story

OTT: అనగనగా ఓ శుక్రవారం.. మీరు మరొకరిలా మారిపోతే.. ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ మూవీ.. ఇంద్రజ లీడ్ రోల్లో..

OTT: ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ సినిమా స్ట్రీమింగ్ కు వస్తోంది. అనగనగా ఓ శుక్రవారం పేరుతో ఈటీవీ విన్ ఓటీటీ తన కథాసుధలో భాగంగా ఈ సినిమాను తీసుకొస్తోంది. వచ్చే ఆదివారం (జులై 19) నుంచి స్ట్రీమింగ్ కానుంది.

Published on: Jul 14, 2026, 19:08:19 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

OTT: ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సరికొత్త మైండ్ బెండింగ్ కాన్సెప్ట్‌తో డిజిటల్ ఆడియన్స్ ముందుకు వస్తోంది. 'కథా సుధా - సండే స్టోరీస్' ఆంథాలజీ సిరీస్‌లో భాగంగా 'అనగనగా ఓ శుక్రవారం' అనే క్రేజీ సినిమాను జులై 19న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఒకరి జీవితం ఇంకొకరిగా మారిపోతే ఎలా ఉంటుందనే ఇంట్రెస్టింగ్ ఫాంటసీ లైన్‌తో ఈ కథ నడవబోతోంది.

ఒకే ఒక్క రాత్రిలో లైఫ్ తారుమారు!

OTT: అనగనగా ఓ శుక్రవారం.. మీరు మరొకరిలా మారిపోతే.. ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ మూవీ.. ఇంద్రజ లీడ్ రోల్లో..
OTT: అనగనగా ఓ శుక్రవారం.. మీరు మరొకరిలా మారిపోతే.. ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ మూవీ.. ఇంద్రజ లీడ్ రోల్లో..

"ఒకవేళ మీరు పొద్దున్నే లేచేసరికి మీ లైఫ్ కాకుండా వేరే ఎవరిదో జీవితంలో బతుకుతుంటే ఎలా ఉంటుంది?" అనే షాకింగ్ క్యాప్షన్‌తో ఈ షార్ట్ ఫిల్మ్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

తెలుగులో 'శుక్రవారం తారుమారు' అనే ట్యాగ్‌లైన్ పెట్టడంతో ఈ స్టోరీ చుట్టూ ఏదో పెద్ద ఫాంటసీ లేదా సస్పెన్స్ ఎలిమెంట్ ఉందని స్పష్టంగా అర్థమవుతోంది. హాలీవుడ్‌లో బాడీ స్వాపింగ్ లేదా అల్టర్నేట్ రియాలిటీ కాన్సెప్ట్‌లు చాలా పాపులర్. ఇప్పుడు అదే లెవెల్ హై-కాన్సెప్ట్ థ్రిల్‌ను లోకల్ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో చూపించబోతున్నారు.

'కథా సుధ' ఆంథాలజీతో ఈటీవీ విన్ కొత్త ప్లాన్

ఈ మధ్య కాలంలో కథాసుధ పేరుతో ఈటీవీ విన్ మిడిల్ క్లాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా మంచి ఎమోషనల్ షార్ట్ ఫిల్మ్స్ తీసుకొస్తున్న సంగతి తెలుసు కదా. అందులో భాగంగానే ఈ అనగనగా ఓ శుక్రవారం కూడా రాబోతోంది.

ఇందులో సీనియర్ నటి ఇంద్రజ నటించడం విశేషం. పోస్టర్ కూడా చాలా ఇంట్రెస్టింగా ఉంది. ఓ గృహిణి, మరో నవతరం అమ్మాయి ఒకరి జీవితాల్లోకి మరొకరు వెళ్లినట్లుగా ఈ పోస్టర్ ను రూపొందించారు. ఈ పోస్టర్ తోనే మూవీ కాన్సెప్ట్ ఎంత భిన్నంగా ఉండబోతోందో అర్థమవుతోంది.

మధురాపురి సదన మూవీ కూడా..

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe