Hanuman Ansh Director Vishal Chaturvedi On Bollywood: చిత్రసీమలో ఒక్కోసారి ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చే చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద సృష్టించే ప్రభంజనం సామాన్యంగా ఉండదు. ఇటీవల కన్నడ స్టార్ యశ్ నటించిన 'టాక్సిక్' వంటి భారీ చిత్రాల హవా నడుస్తున్న సమయంలోనూ, సైలెంట్గా వచ్చి థియేటర్లలో తుపాను సృష్టిస్తోంది 'హనుమాన్ అంశ్'.
థియేటర్ల కోత నుంచి రూ.72 కోట్ల సునామీ వరకు!

కేవలం రూ.2 కోట్ల పరిమిత బడ్జెట్తో రూపొందిన హనుమాన్ అంశ్ చిత్రం ప్రస్తుతం 4వ వారంలోనూ తగ్గకుండా రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోతోంది. మొదటి రోజు కేవలం రూ.10 లక్షల వసూళ్లతో మొదలైన ఈ సినిమా ప్రయాణం ఆ తర్వాత ఊహించని మలుపు తిరిగింది.
మల్టీప్లెక్స్ దిగ్గజాలైన పీవీఆర్, సినీపోలిస్ వంటి సంస్థలు ఆరంభంలో ఈ చిన్న సినిమాను ప్రదర్శించేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. భారీ సినిమాల కోసం 'హనుమాన్ అంశ్' షోలను 250 నుంచి ఏకంగా 25కి తగ్గించేశాయి. అయితే, ప్రేక్షకుల నుంచి వచ్చిన అపూర్వ ఆదరణ (Word of Mouth) ఈ చిత్రం కలెక్షన్స్నే మార్చేసింది.
"హిట్ అయ్యాకే ఫోన్లు చేశారు".. బాలీవుడ్ వైఖరిపై డైరెక్టర్ విమర్శలు
మూడో వారం వచ్చేసరికి వసూళ్ల పర్వం మొదలై, ఇప్పటివరకు ఏకంగా రూ.72.88 కోట్ల గ్రాస్ రాబట్టింది హనుమాన్ అంశ్ సినిమా. ఈ సినిమా సాధించిన ఈ ఘన విజయంపై దర్శకుడు విశాల్ చతుర్వేది ఇటీవల ఓ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా విడుదల కాకముందు బాలీవుడ్ నుంచి తమకు ఎలాంటి మద్దతు లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
"సినిమా హిట్ అయి డబ్బులు వస్తున్నాయని తెలిశాక చాలామంది ఫోన్లు చేసి అభినందనలు తెలుపుతున్నారు. సినిమా తీసేటప్పుడు సహాయం అడిగితే ముఖం చాటేసినవాళ్లే ఇప్పుడు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు" అని డైరెక్టర్ విశాల్ చతుర్వేది స్పష్టం చేశారు.
వ్యాపారం కోసం వచ్చేవారు కొందరు
{{/usCountry}}"సినిమా హిట్ అయి డబ్బులు వస్తున్నాయని తెలిశాక చాలామంది ఫోన్లు చేసి అభినందనలు తెలుపుతున్నారు. సినిమా తీసేటప్పుడు సహాయం అడిగితే ముఖం చాటేసినవాళ్లే ఇప్పుడు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు" అని డైరెక్టర్ విశాల్ చతుర్వేది స్పష్టం చేశారు.
వ్యాపారం కోసం వచ్చేవారు కొందరు
{{/usCountry}}హిందీ చిత్ర పరిశ్రమలో ఎక్కువమంది అయోమయంలో ఉన్నారని, ఏ కంటెంట్ ఆడుతుందో ఎవరికీ స్పష్టత ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. సినిమాపై నిజమైన ప్రేమతో తీసేవారు కొందరైతే, వ్యాపారం కోసం వచ్చేవారు మరికొందరని డైరెక్టర్ విశాల్ చతుర్వేది పేర్కొన్నారు.
ప్రసిద్ధ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలీ బాబా (మహారాజ్ జీ) జీవిత విశేషాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. తల్లిని కోల్పోయిన ఒక చిన్నారి దేవుడి కోసం వెతికే క్రమంలో నీమ్ కరోలీ బాబాగా మారి మానవాళికి సేవ చేసే విధానాన్ని దర్శకుడు గుండెలకు హత్తుకునేలా తీర్చిదిద్దారు. శోభినాథ్ సత్య తన నటనా విశ్వరూపంతో అలరించారు.
కంగనా, మధుర్ భండార్కర్ ప్రశంసలు
"హనుమాన్ అంశ్ చూస్తున్నంతసేపూ థియేటర్లో కోట్లాది మంది ప్రేక్షకులు మంత్రముగ్ధులై కూర్చున్నారు. దర్శకుడు విశాల్ చాలా నిజాయితీగా ఈ కథను తెరకెక్కించారు" అని ప్రముఖ దర్శకుడు మధుర్ భండార్కర్ ప్రశంసించారు.
అలాగే బాలీవుడ్ హీరోయిన్, ఎంపీ కంగనా రనౌత్ ఈ చిత్రాన్ని ఒక 'సత్సంగం'గా అభివర్ణించారు. మానసిక ప్రశాంతత కోసం థెరపీలకు వెళ్లే బదులు ఈ సినిమా చూస్తే మంచిదని ఆమె ప్రేక్షకులకు సూచించారు. బాక్సాఫీస్ వద్ద సాధించిన ఈ ఘన విజయంతో చిత్ర యూనిట్ ఇప్పటికే పార్ట్-2 (సీక్వెల్)ను కూడా అధికారికంగా ప్రకటించింది.