Gunde Ninda Gudi Gantalu Today Episode: మీనాకు చేతులెత్తి దండం పెట్టిన సత్యం.. బాలు కాళ్లపై పడ్డ శివ.. విరిగిన గుణ మెడ

Gunde Ninda Gudi Gantalu Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ టుడే ఎపిసోడ్ లో బాలుని మీనా విడిపించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి సక్సెస్ అవుతుంది. అయితే ఈ క్రమంలో సత్యంతోపాటు ఇంట్లో వాళ్లతోనూ నానా పాటలు పడతారు.

Mar 9, 2026, 08:10:26 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గుండె నిండా గుడి గంటలు సీరియల్ టుడే ఎపిసోడ్ లో బాలుని జైల్లో వేస్తారు. అతన్ని విడిపించుకోవడానికి చేసే ప్రయత్నంలో శృతి వాళ్ల తల్లిదండ్రుల సాయం కోరడం, వాళ్లు కాస్తా ఇంట్లో చిచ్చు పెట్టడం జరుగుతుంది. అటు బయటకు వచ్చిన బాలు.. గుణ చేతులతోపాటు మెడ కూడా విరగ్గొడతాడు.

Gunde Ninda Gudi Gantalu Today Episode: మీనాకు చేతులెత్తి దండం పెట్టిన సత్యం.. బాలు కాళ్లపై పడ్డ శివ.. విరిగిన గుణ మెడ
Gunde Ninda Gudi Gantalu Today Episode: మీనాకు చేతులెత్తి దండం పెట్టిన సత్యం.. బాలు కాళ్లపై పడ్డ శివ.. విరిగిన గుణ మెడ

జైల్లో బాలు.. పోలీస్ స్టేషన్‌లో మీనా, శివ

గుండె నిండా గుడి గంటలు సీరియల్ సోమవారం (మార్చి 9) ఎపిసోడ్ బాలుని జైల్లో వేసే సీన్ తో మొదలవుతుంది. దీంతో మీనా, శివ పోలీస్ స్టేషన్ కు వెళ్తారు. అసలు ఏం జరిగిందో, తాము ఆడిన నాటకమేంటో ఎస్సైకి చెబుతారు. కానీ అతడు వినడు. సీఐ మేడమ్ వచ్చిన తర్వాతే తేల్చుకోండని చెప్పి వెళ్లిపోతాడు.

శృతికి మీనా ఫోన్.. తల్లి, తండ్రిని రిక్వెస్ట్ చేసిన శృతి

ఏం చేయాలో తెలియక శృతికి ఫోన్ చేస్తుంది మీనా. దీంతో ఆమె తన తల్లి శోభకు ఫోన్ చేసి తన ఫ్రెండ్ జైల్లో ఉన్నాడని, డాడీకి చెప్పి విడిపించమని అడుగుతుంది. శోభ తన భర్త దగ్గరికి వెళ్లి చెబితే.. ఆ వ్యక్తి బాలు అని చెప్పాల్సి వస్తుంది.

దీంతో తనను కొట్టిన బాలుని తాను విడిపించనని అతడు తేల్చి చెబుతాడు. అంతేకాదు ఆ బాలుపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఇదే సరైన సమయం అంటూ అతడు జైల్లో ఉన్నాడని సత్యంకి ఫోన్ చేసి చెప్పమని అంటాడు. దీంతో శోభ.. సత్యానికి అసలు విషయం చెబుతుంది.

మీనాను నిలదీసిన ఇంట్లో వాళ్లు.. నానా మాటలు అన్న సత్యం

ఇటు మీనా ఇంటికి రాగానే ప్రభావతి నిలదీస్తుంది. తర్వాత సత్యం, రవి, శృతి, మనోజ్, రోహిణి కూడా వస్తారు. బాలు ఎక్కడ అని అడిగితే మీనా అబద్ధం చెబుతుంది. ట్రిప్ కు వెళ్లాడంటే పోలీస్ స్టేషన్ కా అని ప్రభావతి అడగడంతో షాక్ తింటుంది. శృతి తల్లి ఫోన్ చేసి తమకు ఈ విషయం చెప్పిందని సత్యం అంటాడు.

దీంతో అసలు ఏం జరిగిందో సత్యంకు చెబుతుంది మీనా. అయినా అతడు కూడా మీనాను, బాలునే తిడతాడు. ఇంటి పరువు తీశారని ప్రభావతి, రోహిణి, మనోజ్ అంటారు. దీంతో సత్యం కూడా తొలిసారి బాలు, మీనాలను నానా మాటలు అంటాడు. మీనాకు చేతులెత్తి దండం పెట్టి ఇంటి పరువు తీసే పనులు చేయద్దని అని వెళ్లిపోతాడు. దీంతో మీనా ఏడుస్తుంది.

సీఐని వేడుకొని బాలుని విడిపించిన మీనా

అటు ఉదయాన్నే మీనా పోలీస్ స్టేషన్ కు వెళ్తుంది. సీఐ మేడమ్ ను వేడుకుంటుంది. అయినా ఆమె వినకుండా కోర్టుకు తీసుకెళ్తానని అంటుంది. నిన్ను రోజూ కొడుతున్నాడట.. తాళి కూడా తాకట్టు పెట్టాడట కదా అని అడుగుతుంది. అయితే తాము ఓ నాటకం ఆడటం వల్లే ఇదంతా జరిగిందని మీనా చెబుతుంది. అప్పుడు శివ బ్యాగులో మందు బాటిల్ ఉండటం, దానిని బాలు తన నెత్తి మీద వేసుకోవడం అంతా సీఐకి మీనా వివరిస్తుంది. దీంతో ఆమె ఇద్దరికీ గట్టి వార్నింగ్ ఇచ్చి వదిలేస్తుంది.

బాలు కాళ్లపై పడిన శివ

బయటకు రాగానే బావ బాలు కాళ్లపై పడతాడు శివ. తనను క్షమించమని అడుగుతాడు. ఇదంతా తన వల్లే జరిగిందని అంటాడు. అది చూసి సుమతి సంతోషిస్తుంది. ఒక్క దెబ్బకు గుణ ఏంటో శివకి తెలియడంతోపాటు బాలు బావ మంచితనం గురించి కూడా తెలిసిందని అంటుంది. అప్పుడే రాజేష్ ఫోన్ చేసి గుణ ఎక్కడ ఉన్నాడో తనకు తెలుసని, రావాలని చెబుతాడు. సరే అని బాలు వెళ్తాడు.

గుణని మళ్లీ చితకబాదిన బాలు

గుణ కోసం బాలు, రాజేష్ కాపు కాస్తారు. వడ్డీ వ్యాపారం చేసే గుణని మాయమాటలు చెప్పి రాజేష్ రప్పిస్తాడు. అతడు రాగానే కారులో బాలు కూడా ఉండటం చూసి పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. దీంతో బాలు అతని పట్టుకొని చితకబాదుతాడు. రెండు చేతులతోపాటు ఈసారి అతని మెడ కూడా విరగ్గొడతాడు బాలు.

అత్తకి గట్టిగానే ఇచ్చుకున్న మీనా

ఇటు ఇంటికి వచ్చిన బాలు, మీనాలను చూసి ప్రభావతి నానా మాటలు అంటుంది. అటు మనోజ్, రోహిణి కూడా బయటకు వచ్చి తిడతారు. చివరికి సత్యం కూడా అతనితో మాట్లాడడు. తన పుట్టింటి వాళ్లను ప్రభావతి మరోసారి తిట్టడంతో మీనా రెచ్చిపోతుంది. నువ్వు ఇన్నాళ్లు చేసిన డ్రామాల సంగతేంటని ప్రభావతితోపాటు మనోజ్, రోహిణిలకు కూడా గట్టిగానే ఇస్తుంది. సత్యంని బాలు క్షమాపణ అడుగుతాడు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More